Boy Fell In Borewell: రెస్క్యూ ప్రయత్నాలు విఫలం.. బోరుబావిలో పడిన పిల్లాడి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boy Fell In Borewell: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బోరు బావిలో పడిన పిల్లాడి ఘటనలో విషాదం చోటు చేసుకుంది. ఏడేళ్ల పిల్లాడిని రక్షించేందుకు అధికారులు శతవిధాల ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదు. 24 గంటల తర్వాత పిల్లాడిని బయటకు తీసినా అప్పటికే చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివారాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ విదిషా జిల్లాలో ఏడేళ్ల బాలుడు బోరు బావిలో పడిపోయాడు. అతడిని బయటకు తీసేందుకు జిల్లా కలెక్టర్ శంకర్ భార్గవ తో పాటు పోలీస్, ఇతర అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.
Read Also: Viral : ఫాలోవర్స్ కోసం డబ్బుల వర్షం.. అంతా ఆ వెబ్ సిరీస్ వల్లే..!
Also Read
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
జిల్లాలోని లాటరి తహసీల్ పరిధిలోని ఖేర్ఖేడి పత్తర్ గ్రామంలో లోకేష్ అహిర్వార్ అనే బాలుడు ఆడుకుంటూ మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో 60 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో పడిపోయాడు. 43 అడుగుల లోతులో బాలుడు కూరుకుపోయాడు. గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించడంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. పిల్లాడిని బయటకు తీసేందుకు జేసీబీల సాయంతో బోరుబావికి సమాంతరంగా గుంతను తీశారు. బాలుడిని రక్షించేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) సిబ్బందిని రంగంలోకి దింపినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు.
పిల్లాడు శ్వాస తీసుకునేందుకు ఆక్సిజన్ ను పైపుల ద్వారా బోరు బావిలోకి పంపించారు. అయితే దాదాపుగా 24 గంటల ఆపరేషన్ సఫలం కాలేదు. బాలుడిని బయటకు తీసే సమయానికి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రూ. 4 లక్షల సాయాన్ని ప్రకటించారు. మంగళవారం ఇదే విధంగా మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో కూడా 5 ఏళ్ల బాలుడు బోర్ వెల్ లో పడిపోయాడు. అతడిని బయటకు తీసే సయమంలో చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు.
తాజావార్తలు
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
-
School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
-
AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!