Revanth Reddy: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందం.. అందుకే సమావేశం బహిష్కరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth reddy comments on CM KCR: గత ఎనిమిదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఉండీ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించిన కేసీఆర్, తాజాగా జరగబోతున్న నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, వచ్చే నిధులపై ప్రశ్నిస్తారని భావించామని.. అయితే చివరికి సమావేశాన్ని బహిష్కరించారని విమర్శించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. సమావేశాన్ని బహిష్కరించడం అంటే ప్రధాని నరేంద్రమోాదీ, సీఎం కేసీఆర్ కు మధ్య ఉన్న చీకటి ఒప్పందాన్ని మరోసారి నిరూపించుకున్నారని ఆరోపించారు. చాలా సందర్భాల్లో నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ మంత్రులు హక్కులను సాధించుకోలేదని విమర్శించారు. తెలంగాణ పథకాలకు నిధులు ఇవ్వలేదని కేసీఆర్ ఆరోపిస్తున్నారని.. అయితే ప్రధాన మంత్రిని ప్రత్యక్షంగా ఎందుకు ప్రశ్నించే అవకాశాన్ని వదులుకుంటున్నారని విమర్శించారు. సమావేశాలను బహిష్కరించడం అంటే క్షమించరాని నేరమని.. ప్రత్యేక విమానాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుందని.. రేపు తప్పని సరిగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
Also Read
నరేంద్ర మోదీ ముఖ్యమైన అనుచరుడిగా కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు గుర్తించారని ఆరోపించారు. మాటలు మోదీకి వ్యతిరేకంగా ఉన్నా.. చేతలు మాత్రం అందుకు అనుగుణంగా లేవని కేసీఆర్ ని విమర్శించారు రేవంత్ రెడ్డి. విజిలెన్స్, ఏసీబీని నచ్చని వాళ్లపై వినియోగిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హాయాంలో నిఘా విభాగాలన్నింటిని ప్రతపక్షాలు, నీ పార్టీ సభ్యులపైనే వినియోగిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో కూడా మోదీ ఈడీ, సీబీఐ, ఐటీలను ఇలాగే ఉపయోగిస్తున్నారని.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి, ప్రతిపక్షాలను అణగదొక్కడానికి వినియోగిస్తున్నారని విమర్శిస్తున్నారు.
READ ALSO: Addanki Dayakar: పొరపాటున నోరు జారా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణ
నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోరాడుతున్నా అని కేసీఆర్ చెబుతున్నా.. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ హాజరు కావాలని.. నరేంద్ర మోదీని ముఖాముఖిగా నిలదీయాలని.. విభజన చట్టంలోని హామీలపై ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీకి లొంగిపోయి సమావేశానికి హాజరుకావడం లేదని విమర్శించారు. ఢిల్లీలో సమావేశాలు ఉన్నాయంటే కేసీఆర్ ఫామ్ హౌజులో పండుకుంటారని దుయ్యబట్టారు. పార్టీ నుంచి వెళ్లే పోయే వారికి కాలమే సమాధానం చెబుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని.. బీజేపీలో ఇటువంటి స్వేచ్ఛ ఉందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!