Yashasvi Jaiswal: ఆస్పత్రిలో చేరిన టీమిండియా క్రికెటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yashasvi Jaiswal: టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ యశస్వి జైస్వాల్ పూణేలోని ఆదిత్య బిర్లా ఆసుపత్రిలో చేరారు. హర్యానాతో జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగాఈ ప్లేయర్కు తీవ్ర అస్వస్థత ఏర్పడింది. మ్యాచ్ తర్వాత జైస్వాల్ తీవ్ర అస్వస్థతకు గురికాగా, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలో యశస్వి జైస్వాల్ కడుపులో వాపు ఉన్నట్లు తేలిందని వైద్యులు తెలిపారు. CT స్కాన్, అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించగా, జైస్వాల్కు తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు.
READ ALSO: Boomi Humanoid Robot: ప్రపంచంలోనే అత్యంత చౌకైన రోబో.. ఐఫోన్ ధరకే..
Also Read
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
ప్రస్తుతానికి యశస్వి జైస్వాల్ క్రికెట్ ఆడకూడదని వైద్యులు సూచించారు. ఈ స్టార్ బ్యాట్స్మెన్కు ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ఆయన త్వరలో కోలుకుంటాడని అందరూ భావిస్తున్నారు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ఈ స్టార్ ప్లేయర్ అసాధారణంగా రాణించాడు. హర్యానాపై కేవలం 50 బంతుల్లోనే 101 పరుగులు చేసి, జట్టును విజయపథంలో నడిపించాడు. అయితే అనారోగ్య కారణాల వల్ల ఇప్పుడు జైస్వాల్కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. నిజానికి టీ20 జట్టులో ఈ ప్లేయర్కు చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ తర్వాత, టీమిండియా నెక్ట్స్ సిరీస్ వచ్చే ఏడాది స్టార్ట్ కానుంది. జనవరిలో న్యూజిలాండ్ ఇండియాలో పర్యటిస్తుంది. ఈ టైంలో భారత్ – న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు జరుగనున్నాయి. వన్డే సిరీస్ జనవరి 11న, టీ20 సిరీస్ జనవరి 21న ప్రారంభం కానున్నాయి.
Yashasvi Jaiswal has been admitted to the hospital due to stomach swelling. Wishing him a speedy and complete recovery. Get well soon, champ 🤍 pic.twitter.com/BgFymmGPA6
— jaiswalhype (@jaiswalhype19) December 16, 2025
తాజావార్తలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?