Taiwan: తైవాన్ లో మరో అమెరికన్ లీడర్ పర్యటన.. చైనాకు భయపడేది లేదంటూ ట్వీట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US senator Marsha Blackburn visits Taiwan: యూఎస్ స్పీకర్ నాన్సిపెలోసి తైవాన్ పర్యటన తైవాన్ – చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. నాన్సి పెలోసీ పర్యటనను డ్రాగన్ కంట్రీ వ్యతిరేకించింది. అమెరికాకు నిప్పుతో చెలగాటం అడుతున్నారంటూ వార్నింగ్ ఇచ్చింది. అయితే తాజాగా మరో అమెరికన్ లీడర్ తైవాన్ లో పర్యటిస్తున్నారు. తాజాగా అమెరికన్ సెనెటర్, టెన్సెసీకి చెందిన రిపబ్లికన్ నేత మార్షా బ్లాక్బర్న్ గురువారం తైవాన్ చేరారు. ప్రత్యేక విమానంలో తైపీ సాంగ్ షాన్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు.
చైనాకు సందేశం పంపడానికి తైవాన్ లో అడుగపెట్టానని.. చైనాకు భయపడేది లేదని..ఆమె ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛను కాపాడేందుకు అమెరికా దృఢంగా ఉందని ఆమె అన్నారు. అమెరికా మిత్రదేశాలను అణగదొక్కే ప్రయత్నాలను సహించదని వ్యాఖ్యానించారు. అయితే అమెరికా లీడర్ మరోసారి తైవాన్ ను సందర్శించడంపై ఆదేశ విదేశాంగ శాఖ కృతజ్ఞతలు తెలియజేసింది. ఒకే నెలలో నలుగురు యూఎస్ రాజకీయ నాయకులు తైవాన్ లో పర్యటించారు. యూఎస్ స్పీకర్ నాన్సి పెలోసి పర్యటన తర్వాత సెనేటర్ ఎడ్ మార్కీ నేతృత్వంలోని మరో కాంగ్రెస్ ప్రతినిధి బృందం, ఇండియానా రిపబ్లికన్ గవర్నర్ ఎరిక్ హోల్కాంబ్ తైవాన్ లో పర్యటించారు. తాజాగా మార్షా బ్లాక్బర్న్ తైవాన్ లో పర్యటిస్తున్నారు.
Also Read
- Rohit Sharma: సచిన్, కోహ్లీ సరసన రోహిత్ శర్మ.. 14 వేల క్లబ్లోకి చేరిన ఐదో భారతీయుడు..
- Modi-Trump: మోడీ మంచి మిత్రుడు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.. ట్రంప్ ప్రశంసల వర్షం
- AP Doctors: విధులకు గైర్హాజరైన 43 మoది డాక్టర్ల డిస్మిస్.. మరో 34 మంది రాజీనామా..
- Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
Read Also: Irfan Pathan: విస్తారా ఎయిర్లైన్స్పై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం.. అసలు ఏం జరిగిందంటే..?
ఇదిలా ఉంటే ఈ పర్యటనపై చైనా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే నాన్సీ పెలోసి పర్యటన తర్వాత అమెరికా, చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. వన్ చైనా విధానంలో తైవాన్ కూడా భాగమే అని చైనా వాదిస్తోంది. అయితే నాన్సి పెలోసీ పర్యటన తర్వాత చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. చైనా తన యుద్ధవిమానాలు, క్షిపణులను, యుద్ధ నౌకలను తైవాన్ చుట్టూ మోహరించింది. అవసరమైతే తైవాన్ ను హస్తగతం చేసుకుంటామని చైనా ప్రకటించింది.
తాజావార్తలు
-
Rohit Sharma: సచిన్, కోహ్లీ సరసన రోహిత్ శర్మ.. 14 వేల క్లబ్లోకి చేరిన ఐదో భారతీయుడు..
-
Modi-Trump: మోడీ మంచి మిత్రుడు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.. ట్రంప్ ప్రశంసల వర్షం
-
AP Doctors: విధులకు గైర్హాజరైన 43 మoది డాక్టర్ల డిస్మిస్.. మరో 34 మంది రాజీనామా..
-
Ragi Pindi Upma: డయాబెటిస్, వెయిట్ లాస్ కోసం బెస్ట్ బ్రేక్ఫాస్ట్.. రాగి ఉప్మాను సింపుల్గా ఇలా చేసుకోండి!
-
Ragi Barfi : ఈ ఒక్క స్వీట్ తింటే ఎముకలకు కొండంత బలం.. నోరూరించే రాగి బర్ఫీ సీక్రెట్ రెసిపీ!
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!