PM Security Breach Case: ప్రధాని భద్రతా వైఫల్యంలో పంజాబ్ ఎస్ఎస్పీదే బాధ్యత: సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
supreme court on PM Security Breach Case: ఈ ఏడాది పంజాబ్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెక్యూరిటీ వైఫల్యం తలెత్తింది. పంజాబ్ ఫిరోజ్ పూర్ పర్యటనలో ఉండగా.. పంజాబ్ ప్రభుత్వం తగిన భద్రత కల్పించలేదనే విమర్శలు వచ్చాయి. ప్రధాన మంత్రి వంటి హైప్రొఫైల్ వ్యక్తి కాన్వాయ్ కొంతసేపు ఓ ఫ్లై ఓవర్ పై నిలిచిపోయింది. దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు ఈ విషయం విచారణ కోసం రైటైర్డ్ సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా నేతృత్వంలో ఐదుగురు కమిటీ సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.
తాజాగా గురువారం ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో జరిగింది. జస్టిస్ ఇందు మల్హోత్రా కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. సుప్రీంకోర్టు నివేదికలోని అంశాలను చదివి వినిపించింది. ఫిరోజ్ పూర్ ఎస్ఎస్పీ శాంతిభద్రతల పరిరక్షణలో తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిండంతో విఫలం అయ్యారని నివేదిక వెల్లడించింది. ఫిరోజ్ పూర్ ఎస్ఎస్పీ వద్ద తగినంత బలగాలు ఉన్నప్పటికీ.. ప్రధాని ఆ మార్గంలో వస్తారని 2 గంటల ముందు తెలియజేసినప్పటికీ సెక్యూరిటీని అరెంజ్ చేయడంతో విఫలం అయ్యారని నివేదికలోని అంశాలు సుప్రీంకోర్టు చదివింది.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ప్రధానమంత్రి భద్రతను పటిష్టం చేయడానికి పరిష్కార మార్గాలను సూచించింది. నివేదికను ప్రభుత్వానికి పంపి చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ ఏడాది జనవరి 5 ప్రధాని పంజాబ్ పర్యటనకు వెళ్లినప్పుడు పలువురు రైతులు ఆందోళనలు చేసి రోడ్డును బ్లాక్ చేశారు. దీంతో ప్రధానమంత్రి కన్వాయ్ కొంత సేపు ఓ ఫ్లై ఓవర్ పై నిలిచిపోయింది. తరువాత ఈ ఘటనలో ఖలిస్తానీ ఉగ్రసంస్థ హస్తం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు కురపించింది. కావాలనే పంజాబ్లోని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధానిని అవమానపరిచిందని బీజేపీ ఆరోపించింది.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!