PM Security Breach Case: ప్రధాని భద్రతా వైఫల్యంలో పంజాబ్ ఎస్ఎస్పీదే బాధ్యత: సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
supreme court on PM Security Breach Case: ఈ ఏడాది పంజాబ్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెక్యూరిటీ వైఫల్యం తలెత్తింది. పంజాబ్ ఫిరోజ్ పూర్ పర్యటనలో ఉండగా.. పంజాబ్ ప్రభుత్వం తగిన భద్రత కల్పించలేదనే విమర్శలు వచ్చాయి. ప్రధాన మంత్రి వంటి హైప్రొఫైల్ వ్యక్తి కాన్వాయ్ కొంతసేపు ఓ ఫ్లై ఓవర్ పై నిలిచిపోయింది. దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు ఈ విషయం విచారణ కోసం రైటైర్డ్ సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా నేతృత్వంలో ఐదుగురు కమిటీ సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.
తాజాగా గురువారం ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో జరిగింది. జస్టిస్ ఇందు మల్హోత్రా కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. సుప్రీంకోర్టు నివేదికలోని అంశాలను చదివి వినిపించింది. ఫిరోజ్ పూర్ ఎస్ఎస్పీ శాంతిభద్రతల పరిరక్షణలో తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిండంతో విఫలం అయ్యారని నివేదిక వెల్లడించింది. ఫిరోజ్ పూర్ ఎస్ఎస్పీ వద్ద తగినంత బలగాలు ఉన్నప్పటికీ.. ప్రధాని ఆ మార్గంలో వస్తారని 2 గంటల ముందు తెలియజేసినప్పటికీ సెక్యూరిటీని అరెంజ్ చేయడంతో విఫలం అయ్యారని నివేదికలోని అంశాలు సుప్రీంకోర్టు చదివింది.
Also Read
- DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్గా బాధ్యతలు
- Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
- Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ప్రధానమంత్రి భద్రతను పటిష్టం చేయడానికి పరిష్కార మార్గాలను సూచించింది. నివేదికను ప్రభుత్వానికి పంపి చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ ఏడాది జనవరి 5 ప్రధాని పంజాబ్ పర్యటనకు వెళ్లినప్పుడు పలువురు రైతులు ఆందోళనలు చేసి రోడ్డును బ్లాక్ చేశారు. దీంతో ప్రధానమంత్రి కన్వాయ్ కొంత సేపు ఓ ఫ్లై ఓవర్ పై నిలిచిపోయింది. తరువాత ఈ ఘటనలో ఖలిస్తానీ ఉగ్రసంస్థ హస్తం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు కురపించింది. కావాలనే పంజాబ్లోని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధానిని అవమానపరిచిందని బీజేపీ ఆరోపించింది.
తాజావార్తలు
-
I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
-
India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
-
Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
-
DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్గా బాధ్యతలు
-
Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!