Donald Trump: ‘‘నేను భారత్-పాకిస్తాన్కు చేసినట్లే..’’ ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఒప్పందం..
- భారత్-పాక్ మధ్య చేసినట్లే, ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఒప్పందం..
- మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య దాడులు, ప్రతి దాడుల మధ్య మిడిల్ ఈస్ట్ సంక్షోభం ముదిరింది. శుక్రవారం ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ పేరుతో ఇజ్రాయిల్, ఇరాన్ అణు కార్యక్రమాలపై విరుచుకుపడింది. ఇదే కాకుండా ఇరాన్ మిలిటరీ టాప్ జనరల్స్తో పాటు అణు శాస్త్రవేత్తలను హతమార్చింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్, ఇజ్రాయిల్ లోని ప్రధాన నగరాలైన జెరూసలెం, టెల్ అవీవ్, హైఫా నగరాలపై వందలాది క్షిపణులతో విరుచుకుపడింది.
Also Read
- Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ 'అణు' బాంబ్.. 'సర్మాట్' క్షిపణితో సర్ప్రైజ్!
- Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
- Iran Nuclear Warning: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. 'మాపై చేయి వేస్తే.. అణు విలయమే!'
- Israel-Hezbollah: హిజ్బుల్లా అండర్గ్రౌండ్ను గుర్తించిన ఐడీఎఫ్.. వీడియో విడుదల
ఈ నేపథ్యంలో అమెరికా ఆస్తులపై దాడి జరిగితే అమెరికా దళాలు ఇరాన్ని నాశనం చేస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల తర్వాత ఇజ్రాయిల్, ఇరాన్ మద్య త్వరలో శాంతి సాధించబడుతుందని ట్రంప్ అన్నారు. మరోసారి ట్రంప్ భారత్-పాకిస్తాన్ మధ్య తాను మధ్యవర్తిత్వం చేసి, ఒప్పందం కుదుర్చానని అన్నారు. భారత్-పాకిస్తాన్ విషయంలో తాను చేసినట్లే, ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఒప్పందానికి రావాలని, వచ్చేలా తాను చేస్తానని అన్నారు. అయితే, భారత్ మాత్రం ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిలిపేయడంలో అమెరికా పాత్ర లేదని చెప్పింది. పాకిస్తాన్ డీజీఎంఓ భారత్కి ఫోన్ చేసి ఘర్షణ ఆపాలని కోరడంతో సిందూర్ని తాత్కాలికంగా నిలిపేశామని భారత సైన్యం చెప్పింది.
‘‘ఇరాన్, ఇజ్రాయిల్ ఒక ఒప్పందం చేసుకోవాలి. నేను భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య ఒప్పందం కుదుర్చిన విధంగా. ఆ సందర్భంలో అమెరికాతో వాణిజ్యాన్ని ఉపయోగించి ఇద్దరు అద్భుతమైన నాయకులతో చర్చలలో హేతుబద్ధత, సమన్వయం వివేకం తీసుకురావడం ద్వారా ఘర్షణ ఆపేశాను. అలాగే, నా మొదటి పదవీ కాలంలో సెర్బియా-కొసావో మధ్య ఇలాగే చేశా. ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపాను. బైడెన్ కొన్ని తెలివితక్కువ నిర్ణయాలతో దీర్ఘకాలిక అవకాశాలను దెబ్బతీశారు. కానీ నేను వాటిని మళ్లీ పరిష్కరిస్తాను’’ అని తన ట్రూత్ సోషల్ అకౌంట్లో రాశారు. ఈజిప్ట్-ఇథియోపియా మధ్య నైలు నది ఆనకట్టపై ఘర్షణ ఉందని, తన జోక్యంతో శాంతి నెలకుందని అన్నారు. ఇప్పుడు అదే విధంగా, ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య శాంతి కుదురుతుందని చెప్పారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!