Racist attack on Indians in America: అమెరికాలో జాత్యహంకార దాడి జరిగింది. నలుగురు భారతీయ-అమెకన్లపై ఓ మహిళ జాతిపరంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టెక్సాస్ రాష్ట్రంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నలుగురు భారతీయ-అమెరికన్ మహిళలు మాట్లాడుతుండగా.. అక్కడికి వచ్చిన ఓ మహిళ విద్వేశపూరిత వ్యాఖ్యలు చేసింది. భారత్ కు తిరిగి వెళ్లండి అంటూ దుర్భాషలాడింది.
CJI NV Ramana retires today: భారత ప్రధాన న్యాయమూర్తి( సీజేఐ)గా ఎన్వీ రమణ శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీం కోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఏప్రిల్ 24, 2021లో బాధ్యతలు చేపట్టారు. ఆగస్టు 26, 2022న పదవీ విరమణ చేయనున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ లలిత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐగా చివరి రోజు పలు హై ప్రొఫైల్ కేసులును విచారించారు. గురువారం రోజు పెగాసస్ స్పైవేర్ కేసుతో పాటు, ఇటీవల బిల్కిస్ బానో కేసులో శిక్ష అనుభవిస్తున్న…
US senator Marsha Blackburn visits Taiwan: యూఎస్ స్పీకర్ నాన్సిపెలోసి తైవాన్ పర్యటన తైవాన్ - చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. నాన్సి పెలోసీ పర్యటనను డ్రాగన్ కంట్రీ వ్యతిరేకించింది. అమెరికాకు నిప్పుతో చెలగాటం అడుతున్నారంటూ వార్నింగ్ ఇచ్చింది. అయితే తాజాగా మరో అమెరికన్ లీడర్ తైవాన్ లో పర్యటిస్తున్నారు. తాజాగా అమెరికన్ సెనెటర్, టెన్సెసీకి చెందిన రిపబ్లికన్ నేత మార్షా బ్లాక్బర్న్ గురువారం తైవాన్ చేరారు. ప్రత్యేక విమానంలో తైపీ సాంగ్ షాన్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు.
United Nations Security Council: రష్యా-ఉక్రెయిన్ యుద్దం ప్రారంభం అయిన తర్వాత ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో భారత్ తొలిసారిగా రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది. భద్రతా మండలిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ వర్చువల్ గా ప్రసంగించేందుకు ప్రవేశపెట్టిన తీర్మాణానికి భారత్ అనుకూలంగా ఓటేసింది. అయితే జెలెన్ స్కీ మాట్లాడేందుకు రష్యా వ్యతిరేకించింది. మొత్తం 15 సభ్య దేశాలు ఉన్న భద్రతా మండలిలో భారత్ తో పాటు మొత్తం 13 దేశాలు జెలెన్ స్కీకి మద్దతుగా నిలవగా.. రష్యా వ్యతిరేకించింది. చైనా ఓటింగ్ కు…
BJP leader Sonali Phogat suspicious death: టిక్ టాక్ స్టార్, బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్(43) మరణంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇటీవల గోవాలో పర్యటిస్తున్న సందర్భంలో ఆమె హఠాన్మరణం చోటు చేసుకుంది. ఆమె మరణంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆమె అటాప్సీ పరీక్షల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Man Tests Positive For Monkeypox, COVID-19 And HIV At The Same Time: ప్రపంచం మొత్తం కరోనా, మంకీపాక్స్ వ్యాధులతో సతమతం అవుతోంది. రెండున్నరేళ్లుగా కరోనా వ్యాధి ప్రపంచాన్ని వదలడం లేదు. ఇక మంకీపాక్స్ వైరస్ ప్రపంచంలో 90కి పైగా దేశాల్లో వ్యాపించింది. ముఖ్యంగా యూరప్, అమెరికా ప్రాంతాల్లో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల హెచ్ఐవీ, మంకీపాక్స్ కేసులు ఒకే వ్యక్తిలో గుర్తించారు. తాజాగా డెడ్లీ కాంబినేషన్ మంకీపాక్స్, కరోనా, హెచ్ఐవీ ఒకే వ్యక్తిలో కనుక్కున్నారు వైద్యులు.
Jharkhand CM Hemant Soren: జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నేత, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ కు షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. తనకు తాను మైనింగ్ లీజును పొడగించడం ద్వారా ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించినందుకు ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ చేసిన అభ్యర్థనపై ఎన్నికల సంఘం తన అభిప్రాయాన్ని జార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్ కు పంపింది. ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని సీల్డ్ కవర్ లో పంపినట్లు జార్ఖండ్ రాజ్ భవన్ వర్గాలు వెల్లడించారు.
Supreme Court On Bilkis Bano Case: 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11 మంది దోషులను విడుదల చేయడంతో ప్రతిపక్షాలు గుజరాత్ ప్రభుత్వం, బీజేపీ పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఏకంగా ప్రధాని నరేంద్రమోదిని టార్గెట్ చేశారు. ఎర్రకోటపై మహిళ గౌరవం గురించి మాట్లాడిన 24 గంటల్లో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాాల్పడిన వ్యక్తుల్ని విడుదల చేయడాన్ని విమర్శించారు. ఇలా చేయడం ద్వారా భారత మహిళలకు ఏ సందేశం ఇస్తున్నారంటూ విమర్శించారు.
Supreme Court On Pegasus Spyware Case: దేశ రాజకీయాలకు ఓ కుదుపుకుదిపేసి పెగాసస్ స్పైవేర్ పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ తన రిపోర్టును ఈ రోజు సుప్రీంకోర్టుకు అందచేసింది. దీనిపై సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు విచారించింది. 29 ఫోన్లను పరిశీలించగా.. 5 ఫోన్లలో మాల్వేర్లు గుర్తించామని..అయితే పెగాసస్ స్పైవేర్ కు సంబంధించి ఎలాంటి రుజువు లేదని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. అయితే ఈ విచారణ సమయంలో భారత ప్రభుత్వం తమకు సహకరించలేదని కమిటీ…
supreme court on PM Security Breach Case: ఈ ఏడాది పంజాబ్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెక్యూరిటీ వైఫల్యం తలెత్తింది. పంజాబ్ ఫిరోజ్ పూర్ పర్యటనలో ఉండగా.. పంజాబ్ ప్రభుత్వం తగిన భద్రత కల్పించలేదనే విమర్శలు వచ్చాయి. ప్రధాన మంత్రి వంటి హైప్రొఫైల్ వ్యక్తి కాన్వాయ్ కొంతసేపు ఓ ఫ్లై ఓవర్ పై నిలిచిపోయింది. దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు ఈ విషయం విచారణ కోసం రైటైర్డ్ సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా నేతృత్వంలో…