Bharat Jodo Yatra 2.0: “మరోసారి భారత్ జోడో యాత్ర చేయాలి”.. రాహుల్ గాంధీపై కాంగ్రెస్ ఒత్తిడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra 2.0: 2024 లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపేందుకు మరోసారి భారత్ జోడో యాత్ర నిర్వహించాలని రాహుల్ గాంధీని కాంగ్రెస్ కోరింది. గతేడాది సెప్టెంబర్ నెలలో మొదలైన భారత్ జోడో యాత్ర తమిళనాడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కొనసాగింది. ఈ సారి భారత్ జోడో యాత్రం 2.0 తూర్పు నుంచి పడమర వరకు నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు మరోసారి యాత్ర నిర్వహించాలని తామంతా రాహుల్ గాంధీని అభ్యర్థించామని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ గురువారం తెలిపారు.
Read Also: Czech Republic: ప్రేగ్ యూనివర్సిటీలో దుండగుడి కాల్పులు.. పలువరి మరణం..
Also Read
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
ఈ రోజు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో జోడో యాత్ర గురించి చర్చించారు. యాత్రపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ రోజు జరిగిన సమావేశంలో లోక్ సభ ఎన్నికల వ్యూహం, ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి గురించి చర్చించారు. దీంతో పాటు పార్లమెంట్ నుంచి ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ గురించి నేతలు మాట్లాడారు. మరో రెండు రోజుల్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో కమిటీని ప్రకటిస్తామని వేణుగోపాల్ తెలిపారు.
సెప్టెంబర్ 7, 2022న తమిళనాడు కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రం ప్రారంభించారు. దాదాపుగా 4080 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. జనవరి 2023లో జమ్మూ కాశ్మీర్లో ఈ యాత్ర పూర్తయింది. 126 రోజుల పాటు 12 రాష్ట్రాల్లోని 75 జిల్లాల గుండా సుదీర్ఘంగా పాదయాత్ర చేశారు. నిరుద్యోగం, ద్రవ్యోల్భణం గురించి రాహుల్ గాంధీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
తాజావార్తలు
-
Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!