CJI NV Ramana: నేడు సీజేఐ ఎన్వీ రమణ పదవీ విరమణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJI NV Ramana retires today: భారత ప్రధాన న్యాయమూర్తి( సీజేఐ)గా ఎన్వీ రమణ శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీం కోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఏప్రిల్ 24, 2021లో బాధ్యతలు చేపట్టారు. ఆగస్టు 26, 2022న పదవీ విరమణ చేయనున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ లలిత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐగా చివరి రోజు పలు హై ప్రొఫైల్ కేసులును విచారించారు. గురువారం రోజు పెగాసస్ స్పైవేర్ కేసుతో పాటు, ఇటీవల బిల్కిస్ బానో కేసులో శిక్ష అనుభవిస్తున్న 11 మందిని విడుదల చేసిన కేసుతో పాటు తీస్తా సెతల్వాడ్ కేసు, ప్రధానమంత్రి సెక్యురిటీ వైఫల్యం వంటి కేసులు విచారించారు.
ఎన్వీ రమణ పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా గురువారం ఢిల్లీ బార్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తన పదవీ కాలలో 224 మంది న్యాయమూర్తులను పలు హైకోర్టుల్లో నియమించానని ఆయన వెల్లడించారు. న్యాయమూర్తుల నియామకం, మౌళిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసినట్లు వెల్లడించారు. 2013-14 సమయంలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రోజుల్ని ఎన్వీ రమణ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం సుప్రీం కోొర్టులో న్యాయమూర్తులుగా ఉన్న కౌల్, ఇందిరా బెనర్జీ, సంజీవ్ ఖన్నా, ఎస్ రవీంద్ర భట్, హిమా కోహ్లీలు కూడా గతంలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేయడం విశేషం. వీరంతా కూడా ఎన్వీ రమణ వీడ్కోలు సమావేశానికి హాజరయ్యారు.
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
Read Also: MLA Rekha Nayak Controversy: ఎమ్మెల్యే రేఖానాయక్ హాట్ కామెంట్స్..ఆడియో వైరల్
ఢిల్లీ హైకోర్టును ఇతర హైకోర్టుతో పోల్చలేమని.. ఇక్కడ కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చిన అనుభవం సుప్రీంకోర్టు సీజేఐ బాధ్యతలు చేపట్టడానికి ప్రారంభం వంటిదని ఆయన అన్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జీలు తమ ఛాంబర్లలో రాత్రి 7-8 గంటల వరకు కూడా పనిచేసేవారని.. కొన్ని సార్లు 9 గంటల వరకు కూడా ఇక్కడే ఉండటాన్ని చూశానని ఆయన గుర్తు చేసుకున్నారు. సాధారణంగా సాయంత్రం 4 గంటల వరకు కోర్టుల్లో ఉంటారు.. అయితే ఢిల్లీలో పనితీరు చూసి ఆశ్చర్యపోయానని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!