PM Modi: సైప్రస్ చేరుకున్న ప్రధాని మోడీ.. స్వయంగా అధ్యక్షుడి స్వాగతం.. ఈ చిన్న దేశానికి ఎంతో ప్రాధాన్యత..
- సైప్రస్ చేరుకున్న ప్రధాని మోడీ..
- స్వయంగా అధ్యక్షుడి స్వాగతం..
- టర్కీతో ఉద్రిక్తతల నేపథ్యంలో సైప్రస్కి ప్రాధాన్యం..
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా ద్వీప దేశం సైప్రస్ చేసుకున్నారు. మోడీ లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వగానే సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ ప్రోటోకాల్ పక్కనపెట్టి, స్వయంగా ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. సైప్రస్ అధ్యక్షుడి ఆహ్వానం మేరకు, ప్రధాని జూన్ 15-16 తేదీల్లో సైప్రస్లో అధికారిక పర్యటన చేస్తున్నారు. జూన్ 16-17 తేదీల్లో కెనడాలో జరిగే జీ-7 శిఖరాగ్ర సమావేశానికి వెళ్తున్న ప్రధాని మోడీ, మార్గం మధ్యలో సైప్రస్లో పర్యటిస్తున్నారు. కెనడా పర్యటన తర్వాత జూన్ 18న క్రొయేషియా దేశంలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతుంది.
టర్కీకి సమీపంగా ఉండే ఈ చిన్న దేశానికి ప్రధాని మోడీ పర్యటనకు వెళ్లడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సైప్రస్కి శత్రువు టర్కీ. టర్కీ మన శత్రువు పాకిస్తాన్కి ప్రతీ విషయంలోనూ మద్దతుగా నిలుస్తోంది. ఇలా శత్రువుకు శత్రువు మిత్రుడు అనే నీతిలో భాగంగానే భారత్-సైప్రస్తో మంచి సంబంధాలను కొనసాగిస్తోంది. టర్కీ-పాకిస్తాన్ని ఎదుర్కోవడంలో మధ్యదరా సముద్రంలోని సైప్రస్ వ్యూహాత్మక ప్రాధాన్యతను భారత్ గుర్తించింది. ఇది ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్(IMEC) కీలక కేంద్రంగా మారే అవకాశం ఉంది.
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
Read Also: Oil Discovery: జాక్పాట్ కొట్టిన భారత్.. అండమాన్ సముద్రంలో భారీగా ఆయిల్ నిల్వలు..
దీనికి తోడు 2026లో సైప్రస్ యురోపియన్ యూనియన్ (ఈయూ) కౌన్సిల్ రొటేషనల్ అధ్యక్ష పదవిని చేపడుతోంది. ఇది కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. 23 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత ప్రధానిగా మోడీ సైప్రస్ పర్యటనకు వెళ్లారు. ఇది భారత్-ఈయూ సహకారానికి మార్గం సుగమం చేస్తుంది. టర్కీతో ప్రాదేశిక జలాల విషయంలో సైప్రస్ టర్కీకి తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ని సైప్రస్ కూడా మంచి మిత్రుడుగా చూస్తోంది.
తూర్పు మధ్యధరా సహజ వాయువు అన్వేషణలో సైప్రస్ కీలక పాత్ర పోషిస్తుంది, టర్కీ డ్రిల్లింగ్ కార్యకలాపాల కారణంగా ప్రాంతీయ ఉద్రిక్తత ఏర్పడుతోంది. టర్కీ ఆధిపత్య ధోరణిని సైప్రస్, గ్రీస్ వ్యతిరేకిస్తున్నాయి. ఈ రెండు దేశాలతో పాటు టర్కీతో సరిహద్దు కలిగిన ఆర్మేనియాతో భారత్ సంబంధాలు ఇటీవల కాలంలో మెరుగయ్యాయి.
#WATCH | Cyprus: Prime Minister Narendra Modi reaches Larnaca International Airport, received by President of Cyprus, Nikos Christodoulides.
At the invitation of the President of Cyprus, Nikos Christodoulides, PM Modi is paying an official visit to Cyprus from 15-16 June. PM… pic.twitter.com/LEx8u9yPID
— ANI (@ANI) June 15, 2025
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?