Donald Trump: ‘‘నేను భారత్-పాకిస్తాన్కు చేసినట్లే..’’ ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఒప్పందం..
- భారత్-పాక్ మధ్య చేసినట్లే, ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఒప్పందం..
- మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య దాడులు, ప్రతి దాడుల మధ్య మిడిల్ ఈస్ట్ సంక్షోభం ముదిరింది. శుక్రవారం ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ పేరుతో ఇజ్రాయిల్, ఇరాన్ అణు కార్యక్రమాలపై విరుచుకుపడింది. ఇదే కాకుండా ఇరాన్ మిలిటరీ టాప్ జనరల్స్తో పాటు అణు శాస్త్రవేత్తలను హతమార్చింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్, ఇజ్రాయిల్ లోని ప్రధాన నగరాలైన జెరూసలెం, టెల్ అవీవ్, హైఫా నగరాలపై వందలాది క్షిపణులతో విరుచుకుపడింది.
Also Read
- Endurance Ship: 100ఏళ్ల రహస్యం..ఓడ మిస్టరీ వీడింది!
- Mojtaba Khamenei: మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల.. అనుమానాల వేళ వైరల్
- Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
ఈ నేపథ్యంలో అమెరికా ఆస్తులపై దాడి జరిగితే అమెరికా దళాలు ఇరాన్ని నాశనం చేస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల తర్వాత ఇజ్రాయిల్, ఇరాన్ మద్య త్వరలో శాంతి సాధించబడుతుందని ట్రంప్ అన్నారు. మరోసారి ట్రంప్ భారత్-పాకిస్తాన్ మధ్య తాను మధ్యవర్తిత్వం చేసి, ఒప్పందం కుదుర్చానని అన్నారు. భారత్-పాకిస్తాన్ విషయంలో తాను చేసినట్లే, ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఒప్పందానికి రావాలని, వచ్చేలా తాను చేస్తానని అన్నారు. అయితే, భారత్ మాత్రం ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిలిపేయడంలో అమెరికా పాత్ర లేదని చెప్పింది. పాకిస్తాన్ డీజీఎంఓ భారత్కి ఫోన్ చేసి ఘర్షణ ఆపాలని కోరడంతో సిందూర్ని తాత్కాలికంగా నిలిపేశామని భారత సైన్యం చెప్పింది.
‘‘ఇరాన్, ఇజ్రాయిల్ ఒక ఒప్పందం చేసుకోవాలి. నేను భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య ఒప్పందం కుదుర్చిన విధంగా. ఆ సందర్భంలో అమెరికాతో వాణిజ్యాన్ని ఉపయోగించి ఇద్దరు అద్భుతమైన నాయకులతో చర్చలలో హేతుబద్ధత, సమన్వయం వివేకం తీసుకురావడం ద్వారా ఘర్షణ ఆపేశాను. అలాగే, నా మొదటి పదవీ కాలంలో సెర్బియా-కొసావో మధ్య ఇలాగే చేశా. ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపాను. బైడెన్ కొన్ని తెలివితక్కువ నిర్ణయాలతో దీర్ఘకాలిక అవకాశాలను దెబ్బతీశారు. కానీ నేను వాటిని మళ్లీ పరిష్కరిస్తాను’’ అని తన ట్రూత్ సోషల్ అకౌంట్లో రాశారు. ఈజిప్ట్-ఇథియోపియా మధ్య నైలు నది ఆనకట్టపై ఘర్షణ ఉందని, తన జోక్యంతో శాంతి నెలకుందని అన్నారు. ఇప్పుడు అదే విధంగా, ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య శాంతి కుదురుతుందని చెప్పారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Rafale vs J-16: రఫేల్తో చైనీస్ J-16 పోరాటం.. నిశితంగా గమనిస్తున్న భారత్..
-
Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
-
PM Modi: ప్రధాని మోడీ పేరుతో సూరత్లో చేపల మార్కెట్.. గుజరాత్లో కొత్త వివాదం
-
Bandi Sanjay : ఫీజు బకాయిలపై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్కు డెడ్లైన్.!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!