Venu Goapl Reddy
Author- NTV Telugu-
Bengaluru: వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ క్లాసులు.. కోవిడ్ని గుర్తు చేస్తున్న బెంగళూర్ నీటి సంక్షోభం..
Bengaluru Water crisis: వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ క్లాసులు.. కోవిడ్ని గుర్తు చేస్తున్న బెంగళూర్ నీటి సంక్షోభం..బెంగళూర్ వాసులకు నీటి కష్టాలు కన్నీటిని తెప్పిస్తున్నాయి. ఎండలు పూర్తిగా ముదరకముందే సిలికాన్ వ్యాలీ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వ కష్టపడుతోంది. ఇప్పటికే చాలా వరకు అపార్ట్మెంట్లలో నీరు లేదు. దీంతో వారంతా డిస్పోజబుల్ ప్లేట్లను, వెట్ వైప్లను వాడుతున్నారు. మరికొందరు సమీపంలోని మాల్స్లకి కస్టమర్లలా వెళ్లి కాలకృత్యాలను తీర్చుకుంటున్నారు. మరో మూడు నాలుగు నెలలు కానిదే రుతుపవనాలు వచ్చే పరిస్థితి… -
Arvind Kejriwal: “హిందూ, సిక్కు శరణార్థులు పాకిస్తానీలు”.. నిరసనలపై కేజ్రీవాల్ కామెంట్స్….
Arvind Kejriwal: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలును వ్యతిరేకిస్తూ, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చిన శరణార్థుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కి నిరసన సెగ తగిలింది. తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ హిందూ, సిక్కు శరణార్థులు కేజ్రీవాల్ ఇంటి నివాసం వద్ద నిరసనకు దిగారు. అయితే వీరిని ‘పాకిస్తానీలు’ అని పిలిచి మరో వివాదానికి తెరలేపారు. -
Supreme Court: ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ..
Supreme Court: ఎలక్షన్ కమిషనర్ల నియామకాన్ని తాత్కాలికంగా నిలిపేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధుల నియామకంపై స్టే విధించేందుకు అంగీకరించలేదు. దీనిపై వచ్చే వారం కోర్టు విచారణ చేపట్టనుంది. మాజీ ఐఏఎస్ అధికారులైన ఇద్దరిని ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నిన్న ఎంపిక చేసింది. -
Lok Sanha Elections 2024: రేపు మధ్యాహ్నం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ
Lok Sanha Elections 2024: లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ రేపు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. లోక్సభతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. లోక్సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు షెడ్యూల్ విడుదల కానుంది. -
Russia: రష్యన్ ఆయిల్ టైకూన్ అనుమానాస్పద మృతి.. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత నాలుగో ఘటన..
Russia: రష్యాకు చెందిన ఆయిల్ అండ్ గ్యాస్ దిగ్గజం లుకోయిల్ వైస్ ప్రెసిడెంట్ విటాలీ రాబర్టస్ తన కార్యాలయంలో ఆత్మహత్య పాల్పడ్డారు. మార్చి 12న రాబర్టస్ మరణించాడని లుకోయిల్ సంస్థ చెప్పినట్లు యూరో న్యూస్ నివేదించింది. రష్యాలో అతిపెద్ద చమురు కంపెనీ లుకోయిల్ డిప్యూటీ సీఈవో విటాలీ రాబర్టస్(53) అకస్మాత్తుగా మరణించారని ఉక్రేనియన్-అమెరికన్ ఆర్థికవేత్త రోమన్ షరెమెటా ట్వీట్ చేశారు. అయితే మరణానికి కారణాలను వెల్లడించలేదు. -
PM Modi: వచ్చే వారం భూటాన్ పర్యటనకు ప్రధాని నరేంద్రమోడీ..
PM Modi: వచ్చే వారం ప్రధాని నరేంద్రమోడీ భూటాన్ దేశ పర్యటకు వెళ్లనున్నారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్ చేసిన ఆహ్వానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. -
Congress: కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గింపు రాహుల్ గాంధీ ఘనతే..
Congress: పెట్రోల్-డిజిల్ ధరలతో సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో కేంద్రం ఇంధన ధరల్ని మార్చి 15 నుంచి రూ. 2 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. పెట్రోల్-డిజిల్ ధరల తగ్గింపు వినియోగదారుల వ్యయాన్ని పెంచుతుందని, 27 లక్షల ద్విచక్రవాహనాలు, 58 లక్షల భారీ వాహనాలు, 6 కోట్ల కార్ల నిర్వహణ ఖర్చుల్ని తగ్గిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే, ఈ తగ్గింపును రాహుల్ గాంధీ ఘనతగా కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్ నేత నిర్వహిస్తున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రభావం చూపిందని, అందుకే కేంద్రం ఇంధన ధరల్ని… -
Poorest Countries: ప్రపంచంలో అత్యంత పేద దేశాలు ఇవే.. ఐఎంఎఫ్ నివేదిక..
Poorest Countries: ప్రపంచంలో అత్యంత పేదదేశాలుగా ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) తలసరి జీడీపీ ఆధారంగా కొనుగోలు శక్తి సమానత్వం(పీపీపీ)ని హైలెట్ చేస్తూ ఒక నివేదికను విడుదల చేసింది. జీడీపీ ఒక దేశం యొక్క మొత్తం ఆర్థిక ఉత్పత్తికి కొలమానంగా ఉంటే, పీపీపీ అనేది ప్రజల జీవన వ్యయాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఆఫ్రికా దేశం దక్షిణ సూడాన్ ప్రపంచంలోనే అత్యంత పేద దేశంగా ఉంది. ఈ దేశ జీడీపీ తలసరి పీపీపీ 492.72 డాలర్లుగా ఉంది. 2011లో పొందిన ఈ దేశం రాజకీయ… -
Bengaluru Water Crisis: బెంగళూర్లో నీటి కష్టాలకు కారణం ఏమిటో తెలుసుకోండి..
Bengaluru Water Crisis: భారత సిలికాన్ వ్యాలీ, టెక్ హబ్ బెంగళూర్ నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు సరిపడా నీరు లేని పరిస్థితి ఏర్పడింది. రుతుపవనాలు వస్తేనే నగర నీటి కష్టాలు తీరుతాయని నిపుణులు, ప్రజలు చెబుతున్నారు. అయితే, వర్షాకాలానికి 4 నెలల సమయం ఉంది. ఈ నేపథ్యంలో రానున్న రెండు నెలల్లో నీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. -
CAA: సీఏఏ అమలుని నిశితంగా గమనిస్తున్నాం: అమెరికా..
CAA: భారత్ అమలు చేయనున్న పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పలు దేశాలు, అంతర్జాతీయ సంస్థలు కామెంట్స్ చేస్తున్నాయి. భారత అంతర్గత విషయాల్లో ఎక్కువగా కలుగజేసుకుంటున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఐక్యరాజ్యసమితి హక్కుల విభాగాలు ఈ చట్టం అమలును మతవివక్ష అంటూ వ్యతిరేకిస్తున్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లలో ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వం అందించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే, ఇందులో ముస్లింలను మినహాయించడంపై పలు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
NTRNeel : డ్రాగన్ కోసం ఎన్టీఆర్ డబుల్ మేకోవర్.. ఫ్యాన్స్ కు పూనకాలే
-
Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ బ్యూటీ..
-
OTT Movies : ఈ వారం ఓటీటీ క్లాష్లో ఎవరు టాప్లో నిలుస్తారు?
-
Donald Trump: 14-సూత్రాల ప్లాన్తో ఇరాన్.. ఆమోదయోగ్యం కాదని ట్రంప్ తిరస్కరణ.. మళ్లీ యుద్ధం చెలరేగుతుందా?
-
Dubbing Movies : అర్థంకాని టైటిల్స్ పెట్టి నష్టపోతున్న నిర్మాతలు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!