Jagdeep Dhankhar elected India's new Vice President: సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన జగ్దీప్ ధన్కర్ అంచెలంచెలుగా ఎదుగుతూ.. ఉప రాష్ట్రపతి పదవిని పొందారు. తాజాగా ఉప రాస్ట్రపతి ఎన్నికల్లో జగ్దీప్ ధన్కర్ భారీ విజయం సాధించారు. ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన జగ్దీప్ ధన్కర్, విపక్షాల అభ్యర్థి మార్గరేట్ ఆల్వాను ఓడించారు. ఇన్నాళ్లు పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పనిచేసిన జగ్దీప్ ధన్కర్ ఆగస్టు 11న భారత 14వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
Jagdeep Dhankhar elected India's new Vice President: భారత ఉప రాష్ట్రపతిగా జగ్ దీప్ ధన్కర్ భారీ విజయం సాధించారు. ఎన్డీయే కూటమి తరుపున బరిలోకి దిగిన ధన్కర్, యూపీఏ సారథ్యంలో విపక్షాల అభ్యర్థి మార్గరేట్ ఆల్వాపై భారీ విజయాన్ని నమోదు చేశారు. లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు సభ్యులుగా ఉన్న ఎలక్టోరల్ కాలేజీలో ఓట్లలో మెజారిటీ ఓట్లు ధన్కర్ కే పడ్డాయి. మొత్తం పార్లమెంట్ సభ్యుల్లోని 780 మంది ఓటర్లలో 725 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంట్లో 528…
NITI Aayog comments on cm kcr allegation: ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విమర్శలపై నీతి ఆయోగ్ స్పందించింది. కేసీఆర్ ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అజెండా తయారీలో రాష్ట్రాల సహకారం లేదని కేసీఆర్ చేసిన విమర్శల్లో నిజం లేదని తేల్చిచెప్పింది. రేపటి సమావేశానికి సన్నాహకంగా తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాల సీఎస్ లతో సంప్రదింపులు జరిగాయని తెలిపింది. రాష్ట్రాలతో సన్నిహితంగా పనిచేయడానికి ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని.. గత ఏడాది సీఎంలతో 30కి పైగా సమావేశాలు జరిగాయని అన్నారు. గతంలో నీతి…
Revanth reddy comments on CM KCR: గత ఎనిమిదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఉండీ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించిన కేసీఆర్, తాజాగా జరగబోతున్న నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, వచ్చే నిధులపై ప్రశ్నిస్తారని భావించామని.. అయితే చివరికి సమావేశాన్ని బహిష్కరించారని విమర్శించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. సమావేశాన్ని బహిష్కరించడం అంటే ప్రధాని నరేంద్రమోాదీ, సీఎం కేసీఆర్ కు మధ్య ఉన్న చీకటి ఒప్పందాన్ని మరోసారి నిరూపించుకున్నారని ఆరోపించారు. చాలా సందర్భాల్లో నీతి ఆయోగ్ సమావేశంలో…
Addanki Dayakar Apology TO komatireddy venkat reddy: కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు. శుక్రవారం చండూర్ సభలో తాను ఉద్దేశపూర్వకంగా అలాంటి పదాలు వాడలేదని..పార్టీకి నష్టం కలగకూడదనే క్షమాపణలు చెబుతున్నానని ఆయన అన్నారు. వాడుక భాషలో ఆ పదాలు వచ్చాయని.. దీనిపై కొంత అభ్యంతరం వచ్చిందని దయాకర్ అన్నారు. తప్పు జరిగిందని.. ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నానని తెలిపారు. ఈ వ్యాఖ్యలు చేయడంపై టీపీసీసీ షోకాజ్ నోటీసులు వచ్చాయని.. నోటీసులు రావడాన్ని తప్పుగా భావించడం లేదని..…
M. M. Keeravani: ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి బాణీలు ఆయన తమ్ముడు ఎస్.ఎస్.రాజమౌళికి తప్ప ఇతరులకు ఇప్పుడు కలసి రావడం లేదు అనే టాక్ కొంతకాలంగా వినిపిస్తోంది. అయితే తన దరికి చేరిన ప్రతీ చిత్రాన్ని తొలి సినిమాగా భావించి బాణీలు కడుతూ ఉంటారు కీరవాణి. ఎవరు ఏమనుకున్నా, నందమూరి ఫ్యామిలీలో తండ్రులకు, కొడుకులకు అచ్చివచ్చిన సంగీత దర్శకునిగా కీరవాణి నిలచిపోయారు. తాజాగా కళ్యాణ్ రామ్ 'బింబిసార'కు మ్యూజిక్ అందించారు కీరవాణి.
Krithi Shetty Interview: యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ 'మాచర్ల నియోజకవర్గం' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీ గా నిర్మించారు. చిత్రానికి ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నెంబర్ నంబర్ రారా రెడ్డిలో సందడి చేస్తోంది. ఇప్పటికే విడుదలైన చార్ట్బస్టర్ పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ…
Tamilnadu-IT Raids: కోలీవుడ్ టార్గెట్ గా ఐటీ శాఖ ఇటీవల తమిళనాడు వ్యాప్తంగా దాడులు చేసింది. ఏక కాలంలో 40 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్ల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. ఆగస్టు 2న నిర్వహించిన సోదాల్లో లెక్కలోకి రాని లావాదేవీలు, పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేస్తున్నారు. సోదాల సమయంలో పలు రహస్య ప్రాంతాలను గుర్తించింది. ఈ విషయాన్ని శనివారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ( సీబీడీటీ) ప్రకటించింది.
Israel-Gaza Conflict: ఇజ్రాయిల్ దాడులతో విరుకుకుపడుతోంది. గాజా స్ట్రిప్ లోని పలు లక్ష్యాలపై వైమానిక దాడులు చేస్తోంది. రెండో రోజు కూడా ఇజ్రాయిల్ తన దాడులను పెంచింది. గాజాను నియంత్రిస్తున్న ఇస్లామిక్ జిహాద్ తీవ్రవాదులపై ఇజ్రాయిల్ వరసగా దాడులు చేస్తోంది. శుక్రవారం జరిగిన దాడుల్లో ఒక చిన్నారితో పాటు తొమ్మిది మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇందులో నలుగురు ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాదులను ఇజ్రాయిల్ హతమార్చింది. సుమారుగా 79 మంది గాయపడ్డారు. గత ఏడాది కాలంగా ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య ఉన్న శాంతి వాతావరణం మరోసారి…
Rakesh Tikait: మరోసారి భారత కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్ భారీ ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో భారీ ఆందోళనలు చేసిన రాకేష్ టికాయత్.. ప్రస్తుతం కేంద్రం తీసుకుచ్చని ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్ ‘ అగ్నిపథ్’ఫై ఆందోళనకు సిద్ధం అవుతున్నాడు. ఆగస్టు 7 నుంచి అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా తమ రైతు సంఘం ప్రచారం ప్రారంభిస్తుందని ఆయన అన్నారు. ఆగస్టు 7న ప్రారంభం అయ్యే ఆందోళనలు వారం పాటు సాగుతాయని ఆయన…