Piyush Goyal: కేసీఆర్ తెలంగాణకు “నిజాం”గా మారాడు.. రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకు ఆసక్తి లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union minister Piyush Goyal criticizes CM KCR: కేసీఆర్ రేపు జరగబోయే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు. నీతి ఆయోగ్ రాష్ట్రాలను పట్టించుకోవడం లేదని.. ఎజెండా తయారీలో రాష్ట్రాల భాగస్వామ్యం ఉండటం లేదని.. సహకార సమాఖ్య విధానంలో నీతి ఆయోగ్ వ్యవహరించడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నీతి ఆయోగ్ సమావేశం ముఖ్యమంత్రులు మాట్లాడటానికి కూడా సమయం ఇవ్వడం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశం అయ్యాయి.
ఇప్పటికే నీతి ఆయోగ్ ఈ వ్యాఖ్యలను తప్పుబట్టింది. కేసీఆర్ ఆరోపణల్లో నిజం లేదని నీతి ఆయోగ్ వ్యాఖ్యానించింది. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం ఎప్పుడూ సహకరిస్తోందని తెలిపింది. ఇప్పటికే నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ కు అభ్యర్థనలు పంపామని.. అయితే ఆయన పెద్దగా పట్టించుకోలేదని అంది. కేంద్రం, తెలంగాణకు ఇచ్చిన నిధుల వివరాలను కూడా వెళ్లడించింది. కేసీఆర్ వ్యాఖ్యలపై ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్, ప్రధాని మోదీకి మధ్య చీకటి ఒప్పందం ఉందని అన్నారు. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రధాని మోదీకి మొహం చూపించలేకే సమావేశానికి గైర్హాజరు అవుతున్నారని విమర్శించారు.
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
Read Also: Honeymoon Record: పదేళ్లు.. 65 దేశాలు.. హనీమూన్లో రికార్డు సృష్టిస్తున్న జంట
తాజాగా కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశ బహిష్కరణపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై ఆసక్తి లేదని వ్యాఖ్యానించారు. నీతి ఆయోగ్ సమావేశానికి హజరకాకపోవడానికి కేసీఆర్ నిరాకరించడంపై తనకు తాను చాలా గొప్పగా భావిస్తున్నాడంటూ చురకలు అంటించారు. దేశాన్ని ముందుకెళ్లే దిశలో నీతి ఆయోగ్ పని చేస్తోందనే సంగతి సీఎం కేసీఆర్ మరిచిపోయారని..తెలంగాణఖు కేసీఆర్ నిజాం అయ్యాడని.. దేశం, రాష్ట్రాల అభివృద్ధిపై జరిగే చర్చను కేసీఆర్ నమ్మడని విమర్శించారు.
Delhi | His views reflect that he is not interested in the development of his state, his ward. He thinks himself to be too great to attend it: Union min Piyush Goyal on CM Telangana KCR's refusal to attend NITI Aayog meeting pic.twitter.com/GxhTnArlzl
— ANI (@ANI) August 6, 2022
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!