Honeymoon Murder: హనీమూన్ మర్డర్ కేసులో మరో బిట్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసులో లేని కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. భార్య సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా ప్లాన్ చేసి, హత్య కోసం కిరాయి హంతకులను నియమించుకున్నారు. మేఘాలయ హనీమూన్కి వెళ్లిన సమయంలో భార్య సోనమ్ దగ్గర ఉండీ తన భర్త రాజాను హత్య చేయించింది.
Israel Iran War: ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ యుద్ధం మూలంగా చమురు సరఫరాపై ప్రభావం పడుతుందని అన్ని దేశాలు భయపడుతున్నాయి. మరోవైపు, శుక్రవారం నుంచి ఇరు దేశాల మధ్య ఘర్షణ ఆరో రోజుకు చేరింది. ఇరాన్ అణు కార్యక్రమాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ పేరుతో వైమానిక దాడులు చేసింది.
Donald Trump: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ట్రూత్ సోషల్ పోస్టులో ‘‘ఇప్పటికీ ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని అంతమొందించడానికి తాను చర్యలు తీసుకోను, అమెరికా ఖమేనీని హత్య చేయగలదని, కానీ ప్రస్తుతానికి అలా చేయడం లేదని’’ అని అన్నారు. ‘‘షరతులు లేకుండా లొంగిపోండి’’ అంటూ గట్టి హెచ్చరిక చేశారు.
Israel Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఘర్షణ తీవ్ర రూపం దాలుస్తోంది. ఈ రెండు దేశాల మధ్య పరిణామాలు ప్రపంచదేశాలను కలవరపరుస్తున్నాయి. ముఖ్యంగా, మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్ అణు ఫెలిసిటీలు లక్ష్యంగా శుక్రవారం ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ పేరుతో వైమానిక దాడులు నిర్వహించింది.
Israel Iran War: ఇరాన్ అత్యంత రహస్యమైన, సురక్షిత ‘‘నటాంజ్’’ అణు సముదాయంపై ఇజ్రాయిల్ ఖచ్చితమైన దాడిని నిర్వహించినట్లు తెలుస్తోంది. భూగర్భం లోతులో ఎంతో సురక్షితమైన ఈ స్థావరాన్ని ఇజ్రాయిల్ విజయవంతంగా లక్ష్యంగా చేసుకున్నట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) మంగళవారం చెప్పింది. నటాంజ్ యూరేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్ ఈ దాడిలో ధ్వంసమైనట్లు వెల్లడించింది.
Israel Iran: ఇజ్రాయిల్- ఇరాన్ యుద్ధం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అని ప్రపంచం భయపడుతోంది. శుక్రవారం నుంచి ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయిలో వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాన్ని టార్గెట్ చేస్తూ ఇజ్రాయిల్ దాడులు చేసింది. ఇరాన్ అణు శాస్త్రవేత్తలతో పాటు ఆ దేశ మిలిటరీ టాప్ జనరల్స్ని హతమార్చింది.
Murshidabad Violence: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో ఇటీవల జరిగిన నిరసన కార్యక్రమాలు తీవ్ర హింసకు కారణమయ్యాయి. హిందువులను టార్గెట్ చేస్తూ వారి ఆస్తులపై దాడి చేయడం, వారు బలవంతంగా పారిపోయేలా చేశారు. ఈ ముర్షిదాబాద్ మత హంస జరిగిన రెండు నెలల తర్వాత ప్రధాన సూత్రధారులైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
Wife Kills Husband: మేఘాలయలో రాజా రఘువంశీ అనే వ్యక్తిని భార్య సోనమ్ హత్య చేసిన వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. హనీమూన్ పేరుతో మేఘాలయ తీసుకెళ్లి, కిరాయి హంతకులతో భార్య హత్య చేయించింది. ఈ హత్యకు సోనమ్, ఆమె లవర్ రాజ్ కుష్వాహాలు ప్లాన్ చేశారు. ఈ హత్య జరిగిన తర్వాత ఇలాంటి మరో సంఘటన చోటు చేసుకుంది.
Air India crash Investigation: గత వారం అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఎయిర్పోర్టుకు సమీపంలోని డాక్టర్స్ హాస్టల్పై కూలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 270 మంది మరణించారు. అయితే, ప్రమాదానికి రెండు ఇంజన్లు పనిచేయకపోవడం కారణమని పలువురు భావిస్తున్నారు. ఇంజన్ ఫెయిల్యూర్తో పాటు విద్యుత్ లేదా హైడ్రాలిక్స్ పనిచేయదని అంచనా వేస్తున్నారు.
Air India: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా దుర్ఘటన తర్వాత, ఈ రోజు ఏకంగా 07 విమానాలను రద్దు చేశారు. రద్దు చేసిన విమానాల్లో 06 బోయింగ్ 787-8 డ్రీమ్లైన్ విమానాలు ఉన్నాయి.