PM Modi: సైప్రస్ చేరుకున్న ప్రధాని మోడీ.. స్వయంగా అధ్యక్షుడి స్వాగతం.. ఈ చిన్న దేశానికి ఎంతో ప్రాధాన్యత..
- సైప్రస్ చేరుకున్న ప్రధాని మోడీ..
- స్వయంగా అధ్యక్షుడి స్వాగతం..
- టర్కీతో ఉద్రిక్తతల నేపథ్యంలో సైప్రస్కి ప్రాధాన్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా ద్వీప దేశం సైప్రస్ చేసుకున్నారు. మోడీ లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వగానే సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ ప్రోటోకాల్ పక్కనపెట్టి, స్వయంగా ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. సైప్రస్ అధ్యక్షుడి ఆహ్వానం మేరకు, ప్రధాని జూన్ 15-16 తేదీల్లో సైప్రస్లో అధికారిక పర్యటన చేస్తున్నారు. జూన్ 16-17 తేదీల్లో కెనడాలో జరిగే జీ-7 శిఖరాగ్ర సమావేశానికి వెళ్తున్న ప్రధాని మోడీ, మార్గం మధ్యలో సైప్రస్లో పర్యటిస్తున్నారు. కెనడా పర్యటన తర్వాత జూన్ 18న క్రొయేషియా దేశంలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతుంది.
టర్కీకి సమీపంగా ఉండే ఈ చిన్న దేశానికి ప్రధాని మోడీ పర్యటనకు వెళ్లడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సైప్రస్కి శత్రువు టర్కీ. టర్కీ మన శత్రువు పాకిస్తాన్కి ప్రతీ విషయంలోనూ మద్దతుగా నిలుస్తోంది. ఇలా శత్రువుకు శత్రువు మిత్రుడు అనే నీతిలో భాగంగానే భారత్-సైప్రస్తో మంచి సంబంధాలను కొనసాగిస్తోంది. టర్కీ-పాకిస్తాన్ని ఎదుర్కోవడంలో మధ్యదరా సముద్రంలోని సైప్రస్ వ్యూహాత్మక ప్రాధాన్యతను భారత్ గుర్తించింది. ఇది ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్(IMEC) కీలక కేంద్రంగా మారే అవకాశం ఉంది.
Also Read
- Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
- Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
- Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
- PM Modi: తొలిసారి ‘బుక్మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్ఫుల్ బోర్డు
Read Also: Oil Discovery: జాక్పాట్ కొట్టిన భారత్.. అండమాన్ సముద్రంలో భారీగా ఆయిల్ నిల్వలు..
దీనికి తోడు 2026లో సైప్రస్ యురోపియన్ యూనియన్ (ఈయూ) కౌన్సిల్ రొటేషనల్ అధ్యక్ష పదవిని చేపడుతోంది. ఇది కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. 23 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత ప్రధానిగా మోడీ సైప్రస్ పర్యటనకు వెళ్లారు. ఇది భారత్-ఈయూ సహకారానికి మార్గం సుగమం చేస్తుంది. టర్కీతో ప్రాదేశిక జలాల విషయంలో సైప్రస్ టర్కీకి తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ని సైప్రస్ కూడా మంచి మిత్రుడుగా చూస్తోంది.
తూర్పు మధ్యధరా సహజ వాయువు అన్వేషణలో సైప్రస్ కీలక పాత్ర పోషిస్తుంది, టర్కీ డ్రిల్లింగ్ కార్యకలాపాల కారణంగా ప్రాంతీయ ఉద్రిక్తత ఏర్పడుతోంది. టర్కీ ఆధిపత్య ధోరణిని సైప్రస్, గ్రీస్ వ్యతిరేకిస్తున్నాయి. ఈ రెండు దేశాలతో పాటు టర్కీతో సరిహద్దు కలిగిన ఆర్మేనియాతో భారత్ సంబంధాలు ఇటీవల కాలంలో మెరుగయ్యాయి.
#WATCH | Cyprus: Prime Minister Narendra Modi reaches Larnaca International Airport, received by President of Cyprus, Nikos Christodoulides.
At the invitation of the President of Cyprus, Nikos Christodoulides, PM Modi is paying an official visit to Cyprus from 15-16 June. PM… pic.twitter.com/LEx8u9yPID
— ANI (@ANI) June 15, 2025
తాజావార్తలు
-
BRS MLAs: కేటీఆర్, హరీశ్రావు సహా 14 మంది ఎమ్మెల్యేలపై కేసులు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డి అరెస్ట్
-
Asian Games Cricket Schedule: ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 3న రెండు దేశాల్లో టీమిండియా మ్యాచ్లు!
-
Rohit Sharma: బుల్లితెరపై రోహిత్ శర్మ కొత్త ఇన్నింగ్స్!
-
Steel Tap Cleaning Tips: జిడ్డుగా మారిన స్టీల్ ట్యాప్ల క్లీనింగ్కు బెస్ట్ చిట్కా.. 2 నిమిషాల్లో క్లీనింగ్
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
ట్రెండింగ్
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!