Asim Munir: పాక్ ఆర్మీ చీఫ్ని అమెరికా ఆహ్వానించిందా..? వైట్హౌజ్ క్లారిటీ..
- పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని అమెరికా ఆహ్వానించిందా..?
- ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చిన వైట్హౌజ్..
- భారత్లో ఈ వ్యవహారంపై రాజకీయ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asim Munir: అమెరికా మిలిటరీ 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్లో జరుగుతున్న మిలిటరీ పరేడ్కి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ని అమెరికా ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఊహాగానాలను అమెరికా తోసిపుచ్చింది. ఇది తప్పుడు వార్త అని, విదేశీ సైనిక నాయకులను ఎవరూ ఆహ్వానించలేదు అని వైట్ హౌజ్ అధికారి ఒకరు చెప్పినట్లు వార్తాసంస్థ ఏఎన్ఐ పేర్కొంది.
Read Also: Israel Iran War: ఇరాన్లో 80 మంది మృతి.. గగనతలం మూసేసిన ఇజ్రాయిల్..
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
అమెరికా జనరల్ ఆసిమ్ మునీర్ని ఆహ్వానించినట్లు వార్తలు రావడంతో భారత్ నుంచి తీవ్ర స్థాయిలో రాజకీయంగా వ్యతిరేక వచ్చింది. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్కు ఇది దౌత్యపరమైన ఎదురుదెబ్బగా కాంగ్రెస్ అభివర్ణించింది. “యుఎస్ ఆర్మీ డే (జూన్ 14) సందర్భంగా వాషింగ్టన్ డిసిలో నిర్వహించిన కార్యక్రమానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ను ఆహ్వానించినట్లు సమాచారం. ఈ వార్త దౌత్య ,వ్యూహాత్మకంగా భారతదేశానికి పెద్ద ఎదురుదెబ్బ” అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్ ఎక్స్లో ఒక పోస్ట్లో అన్నారు. “పహల్గామ్ ఉగ్రవాద దాడికి ముందు రెచ్చగొట్టే భాషను ఉపయోగించిన వ్యక్తి ఇతనే – అమెరికా ఉద్దేశ్యం ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతుంది?” అని అన్నారు.
అయితే, కాంగ్రెస్ వ్యాఖ్యలను బీజేపీ తిరస్కరించింది. జైరాం రమేష్ భారతదేశ విదేశాంగ విధానంపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాడు అని ఆరోపించింది. ప్రధాని మోడీపై ఉన్న ద్వేషం కారణంగానే ఆసిమ్ మునీర్ని అమెరికా ఆహ్వానించిందని బాధ్యతారహిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్లో రాశారు. ప్రధానిని విమర్శించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ నేత తప్పుడు సమచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని అన్నారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!