H3N2 Virus: హెచ్3ఎన్2 వైరస్తో మరొకరు మృతి.. 7కు చేరిన మరణాల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
H3N2 Virus: దేశంలో హెచ్3ఎన్2 ఇన్ఫ్లుఎంజా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఈ వైరస్ బారిన పడిన ఓ మహిళ మరణించింది. దీంతో ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 7కు చేరుకుంది. జనవరి 1 నుంచి మార్చి 5 వరకు దేశంలో 451 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదయ్యాయి. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో వడోదరలో 58 ఏళ్ల మహిళ హెచ్3ఎన్2 ఇన్ఫ్లుఎంజా వైరస్ కారణంగా మరణించింది. గత వారం కర్ణాటక, హర్యానాల్లో ఇద్ధరు మరణించారు. దేశంలోనే తొలిసారిగా కర్ణాటకలోని హసన్ లో 82 ఏళ్ల వ్యక్తి హెచ్3ఎన్2తో మరణించాడు.
Read Also: Congress: మోదీజీ.. ఆస్కార్ అవార్డుల ఘనత మీదని చెప్పుకోవద్దు..
Also Read
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
ఇదిలా ఉంటే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ హెచ్3ఎన్ 2 వైరస్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని సూచించింది. మార్చి నెల చివరి వరకు ఈ వైరస్ కేసులు తగ్గుముఖం పడగాయని తెలిపింది. కోవిడ్ లక్షణాలు ఉన్న హెచ్3ఎన్2 ఇన్ప్లూఎంజా వల్ల ప్రజలు ఆందోళన చెందున్నారు. శ్వాస సమస్యలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. పరిస్థితిని గమనిస్తున్నట్లు కేంద్ర వైద్యరోగ్య శాఖ తెలిపింది. వ్యాధి బారిన పడినవారు 3 నుండి 5 రోజుల వరకు జ్వరం, నిరంతర దగ్గు, చలి, శ్వాస ఆడకపోవడం, గురక, ముక్కు కారటం, వికారం, గొంతు నొప్పి, శరీర నొప్పి కొన్ని సందర్భాల్లో అతిసార లక్షణాలు కలిగి ఉంటున్నారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) వైరస్ సోకిన వ్యక్తులు డాక్టర్లను సంప్రదించకుండా మందులు వాడొద్దని, యాంటీ బయాటిక్స్ వాడకూడదని సలహా ఇచ్చింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో తప్పకుండా మాస్కులు ధరించాలని, దగ్గు, తుమ్ముల ద్వారా ఈ వైరస్ ఇతర వ్యక్తులకు వ్యాపిస్తుందని తెలిపింది. పిల్లలు, వృద్ధుల్లో, దీర్ఘాకాలిక వ్యాధులు ఉన్న రోగుల్లో ఈ వైరస్ మరింత ప్రమాదకారిగా మారుతోంది.
తాజావార్తలు
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
-
WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
-
Manchu Manoj : మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!