NITI Aayog: సీఎం కేసీఆర్ ఆరోపణల్లో నిజం లేదు.. మీటింగ్ లో పాల్గొనకపోవడం దురదృష్టకరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NITI Aayog comments on cm kcr allegation: ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విమర్శలపై నీతి ఆయోగ్ స్పందించింది. కేసీఆర్ ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అజెండా తయారీలో రాష్ట్రాల సహకారం లేదని కేసీఆర్ చేసిన విమర్శల్లో నిజం లేదని తేల్చిచెప్పింది. రేపటి సమావేశానికి సన్నాహకంగా తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాల సీఎస్ లతో సంప్రదింపులు జరిగాయని తెలిపింది. రాష్ట్రాలతో సన్నిహితంగా పనిచేయడానికి ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని.. గత ఏడాది సీఎంలతో 30కి పైగా సమావేశాలు జరిగాయని అన్నారు. గతంలో నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ తో సమావేశం అయిందని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఇటీవల సమావేశం కోసం నీతి ఆయోగ్ సీఎం అభ్యర్థనలు పంపామని.. అయితే సీఎం స్పందించలేదని నీతి ఆయోగ్ వెల్లడించింది.
నీతి ఆయోగ్ ఎజెండా తయారీలో రాష్ట్రాల పాత్ర లేదన్న విమర్శలను కొట్టి పారేసింది నీతి ఆయోగ్. జూన్ లో అన్ని రాష్ట్రాల సీఎస్ లతో సమావేశం జరిగిందని.. గత నెల 7న జరిగిన సమావేశాల్లో తెలంగాణ ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపింది. గత నాలుగేళ్లుగా తెలంగాణకు జల్ జీవన్ మిషన్ కింద రూ. 3982 కోట్లు కేటాయించామని.. కానీ రాష్ట్రం రూ. 200 కోట్లు మాత్రమే డ్రా చేసుకుందని.. అదనంగా.. 2014-2015 నుంచి 2021-22 మధ్య కాలంలో ప్రధాన మంత్రి కౌషల్ వికాస్ యోజన కింద తెలంగాణకు రూ. 1195 కోట్లు విడుదయ్యాయని నీతి ఆయోగ్ వెల్లడించింది. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని నీతి ఆయోగ్ వెల్లడించింది. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొనకపోవడం దురదృష్టకరం అని నీతి ఆయోగ్ అంది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేటాయింపులు 2015-16లో రూ. 2,03,740 కోట్లు ఉంటే 2022-23లో రూ. 4,42,781 కోట్లుగా ఉంది, అంటే రెట్టింపు కంటే ఎక్కువ పెరిగాయని నీతి ఆయోగ్ వెల్లడించింది. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాల కేటాయింపులను 32% నుండి 42 శాతానికి పెంచిందని..సీఎస్ఎస్ కింద కేటాయించిన నిధుల వినియోగానికి తగిన వెసులుబాటు కల్పించిందని నీతి ఆయోగ్ వెల్లడించింది.
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
శనివారం జరిగిన సమావేశంలో నీతి ఆయోగ్ పై విమర్శలు గుప్పించారు. నీతి ఆయోగ్ భజన మండలిగా మారిందని.. నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రులు మాట్లాడటానికి నాలుగు నిమిషాల సమయం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎజెండా రూపకల్పలో సహకార సమాఖ్య అనేది లేదని.. నీతి ఆయోగ్ ఎజెండా ఎవరు తయారు చేస్తారో తెలియదని వ్యాఖ్యానించారు. కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల విషయంలో సహకరించడం లేదని విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
India Forex Reserves: రూపాయి స్థిరత్వానికి బలం.. పెరిగిన విదేశీ మారక నిల్వలు.. 938 మిలియన్ డాలర్ల వృద్ధి
-
Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
-
Peddi: జాన్వీ కపూర్ పాత్రపై డైరెక్టర్ బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
-
Vladimir Putin: “భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం”.. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!