Venu Goapl Reddy
Author- NTV Telugu-
Electoral Bonds Data: ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలకు ఎంత నిధులు వచ్చాయి..?
Electoral Bonds Data: ఎలక్టోరల్ బాండ్స్ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఏ పార్టీకి ఎవరు ఎంత నిధులు అందించారనే విషయాన్ని వెల్లడించాలని సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)ని ఆదేశించింది. ఈ మేరకు నిన్న భారత ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో సమాచారాన్ని ఉంచింది. అత్యున్నత కోర్టు కఠిన ఆదేశాల తర్వాత ఎస్బీఐ దిగి వచ్చింది. ఎస్బీఐ మంగళవారం సాయంత్రం ఈ వివరాలను ఈసీకి అందించగా.. గురువారం ఈసీ ఈ వివరాలను బహిర్గతం చేసింది. -
BS Yediyurappa: మైనర్పై మాజీ సీఎం లైంగిక వేధింపులు..పోక్సో కేసు నమోదు..
BS Yediyurappa: కర్ణాటక మాజీ సీఎంపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. మాజీ సీఎం యడియూరప్ప ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. 17 ఏళ్ల బాలిక తల్లి ఫిర్యాదుతో బెంగళూర్లోని సదాశివనగర్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. పోలీసుల ప్రకారం.. చీటింగ్ కేసులో సహాయం కోరేందుకు తల్లి, ఆమె కుమార్తె యడియూరప్ప దగ్గరకు వెళ్లిన సమయంలో లైంగిక వేధింపులు జరిగనట్లు బాలిక తల్లి ఆరోపించారు. -
Rahul Gandhi: మేం అధికారంలోకి వస్తే రైతుల గొంతుక అవుతాం..
Rahul Gandhi: తాము అధికారంలోకి వస్తే రైతుల ప్రయోజనాలను రక్షిస్తామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్తో కలిసి గురువారం మహారాష్ట్రలోని నాసిక్లో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా 'కిసాన్ మహాపంచాయత్'లో ప్రసంగించారు. నాసిక్ ఉల్లి, ద్రాక్ష, టొమాటోల సాగుకు ప్రసిద్ధి. మహాపంచాయత్ సభ సందర్భంగా రైతులు తమ కష్టాలను చెప్పుకున్నారు. -
Odisha: బీజేపీ, బీజేడీ పొత్తు ఉందా..? లేదా..?
Odisha: రానున్న లోక్సభ ఎన్నికల్లో ఒడిశాలో సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్(బీజేడీ), బీజేపీల మధ్య పొత్తు ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఇరు పార్టీలు కూడా పొత్తుపై చర్చిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న లోక్సభ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగి పోటీ చేస్తుందని ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, ఈ విషయంపై పార్టీ పార్లమెంటరీ నిర్ణయమే అంతిమం అంటూ ఒడిశా బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ గురువారం అన్నారు. గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమైన… -
SpaceX: ఎలాన్ మస్క్ “మెగా రాకెట్” ప్రయోగం.. రీ ఎంట్రీలో సిగ్నల్ లాస్ట్..
SpaceX: బిలియనీర్ ఎలాన్ మస్క్కి చెందిన స్పేస్ఎక్స్ స్టార్ షిప్ మెగా రాకెట్ చివరి దశలో విఫలమైనట్లు తెలుస్తోంది. చంద్రుడు, ఇతర ఇంటర్ ప్లానెటరీ మిషన్ల కోసం వ్యోమగాములను పంపడానికి ఉద్దేశించబడిన ఈ ప్రయోగం గురువారం జరిగింది. గతంతో పోలిస్తే ఈసారి స్టార్ షిప్ రాకెట్ ఎక్కువ దూరం, ఎక్కువ వేగాన్ని సాధించింది. అయితే రీ ఎంట్రీ సమయంలో భూమి వైపు తిరిగి వస్తుండగా అది సిగ్నల్ని కోల్పోయింది. స్పేస్క్రాఫ్ట్ హైపర్సోనిక్ వేగంతో భూవాతావరణంలోకి తిరిగి వస్తుండగా ఒకేసారి మిషన్ కంట్రోల్ రెండు శాటిలైట్… -
Pakistan: రంజాన్ నేపథ్యంలో పైలెట్లు, విమాన సిబ్బందికి పాకిస్తాన్ కీలక ఆదేశాలు.
Pakistan: ఆర్థిక కష్టాలతో సతమతం అవుతున్న పాకిస్తాన్ జాతీయ ఎయిర్ లైన్స్ ‘పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(పీఐఏ)’ తమ పైలెట్లు, క్యాబిన్ క్రూకి కీలక ఆదేశాలు జారీ చేసింది. రంజాన్ సమయంలో ఉపవాసాలు ఉన్న పైలెట్లు, విమాన సిబ్బంది విమానాల్లో విధులు నిర్వర్తించొద్దని చెప్పింది. విమానంలో ప్రయాణిస్తు్న్నవారు, -
Fatty Liver Disease: “ఫాటీ లివర్ డిసీజ్”కి తొలిసారిగా ఔషధం.. ఆమోదించిన ఎఫ్డీఏ..
Fatty Liver Disease: తీవ్రమైన కాలేయ వ్యాధి ‘ఫ్యాటీ లివర్’కి తొలిసారిగా ఔషధం రాబోతోంది. నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నవారి కోసం డ్రగ్ని US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) గురువారం ఆమోదించింది. మాడ్రిగల్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ రూపొందించిన రెజ్డిఫ్రా అనే మందు కాలేయంలో పేరుకుపోయిన కొవ్వులకు సంబంధించిన తీవ్ర రూపమైన నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ (NASH)తో బాధపడుతున్న వారికి ఇది వరంగా మారింది. క్లినికల్ ట్రయల్స్లో ఇది వ్యాధిని మెరుగుపరుస్తున్నట్లు తేలింది. -
Election Commissioners: కొత్త ఎలక్షన్ కమిషనర్లుగా సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్
Election Commissioners: భారత ఎన్నికల సంఘం ప్యానెల్లో ఖాళీగా ఉన్న రెండు ఎన్నికల కమిషనర్ల స్థానాలకు బ్యూరోక్రాట్లు సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్లను ఎంపిక చేసినట్లు లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఈ రోజు తెలిపారు. -
CAA: సీఏఏ మతపర వివక్ష చూపిస్తోంది.. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అసహనం..
CAA: పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలుకు సంబంధించి పలు అంతర్జాతీయ సంస్థలు తప్పుబడుతున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్తో పాటు ఐక్యరాజ్యసమితి, అమెరికాలు దీనిపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి. భారత్ తీసుకువచ్చిన సీఏఏ సమానత్వం, మతపరమైన వివక్షత, భారతదేశ అంతర్జాతీయ మానవహక్కుల బాధ్యతలకు అసంబద్ధమని, రాజ్యాంగ విలువలకు దెబ్బగా అభివర్ణించింది. ‘‘పౌరసత్వ సవరణ చట్టం అనేది మతం ఆధారంగా వివక్షను చూపిస్తోందని, -
OTT platforms: 18 OTT ప్లాట్ఫారమ్లను బ్లాక్ చేసిన కేంద్రం.. కారణమిదే..
OTT platforms: అసభ్యకరమై కంటెంట్ ఉన్నందున కేంద్ర ప్రభుత్వం 18 OTT ప్లాట్ఫారమ్లను బ్లాక్ చేసింది. ఓటీలతో పాటు 57 సోషల్ మీడియా హ్యాండల్స్ని నిషేధించింది. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ హెచ్చరికల తర్వాత దేశ వ్యాప్తంగా 18 OTT ప్లాట్ఫారమ్లు, 19 వెబ్సైట్లను, 10 యాప్లను, 57 సోషల్ మీడియా హ్యాండిల్స్ని బ్లాక్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
తాజావార్తలు
-
NTRNeel : డ్రాగన్ కోసం ఎన్టీఆర్ డబుల్ మేకోవర్.. ఫ్యాన్స్ కు పూనకాలే
-
Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ బ్యూటీ..
-
OTT Movies : ఈ వారం ఓటీటీ క్లాష్లో ఎవరు టాప్లో నిలుస్తారు?
-
Donald Trump: 14-సూత్రాల ప్లాన్తో ఇరాన్.. ఆమోదయోగ్యం కాదని ట్రంప్ తిరస్కరణ.. మళ్లీ యుద్ధం చెలరేగుతుందా?
-
Dubbing Movies : అర్థంకాని టైటిల్స్ పెట్టి నష్టపోతున్న నిర్మాతలు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!