Revanth Reddy: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందం.. అందుకే సమావేశం బహిష్కరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth reddy comments on CM KCR: గత ఎనిమిదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఉండీ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించిన కేసీఆర్, తాజాగా జరగబోతున్న నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, వచ్చే నిధులపై ప్రశ్నిస్తారని భావించామని.. అయితే చివరికి సమావేశాన్ని బహిష్కరించారని విమర్శించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. సమావేశాన్ని బహిష్కరించడం అంటే ప్రధాని నరేంద్రమోాదీ, సీఎం కేసీఆర్ కు మధ్య ఉన్న చీకటి ఒప్పందాన్ని మరోసారి నిరూపించుకున్నారని ఆరోపించారు. చాలా సందర్భాల్లో నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ మంత్రులు హక్కులను సాధించుకోలేదని విమర్శించారు. తెలంగాణ పథకాలకు నిధులు ఇవ్వలేదని కేసీఆర్ ఆరోపిస్తున్నారని.. అయితే ప్రధాన మంత్రిని ప్రత్యక్షంగా ఎందుకు ప్రశ్నించే అవకాశాన్ని వదులుకుంటున్నారని విమర్శించారు. సమావేశాలను బహిష్కరించడం అంటే క్షమించరాని నేరమని.. ప్రత్యేక విమానాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుందని.. రేపు తప్పని సరిగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
Also Read
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
- Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
నరేంద్ర మోదీ ముఖ్యమైన అనుచరుడిగా కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు గుర్తించారని ఆరోపించారు. మాటలు మోదీకి వ్యతిరేకంగా ఉన్నా.. చేతలు మాత్రం అందుకు అనుగుణంగా లేవని కేసీఆర్ ని విమర్శించారు రేవంత్ రెడ్డి. విజిలెన్స్, ఏసీబీని నచ్చని వాళ్లపై వినియోగిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హాయాంలో నిఘా విభాగాలన్నింటిని ప్రతపక్షాలు, నీ పార్టీ సభ్యులపైనే వినియోగిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో కూడా మోదీ ఈడీ, సీబీఐ, ఐటీలను ఇలాగే ఉపయోగిస్తున్నారని.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి, ప్రతిపక్షాలను అణగదొక్కడానికి వినియోగిస్తున్నారని విమర్శిస్తున్నారు.
READ ALSO: Addanki Dayakar: పొరపాటున నోరు జారా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణ
నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోరాడుతున్నా అని కేసీఆర్ చెబుతున్నా.. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ హాజరు కావాలని.. నరేంద్ర మోదీని ముఖాముఖిగా నిలదీయాలని.. విభజన చట్టంలోని హామీలపై ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీకి లొంగిపోయి సమావేశానికి హాజరుకావడం లేదని విమర్శించారు. ఢిల్లీలో సమావేశాలు ఉన్నాయంటే కేసీఆర్ ఫామ్ హౌజులో పండుకుంటారని దుయ్యబట్టారు. పార్టీ నుంచి వెళ్లే పోయే వారికి కాలమే సమాధానం చెబుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని.. బీజేపీలో ఇటువంటి స్వేచ్ఛ ఉందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Best EV Cars India: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన వేళ.. అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. తక్కువ ధరకే ఎక్కువ దూరం
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!