Israel Iran War: ఇరాన్లో 80 మంది మృతి.. గగనతలం మూసేసిన ఇజ్రాయిల్..
- ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య తీవ్రమైన ఘర్షణ..
- ఇజ్రాయిల్ దాడుల్లో 80 మంది ఇరాన్ జాతీయులు మృతి..
- గగనతలాన్ని మూసేసిన ఇజ్రాయిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Iran War: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయిల్ ఇరాన్ అణు కార్యక్రమాలపై దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. టాప్ మిలిటరీ జనరల్స్, అణు శాస్త్రవేత్తలు టార్గెట్గా ఇజ్రాయిల్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఇరాన్ అణు కేంద్రాలు దారుణంగా దెబ్బతినడంతో పాటు కీలకమైన అధికారులు మరణించారు. ఇరాన్ కూడా ఇజ్రాయిల్పై ప్రతీకార దాడులు చేస్తోంది. వందలాది మిస్సైళ్లతో ఇజ్రాయిల్ రాజధాని జెరూసలెంతో పాటు కీలక నగరాలైన టెల్ అవీవ్, హైఫా పై దాడులు చేసింది.
Read Also: Israel Iran War: ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం.. కొడుకు పెళ్లి వాయిదా వేసిన ప్రధాని..
Also Read
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- 39 సెకన్లలో దాదాపు లక్ష మంది మృతి?.. Venezuela Earthquakeపై షాకింగ్ రిపోర్ట్..
- Explainer: చరిత్రలో దాచిన ఆకలి విషాదం.. 30లక్షల మంది భారతీయుల చావుకు చర్చిల్ కారణం?
- US Citizenship Fee Hike: ఎన్నారైలకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న అమెరికా సిటిజన్షిప్ ఫీజులు?
శుక్రవారం ప్రారంభమైన ఈ సంఘర్షణ ఆదివారం కూడా కొనసాగింది. ఆదివారం తెల్లవారుజామున ఇరు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. ఇరాన్లోని ఎస్పీఎన్డీ అణు ప్రాజెక్టు ప్రధాన కార్యాలయం అయిన ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంపై దాడులు చేసినట్లుగా ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) తెలిపింది. అణు అర్కైవ్ దాడి పెట్టిన ప్రదేశాన్ని కూడా టార్గెట్ చేసినట్లు వెల్లడించింది. ఇజ్రాయిల్ టెహ్రాన్లోని అతిపెద్ద చమురు డిపో అయిన షహ్రాన్ని టార్గెట్ చేసింది. శనివారం ఇజ్రాయెల్ దాడిలో అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత, ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రం అయిన సౌత్ పార్స్ క్షేత్రంలో ఉత్పత్తిని కూడా ఇరాన్ పాక్షికంగా నిలిపివేసింది.
ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం ఆపరేషన్ “రైజింగ్ లయన్”ను ప్రారంభించిన తర్వాత నుంచి ఇరాన్లో 78 మంది మరణించారని, 320 మందికి పైగా గాయపడ్డారని యూఎన్లోని ఇరాన్ రాయబారి వెల్లడించారు. మరోవైపు, ఇరాన్ జరిపిన దాడుల్లో కనీసం 10 మంది ఇజ్రాయిలీలు, 300 మందికి పైగా గాయపడినట్లు వెల్లడించింది. దాడులు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇజ్రాయిల్ తన గగనతలాన్ని పూర్తిగా మూసేసింది.
తాజావార్తలు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!