Addanki Dayakar: పొరపాటున నోరు జారా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Addanki Dayakar Apology to komatireddy venkat reddy: కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు. శుక్రవారం చండూర్ సభలో తాను ఉద్దేశపూర్వకంగా అలాంటి పదాలు వాడలేదని..పార్టీకి నష్టం కలగకూడదనే క్షమాపణలు చెబుతున్నానని ఆయన అన్నారు. వాడుక భాషలో ఆ పదాలు వచ్చాయని.. దీనిపై కొంత అభ్యంతరం వచ్చిందని దయాకర్ అన్నారు. తప్పు జరిగిందని.. ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నానని తెలిపారు. ఈ వ్యాఖ్యలు చేయడంపై టీపీసీసీ షోకాజ్ నోటీసులు వచ్చాయని.. నోటీసులు రావడాన్ని తప్పుగా భావించడం లేదని.. మళ్లీ ఇది రిపీట్ కాదని మాటిస్లున్నానని అద్దంకి దయాకర్ అన్నారు. వెంకట్ రెడ్దిగారి మనోభావాలు దెబ్బతింటే.. వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఇబ్బందులు వచ్చినా.. ఒకరికి ఒకరు సహకరించుకోవాలని అంతా ఒక తాటిపైకి వచ్చామని అన్నారు. క్షమాపణ కమిటీకి, టీపీసీసీకి లేఖ పంపుతా అని తెలిపారు. పార్టీ క్షమశిక్షణ దాటే కార్యకర్తను కాదని.. పార్టీకి నష్టం కలిగించాలని ఎప్పుడూ ప్రయత్నించలేదని దయాకర్ అన్నారు. నాయకులు వ్యక్తిగత ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదని ఆయన అన్నారు.
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
Read Also: KCR To Modi: మోడీ నా ఫ్రెండ్. అయినా.. నా ప్రాణం ఉన్నంత వరకు ఆయన్ని ప్రశ్నిస్తూనే ఉంటా: సీఎం కేసీఆర్
సామాజిక న్యాయం ఉన్నది కేవలం ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే అని.. బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీలో సోషల్ జస్టిస్ లేదని వ్యాఖ్యానిస్తున్నాడని పీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ విమర్శించారు. భారత దేశంలో సామాజిక న్యాయాన్ని అమలు చేసేది ఒక్క కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రెడ్డి వర్గానికి చెందిన వారు అయితే.. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఒక బీసీ అని..సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క ఒక దళిత వ్యక్తి అని బెల్లయ్య నాయక్ గుర్తు చేశారు. అన్ని కులాల సమకూర్పే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అధిపత్య ధోరణి చెలామణి అయ్యేది బీజేపీలోనే అని విమర్శించారు. అణగారిన పేదల కోసం ఉపాధి హామీ పథకం తెల్చింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. అణచివేతకకు గురైన వారికి కాంగ్రెస్ అండగా నిలుస్తుందని ఆయన అన్నారు.
చండూర్ లో జరిగిన కాంగ్రెస్ సభలో అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వెంటక్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరు ఎటు పక్కన ఉంటారని.. ఈ గట్టున ఉంటావా..? ఆ గట్టున ఉంటావా..? అని ప్రశ్నించారు. మీ నియోజకవర్గంలో ఎన్నికలు వస్తుంటే.. మీరు మోదీ, అమిత్ షాల వద్ద మోకరిల్లారని విమర్శించారు. మీరు కాంగ్రెస్ లో ఉంటే ఉండండీ.. లేకపోతే.. అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దీనిపై అద్దంకి దయాకర్ క్షమాపణలు చెప్పారు.
తాజావార్తలు
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!