Piyush Goyal: కేసీఆర్ తెలంగాణకు “నిజాం”గా మారాడు.. రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకు ఆసక్తి లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union minister Piyush Goyal criticizes CM KCR: కేసీఆర్ రేపు జరగబోయే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు. నీతి ఆయోగ్ రాష్ట్రాలను పట్టించుకోవడం లేదని.. ఎజెండా తయారీలో రాష్ట్రాల భాగస్వామ్యం ఉండటం లేదని.. సహకార సమాఖ్య విధానంలో నీతి ఆయోగ్ వ్యవహరించడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నీతి ఆయోగ్ సమావేశం ముఖ్యమంత్రులు మాట్లాడటానికి కూడా సమయం ఇవ్వడం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశం అయ్యాయి.
ఇప్పటికే నీతి ఆయోగ్ ఈ వ్యాఖ్యలను తప్పుబట్టింది. కేసీఆర్ ఆరోపణల్లో నిజం లేదని నీతి ఆయోగ్ వ్యాఖ్యానించింది. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం ఎప్పుడూ సహకరిస్తోందని తెలిపింది. ఇప్పటికే నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ కు అభ్యర్థనలు పంపామని.. అయితే ఆయన పెద్దగా పట్టించుకోలేదని అంది. కేంద్రం, తెలంగాణకు ఇచ్చిన నిధుల వివరాలను కూడా వెళ్లడించింది. కేసీఆర్ వ్యాఖ్యలపై ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్, ప్రధాని మోదీకి మధ్య చీకటి ఒప్పందం ఉందని అన్నారు. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రధాని మోదీకి మొహం చూపించలేకే సమావేశానికి గైర్హాజరు అవుతున్నారని విమర్శించారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Read Also: Honeymoon Record: పదేళ్లు.. 65 దేశాలు.. హనీమూన్లో రికార్డు సృష్టిస్తున్న జంట
తాజాగా కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశ బహిష్కరణపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై ఆసక్తి లేదని వ్యాఖ్యానించారు. నీతి ఆయోగ్ సమావేశానికి హజరకాకపోవడానికి కేసీఆర్ నిరాకరించడంపై తనకు తాను చాలా గొప్పగా భావిస్తున్నాడంటూ చురకలు అంటించారు. దేశాన్ని ముందుకెళ్లే దిశలో నీతి ఆయోగ్ పని చేస్తోందనే సంగతి సీఎం కేసీఆర్ మరిచిపోయారని..తెలంగాణఖు కేసీఆర్ నిజాం అయ్యాడని.. దేశం, రాష్ట్రాల అభివృద్ధిపై జరిగే చర్చను కేసీఆర్ నమ్మడని విమర్శించారు.
Delhi | His views reflect that he is not interested in the development of his state, his ward. He thinks himself to be too great to attend it: Union min Piyush Goyal on CM Telangana KCR's refusal to attend NITI Aayog meeting pic.twitter.com/GxhTnArlzl
— ANI (@ANI) August 6, 2022
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!