Pune Bridge Collapses: పూణేలో ఘోర ప్రమాదం.. వంతెన కూలి ఇద్దరు మృతి, 25 మంది గల్లంతు..
- మహారాష్ట్రలో ఘోర దుర్ఘటన..
- పూణే సమీపంలో కూలిన వంతెన..
- ఆరుగురు మృతి, 25 మంది టూరిస్టులు గల్లంతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pune Bridge Collapses: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. పూణేకి సమీపంలోని ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, మరో 25మంది పర్యాటకులు గల్లంతయ్యారని తెలుస్తోంది. వర్షాకాలం రద్దీగా ఉండే ప్రసిద్ధి పర్యాటక కేంద్రమైన కుండ్మలలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది.
పూణే జిల్లాలోని మావల్ తాలూకాలో ఆదివారం మధ్యాహ్నం ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వీకెండ్ కావడంతో పెద్ద సంఖ్యలో ఈ టూరిస్టు ప్రాంతానికి వచ్చారు. ఇంద్రాయణి నదిపై ఉన్న పాత వంతెన పై నుంచి నదీ అందాలను వీక్షిస్తున్న సమయంలో, ఈ ఘటన జరిగింది. వంతెన పై ఉన్న అనేక మంది నదీ ప్రవాహంలో పడిపోయారు. ప్రమాద సమయంలో వంతెనపై భారీగా జనాలు ఉన్నట్లు చెబుతున్నారు.
Also Read
ఈ సంఘటన తర్వాత, స్థానిక పోలీసులు, విపత్తు ప్రతిస్పందన విభాగాలు, గ్రామస్తుల బృందాలు అత్యవసర సహాయక చర్యను ప్రారంభించాయి. గత రెండు రోజులుగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఇది ఇంద్రాయణి నీటి మట్టం మరియు ప్రవాహాన్ని గణనీయంగా పెంచింది, ఇది సహాయక చర్యలను సవాలుగా మార్చింది. కూలిపోయిన వంతెన దశాబ్దాల కాలం నాటిది.
Pune: Many Tourists Feared Drowned After Old Bridge Collapses Over Indrayani River at Kund Mala
Read in detail here: https://t.co/CuDeeJOuZo pic.twitter.com/7YKBkIJeCR
— Punekar News (@punekarnews) June 15, 2025
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!