Venu Goapl Reddy
Author- NTV Telugu-
Jammu Kashmir: కాశ్మీర్ ఎవరిది..? పాకిస్తాన్కు అమెరికా క్లియర్ మెసేజ్..
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ త్వరలో పాకిస్తాన్లో భాగం అవుతుందని ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ తమదే అని దయాది దేశం చెబుతుంటుంది. అయితే, నిజంగా జమ్మూ కాశ్మీర్, పీఓకేతో సహా ఎవరిదో అమెరికా స్పష్టం చేసింది. ఇప్పటికే భారత్-అమెరికా ట్రేడ్ డీల్తో ఇబ్బందులు పడుతున్న దాయాది దేశానికి, అమెరికా మరో షాక్ ఇచ్చినట్లైంది. పూర్తిగా జమ్మూ కాశ్మీర్ ఉన్న భారత మ్యాప్ను ప్రదర్శించింది. -
T20 World Cup: బాయ్కాట్ నిర్ణయంపై పాక్ టీం యూటర్న్..?
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ వివాదాలు ఇంకా ముగియడం లేదు. బంగ్లాదేశ్ భారత్లో భద్రతా కారణాలు చూపుతూ ఆడేందుకు నిరాకరించింది. దీంతో ఐసీసీ ఆ దేశాన్ని టోర్నీ నుంచి బహిష్కరించింది. మరోవైపు, బంగ్లాకు మద్దతుగా భారత్తో తాము మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వెల్లడించింది. -
India-US Trade Deal: భారత రైతులకు రక్షణ.. ట్రేడ్ డీల్లో ఎవరికి ఎంత లాభం.. వివరాలు..
India-US Trade Deal: భారత్, అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ వివరాలను కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ శనివారం వెల్లడించారు. ఈ డీల్లో భారతీయ రైతులు, పాడి పరిశ్రమకు, గ్రామీణ ఉపాధికి ఎలాంటి హాని కలగదని హామీ ఇచ్చారు. -
Omar Abdullah: ఉన్నదాన్నే సరిగా చూసుకోవడం లేదు, మీకు కాశ్మీర్ కావాలా..?
Omar Abdullah: కాశ్మీర్ను భారత్ నుంచి స్వాధీనం చేసుకుంటామని, కాశ్మీర్ పాకిస్తాన్ ‘‘జీవనాడి’’ అని, ఏదో రోజు పాకిస్తాన్లో భాగమవుతుందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్కు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ధీటుగా సమాధానం ఇచ్చారు. పాక్ వద్ద ఉన్న ఆక్రమిత జమ్మూ కాశ్మీర్(పీఓకే)నే సరిగా చూసుకోవడం లేదని వారికి కాశ్మీర్ కావాలా.? అని ప్రశ్నించారు. -
Agni-3: అగ్ని-3 మిస్సైల్ టెస్ట్ సక్సెస్.. పాక్లోని ప్రతీ ప్రాంతంపై ఆధిపత్యం..
Agni-3: ఇంటర్మీడియెట్ రేంజ్ సామర్థ్యం కలిగిన అగ్ని-3 మిస్సైల్ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. శుక్రవారం ఒడిశాలోని చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి క్షిపణి దూసుకెళ్లింది. క్షిపణిలోని అన్ని పారామీటర్స్, ఆపరేషనల్స్ అన్నీ సక్రమంగా ఉన్నట్లు ధ్రువీకరించారు. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ పర్యవేక్షణలో నిర్వహించిన -
Mega Trade Deal: ఈయూ, యూఎస్ తర్వాత.. మరో మెగా ట్రేడ్ డీల్కు సిద్ధమవుతున్న భారత్..
Mega Trade Deal: భారత్ మరో మెగా ట్రేడ్ డీల్కు సిద్ధమవుతోంది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్(ఈయూ), అమెరికాలతో భారత్ స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(FTA) కుదుర్చుకుంది. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో తన మార్కెట్ను విస్తరించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ కో-ఆపరేటివ్ కౌన్సిల్(GCC)తో వాణిజ్య ఒప్పందానికి భారత్ చర్చలకు సిద్ధమైంది. ఇది భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఈయూ, ఆసియాన్, అమెరికా, చైనాల కన్నా పెద్ద మార్కెట్. -
AI: దిగ్గజ కంపెనీల AI పెట్టుబడులు.. ఏకంగా భారత్ బడ్జెట్కు సమానం..
AI: ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ ఉద్యోగుల్ని తీసేసి, ఏఐపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఏకంగా భారత బడ్జెట్కు దాదాపుగా సమానమైన పెట్టుబడుల్ని కేవలం నాలుగు కంపెనీలే పెడుతున్నాయంటే ఏ రేంజ్లో ఏఐ బూమ్ ఉందో తెలుస్తోంది. ఏఐ, దాని అనుబంధ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ ఏకంగా 650 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని పెడుతున్నాయి. ఇటీవల, మన కేంద్ర […] -
Pakistan: “మ్యాన్హోల్స్” దొంగలతో పాకిస్తాన్ కంగారు.. భారీ శిక్షలు ప్రకటించిన దాయాది..
Pakistan: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ను కొత్తగా మరో విషయం చిరాకు పెడుతోంది. చివరకు ఆ దేశంలోని దొంగలు ‘‘మ్యాన్ హోల్స్’’పై మూతలు కూడా ఉంచకుండా, దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీంతో విసిగిపోయిన పాకిస్తాన్, భారీ శిక్షల్ని ప్రకటించింది. మ్యాన్హోల్స్కు ఇలాంటి శిక్షలు ఏమిటి..? అని అనుకున్నా సరే, ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్ మాత్రం శిక్షలు విధించేందుకు చట్టాన్ని తీసుకువచ్చింది. -
Bangladesh: యూనస్ ఇంటి ముందు అల్లర్లు.. ఎన్నికలకు ముందు అట్టుడుకుతున్న ఢాకా..
Bangladesh: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నిరసనలతో అట్టుడుకుతోంది. శుక్రవారం ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశ తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్ అధికారిక నివాసం జమునా బయట ప్రభుత్వం ఉద్యోగులు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. ఉద్యోగులకు, పోలీసులకు మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు 9వ జాతీయ వేతన సంఘం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. తినడానికి తిండి లేదు, నోటితో అభివృద్ధి మాటలు […] -
Islamabad blast: పాక్లో ఎమర్జెన్సీ.. ఇస్లామాబాద్ భారీ పేలుడు.. 70 మందికి పైగా మృతి..
Islamabad blast: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఒక ప్రార్థనా మందిరం లోపల జరిగిన ఆత్మాహుతి దాడిలో 50 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. నగరంలోని షెహజాద్ టౌన్ ప్రాంతంలో ఉన్న తర్లై ఇమామ్బర్గా వద్ద ఈ పేలుడు సంభవించింది. శుక్రవారం మధ్యామ్నం షియా ప్రార్థనా మందిర ప్రధాన ద్వారా వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!