NITI Aayog: సీఎం కేసీఆర్ ఆరోపణల్లో నిజం లేదు.. మీటింగ్ లో పాల్గొనకపోవడం దురదృష్టకరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NITI Aayog comments on cm kcr allegation: ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విమర్శలపై నీతి ఆయోగ్ స్పందించింది. కేసీఆర్ ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అజెండా తయారీలో రాష్ట్రాల సహకారం లేదని కేసీఆర్ చేసిన విమర్శల్లో నిజం లేదని తేల్చిచెప్పింది. రేపటి సమావేశానికి సన్నాహకంగా తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాల సీఎస్ లతో సంప్రదింపులు జరిగాయని తెలిపింది. రాష్ట్రాలతో సన్నిహితంగా పనిచేయడానికి ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని.. గత ఏడాది సీఎంలతో 30కి పైగా సమావేశాలు జరిగాయని అన్నారు. గతంలో నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ తో సమావేశం అయిందని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఇటీవల సమావేశం కోసం నీతి ఆయోగ్ సీఎం అభ్యర్థనలు పంపామని.. అయితే సీఎం స్పందించలేదని నీతి ఆయోగ్ వెల్లడించింది.
నీతి ఆయోగ్ ఎజెండా తయారీలో రాష్ట్రాల పాత్ర లేదన్న విమర్శలను కొట్టి పారేసింది నీతి ఆయోగ్. జూన్ లో అన్ని రాష్ట్రాల సీఎస్ లతో సమావేశం జరిగిందని.. గత నెల 7న జరిగిన సమావేశాల్లో తెలంగాణ ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపింది. గత నాలుగేళ్లుగా తెలంగాణకు జల్ జీవన్ మిషన్ కింద రూ. 3982 కోట్లు కేటాయించామని.. కానీ రాష్ట్రం రూ. 200 కోట్లు మాత్రమే డ్రా చేసుకుందని.. అదనంగా.. 2014-2015 నుంచి 2021-22 మధ్య కాలంలో ప్రధాన మంత్రి కౌషల్ వికాస్ యోజన కింద తెలంగాణకు రూ. 1195 కోట్లు విడుదయ్యాయని నీతి ఆయోగ్ వెల్లడించింది. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని నీతి ఆయోగ్ వెల్లడించింది. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొనకపోవడం దురదృష్టకరం అని నీతి ఆయోగ్ అంది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేటాయింపులు 2015-16లో రూ. 2,03,740 కోట్లు ఉంటే 2022-23లో రూ. 4,42,781 కోట్లుగా ఉంది, అంటే రెట్టింపు కంటే ఎక్కువ పెరిగాయని నీతి ఆయోగ్ వెల్లడించింది. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాల కేటాయింపులను 32% నుండి 42 శాతానికి పెంచిందని..సీఎస్ఎస్ కింద కేటాయించిన నిధుల వినియోగానికి తగిన వెసులుబాటు కల్పించిందని నీతి ఆయోగ్ వెల్లడించింది.
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
శనివారం జరిగిన సమావేశంలో నీతి ఆయోగ్ పై విమర్శలు గుప్పించారు. నీతి ఆయోగ్ భజన మండలిగా మారిందని.. నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రులు మాట్లాడటానికి నాలుగు నిమిషాల సమయం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎజెండా రూపకల్పలో సహకార సమాఖ్య అనేది లేదని.. నీతి ఆయోగ్ ఎజెండా ఎవరు తయారు చేస్తారో తెలియదని వ్యాఖ్యానించారు. కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల విషయంలో సహకరించడం లేదని విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!