Caste Census: కులగణనపై ఆర్ఎస్ఎస్ కీలక వ్యాఖ్యలు.. ఓకే, కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Caste Census: వచ్చే ఏడాది జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో ‘కులగణన’ అంశం కీలకంగా మారబోతోంది. ఇప్పటికే కాంగ్రెస్ దీనిపై స్పష్టంగా వ్యవహరిస్తోంది. రాహుల్ గాంధీ పలు సందర్భాల్లో తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడుతామంటూ ప్రకటించారు. మరోవైపు ప్రజలను కులాలు, మతాల పేరుతో కాంగ్రెస్ వేరు చేసే ప్రయత్నం చేస్తోందని బీజేపీ మండిపడుతోంది. ఇదిలా ఉంటే కులగణనపై బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ స్పందించింది.
గురువారం రోజున ఆర్ఎస్ఎస్ కులగణనకు షరతులతో కూడిన మద్దతు ప్రకటించింది. శాస్త్రీయంగా, ఎన్నికల ప్రయోజనాల కోసం కాకండా నిర్వహించే ఏదైన నిశ్చయాత్మక చర్యను స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు ఆర్ఎస్ఎస్ సీనియర్ నేతల్లో ఒకరైన శ్రీధర్ గాడ్గే స్పందిస్తూ.. కులగణన కొంతమందికి రాజకీయ ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని కారణంగా దానికి తన వ్యతిరేకత ప్రకటించానని, దాని వల్ల ఆచరణాత్మక ఉపయోగం లేదని అన్నారు.
Also Read
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Women Living Alone in India: వితంతువులు, విడాకులు, ఒంటరి మహిళల సంఖ్యపై షాకింగ్ రిపోర్ట్.. దక్షిణాదిలో ఎందుకు ఎక్కువ?
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
- Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
Read Also: Jammu Kashmir: పూంచ్ జిల్లాలో ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి.. ముగ్గురు జవాన్లు మృతి
కులగణనను సమాజ అభివృద్ధి కోసం ఉపయోగించాలని మా అభిప్రాయమని, ఈ కసరత్తు చేస్తున్న సమయంలో సామాజిక సామరస్యం, ఐక్యత దెబ్బతినకుండా చూసుకోవాలని, ఆర్ఎస్ఎస్ కూడా హిందూ సమాజం కోసం పనిచేస్తుందని ఈ రోజు ప్రకటనలో వెల్లడించింది.
గత కొన్ని వారాలుగా దేశంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కులగణన అంశాన్ని తెరపైకి తెచ్చింది. కొన్ని రోజుల క్రితం బీహార్ రాష్ట్రం కులగణన నిర్వహించి, డేటాను కూడా విడుదల చేసింది. 65 శాతం రిజర్వేషన్లు పెంచాలని అక్కడి అసెంబ్లీలో బిల్లును కూడా ఆమోదించింది. ఇండియా కూటమి కూడా ఇదే విధంగా కులగణన నిర్వహించాలని బీజేపీని డిమాండ్ చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ తాము అధికారంలో ఉన్న రాష్ట్రంలో కులగణన చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే కులగణన ప్రాతిపదికన కాంగ్రెస్ ప్రచారం చేసినప్పటికీ.. తెలంగాణ మినహా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఘోరంగా ఓడిపోవడం గమనార్హం.
తాజావార్తలు
-
Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
-
Women Living Alone in India: వితంతువులు, విడాకులు, ఒంటరి మహిళల సంఖ్యపై షాకింగ్ రిపోర్ట్.. దక్షిణాదిలో ఎందుకు ఎక్కువ?
-
Hyderabad Metro : మెట్రో వ్యవస్థకు ఎలాంటి నష్టం లేదు.. స్పష్టం చేసిన HMRL
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు.. ఉత్తర్వులు జారీ..
-
RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!