Swamiji's fight: ప్రజలకు సద్భుద్ధులు చెప్పాల్సిన స్వామీజీలే కొట్టుకున్నారు. నువ్వు గొప్ప అంటే లేదు నేనే గొప్ప అంటూ ఇద్దరు కొట్టుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం తమిళనాడులో సంచలనంగా మారింది. ఇద్దరు స్వామీలు కొట్టుకున్న వీడియో తమిళనాడులో వైరల్ గా మారింది. వీరిద్దరి గొడవ సింగపూర్ లో జరిగింది. తంజావూరు జిల్లా పుదుకొట్టైకి చెందిన రుద్ర సిద్ధర్ రాజ్ కుమార్ స్వామీజీ రోగాలు నయం చేయడంలో ఫేమస్.
Anti-Hijab protests In Iran- Mahsa amini Death: మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతి హిజాబ్ ధరించలేదని ఇరాన్ లోని మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆ యువతి మరణించింది. దీంతో ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ కు వ్యతిరేకంగా నిరసనలు ఎగిసిపడుతున్నాయి. మహిళలు హిజాబ్ తీసేసి, జట్టు కత్తిరించుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలను ఇరాన్ ప్రభుత్వం క్రూరంగా అణిచివేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం చేసిన దాడుల్లో 30కి పైగా మంది మరణించారు.
India is a strong counter to Pakistan on Jammu and Kashmir: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. భారత్ తరుపున యూఏన్ లో మాట్లాడిన మొదటి కార్యదర్శి మిజితో వినిటో పాకిస్తాన్ తీరును ఎండగట్టారు. కాశ్మీర్ సమస్యపై షెహబాజ్ చేసిన వ్యాక్యలన్నీ అబద్ధాలని భారత్ తిప్పికొట్టిది. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదంలో మునిగిపోయిందని భారత్ విమర్శించింది. ఇండియాపై ఆరోపణలు చేయడానికి ఈ అత్యున్నత వేదికను పాకిస్తాన్ ఎంచుకోవడం బాధాకరమని.. పాక్…
Uttar Pradesh has passed a bill to prevent anticipatory bail in rape cases: అత్యాచార నిందితులపై ఇక మరింత కఠినంగా వ్యవహరించనుంది ఉత్తర్ ప్రదేశ్ సర్కార్. అత్యాచార నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని నిషేధించే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్( యూపీ సవరణ) బిల్లు-2022ను ఉత్తర్ ప్రదేశ్ శాసనసభ శుక్రవారం ఆమోదించింది. యూపీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ కుమార్ ఖన్నా సభలో మాట్లాడుతూ.. పోక్సో చట్టం, మహిళపై అఘాయిత్యాలకు సంబంధించిన నేరాలకు పాల్పడిన వారికి ముందస్తు బెయిల్ మంజూరు…
Uttarakhand Girl Assassination Case: ఉత్తరాఖండ్ లో అంకితా బండారీ అనే 19 ఏళ్ల యువతి హత్య ప్రకంపనలు రేపుతోంది. ఈ హత్య వెనక బీజేపీనేత కుమారుడి హస్తం ఉండటంతో రాజకీయంగా ఈ అంశం చర్చనీయాంశం అయింది. యువతి హత్యపై సీఎం పుష్కర్ సింగ్ ధామి సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో అన్ని రిసార్టులను విచారించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు అక్రమంగా నిర్వహిస్తున్న రిసార్టులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు
PM Sheikh Hasina on Rohingya issue: రోహింగ్యాలను స్వేదేశానికి వెళ్లేలా సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ దేశాలను కోరారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. రోహింగ్యాల సమస్య ఈ ప్రాంతంలో స్థిరత్వం, భద్రతపై ప్రభావం చూపిస్తోందని శనివారం ఆమె యూఎన్ లో అన్నారు. మయన్మార్ లో కొనసాగుతున్న రాజకీయ హింస, సాయుధపోరాటాలు రోహింగ్యాలను స్వదేశానికి తరలించడాన్ని క్లిష్టతరం చేసిందని ఆమె అన్నారు. ఈ విషయంలో యూఎన్ సమర్థవంతమైన పాత్ర పోషిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
Earthquake hits Indonesia: ఇండోనేషియాలో మరోసారి భూకంపం వచ్చింది. వరసగా రెండో రోజు కూడా భూకంపం సంభవించడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా శనివారం ఉత్తరాన అచే ప్రావిన్స్ లో సముద్రగర్భంలో భూకంపం సంభవించింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణా నష్టాలకు సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. సునామీ ముప్పు లేదని అధికారులు తెలిపారు. తెల్లవారుజామున ఇచ్చిన భూకంపంతో ప్రజలు ఇళ్ల నుంచి ఎత్తైన ప్రాంతాలకు పరుగులు తీశారు. సునామీ వార్తల నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Kerala Lottery winner is in Trouble: కేరళలో ప్రభుత్వం మెగా ఓనం లాటరీలో రూ. 25 కోట్లు గెలిచారు ఓ ఆటో డ్రైవర్. ఈ విషయం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఓ సాధారణ ఆటో డ్రైవర్ లాటరీలో ఇన్ని కోట్లు గెలవడం ప్రజల్ని ఆకర్షించింది. అయితే ఇప్పుడు లాటరీ విన్నర్ అనూప్ బాధపడుతున్నారు. నేను ఎందుకు లాటరీని గెలిచానని.. గెలవకుంటే బాగుండేదని భావిస్తున్నారు. నేను మనశ్శాంతిని కోల్పోయాను..ప్రస్తుతం నేను నా సొంత ఇంటిలో కూడా నివసించలేకపోతున్నానని ఆయన అంటున్నారు. నేను లాటరీ గెలిచినప్పటి…
sabka saath sabka vikas sabka vishwas book release: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగాల్లో ఎంపిక చేసిన కొన్ని ప్రసంగాలను సబ్ కా సాత్ - సబ్ కా వికాస్ - సబ్ కా విశ్వాస్ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని విడుదల చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి కేరళ గవర్నర్ ఆరీఫ్ మహమ్మద్ ఖాన్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముస్లిం…
Saudi Arabia Announces Discovery Of Huge Gold And Copper Deposits: పెట్రోలియమే కాదు.. ఇకపై బంగారంలోనూ సౌదీ అరేబియా తన మార్కును చాటుకోనుంది. పవిత్ర నగరమైన మదీనాలో బంగారం, రాగి ఖనిజాలకు సంబంధించి భారీ బంగారు నిక్షేపాలను కనుక్కున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. మదీనా ప్రాంతంలోని అబా అల్ - రహా సరిహద్దుల్లో బంగార నిక్షేపాలను కనుక్కున్నట్లు సౌదీ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మదీనాలోని వాడి అల్-ఫరా, అల్-మాదిక్ ప్రాంతంలోని నాలుగు ప్రదేశాల్లో రాగి నిక్షేపాలను కనుగొన్నట్లు అధికారులు వెల్లడించారు.