Venu Goapl Reddy
Author- NTV Telugu-
Pak Embassy: మహిళా ప్రొఫెసర్తో పాక్ ఎంబసీ అసభ్య ప్రవర్తన.. భారత్కు వ్యతిరేకంగా రాయాలని డిమాండ్
Punjab woman accuses Pak embassy staff: పాకిస్తాన్ ఎంబసీ సిబ్బంది ఓ మహిళ ప్రొఫెసర్ తో అసభ్యంగా ప్రవర్తించారు. లైంగిక కోరికల గురించి అడుగుతూ తిక్క ప్రశ్నలు వేశారు. తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని సదరు మహిళ ఆరోపించింది. తన వీసా అపాయింట్మెంట్ కోసం పాక్ ఎంబీసీ వెళ్లినప్పడు సీనియర్ సిబ్బంది తప్పుగా వ్యవహరించినట్లు తెలిపింది. ఈ వ్యవహారంపై భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ కు లేఖ కూడా రాశారు ఆమె. చర్యలు తీసుకోవాలని కోరారు. -
PM Security Breach: భద్రతా ఉల్లంఘన.. ప్రధాని మోదీ దగ్గరగా వెళ్లిన వ్యక్తి..
PM Security Breach: ప్రధాని నరేంద్రమోదీ భద్రతలో మరోసారి వైఫల్యం ఎదురైంది. భద్రతా వలయాన్ని ఉల్లంఘించి ఓ వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరదాకా వెళ్లాడు. కర్నాటకలో హుబ్బలిలో మోదీ రోడ్ షో చేస్తున్న సమయంలో ఈ ఘటన గురువారం ఎదురైంది. వెంటనే భద్రతా సిబ్బంది అతడిని అడ్డగించి లాగిపడేశారు. -
Sethusamudram Project: సేతుసముద్రం ప్రాజెక్ట్ పై తమిళనాడు అసెంబ్లీ తీర్మానం.. బీజేపీ మద్దతు..
Sethusamudram Project: సేతుసముద్రం ప్రాజెక్టుపై గురువారం తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేశారు. బీజేపీతో పాటు అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతుగా నిలిచాయి. భారతదేశంలోని తూర్పు, పశ్చిమ తీరాలను కలిపేందుకు ఈ సేతు సముద్రం ప్రాజెక్టు కీలకంగా మారుతుంది. ఈ ప్రాజెక్టును కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. గతంలో సేతు సముద్రం ప్రాజెక్టును వ్యతిరేకించిన బీజేపీ కూడా దీనికి సపోర్టు చేసింది. అయితే రామసేతు నిర్మాణానికి ఎలాంటి హాని కలుగకుండా ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదని బీజేపీ… -
YouTube channels Ban: భారత్కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు..యూట్యూబ్ ఛానెళ్లు బ్యాన్.
YouTube channels Ban: భారత్ కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్ర ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే వంకు పైగా యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించింది. తాజాగా మరో 6 ఛానెళ్లపై సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ బ్యాన్ విధించింది. ఈ ఆరు ఛానెళ్లు సమన్వయంతో తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నట్లు కేంద్ర గుర్తించింది. వీరటికి దాదాపుగా 20 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ ఛానెళ్ల పోస్ట్ చేసిన వీడియోలను 51 కోట్ల సార్లు చూశారు. -
Army Chief: సరిహద్దులో చైనా బలగాలు పెరిగాయి.. అన్నింటికి సిద్ధంగా ఉన్నామని ఆర్మీ చీఫ్
Army Chief General Manoj Pande: లైన్ ఆఫ్ ఆక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ) వెంబడి చైనా బలగాల్లో స్వల్ప పెరుగుదల ఉన్నట్లు భారీ ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే అన్నారు. వాస్తవ నియంత్రణ రేఖ వద్ద చైనా దళాల సంఖ్య స్వల్పంగా పెరిగిందని.. వారి కదలికను నిశితంగా గమనిస్తున్నట్లు వెల్లడించారు. చైనా బలగాల కదలికలను నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. చైనాతో ఉత్తర సరిహద్దుల్లో పరిస్థితి అదుపులోనే ఉందని.. ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. చైనాను ఉద్దేశిస్తూ.. ఉత్తర సరిహద్దు వద్ద ఎల్ఏసీని… -
Hindu Temple Attacked: హిందూ దేవాలయంపై దాడి.. ఖలిస్తాన్ మద్దతుదారుల దుశ్చర్య
Melbourne Hindu Temple Attacked By Khalistan Supporters: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఖలిస్తాన్ మద్దతుదారులు హిందూ ఆలయంపై దాడి చేశారు. భారత వ్యతిరేక నినాదాలను గోడలపై రాశారు. ఈ ఘటన స్థానికంగా ఉన్న హిందూ సమాాజంలో ఆందోళన కలిగిస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఈ ఘటన జరిగింది. మిల్ పార్క్ శివారులోని ఉన్న బీఏపీఎస్ స్వామినారాయణ్ మందిర్ గోడలపై గుర్తు తెలియన వ్యక్తులు ‘‘హిందూస్థాన్ ముర్దాబాద్’’ అంటూ గ్రాఫిటీతో భారత వ్యతిరేక నినాదాలు రాశారు. -
Rainbow Children’s Hospital: పిల్లలు పక్కతడుపుతున్నారా..? అయితే ఈ చికిత్స అవసరం
Rainbow Children’s Hospital doctor advise on how to control Bedwetting in Kids: బెడ్ వెట్టింగ్ (పక్క తడుపుట) అనేది పిల్లల బాల్యంలో సాధారణంగా జరుగుతుంది. అయితే కొన్నిసార్లు పిల్లలు ప్రతీరోజు పక్కతుడుపుతుండటం తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా మారుతుంది. పిల్లలు నిద్రపోయినప్పుడు వారికి తెలియకుండానే పక్కతడుపుతుంటారు. ఇది పిల్లల తప్పు కాదు. ఇలా పక్కతడపడాన్ని ‘‘నోర్టూర్నరల్ ఎనురెసిస్’’ అని పిలుస్తారు. బిడ్డ ఎప్పడూ పక్కతడుపుతుంటే దీన్ని ‘ఫ్రైమరీ నోక్టూర్నల్ ఎనురెసిస్’’ అంటారు. 6 నెలల తర్వాత అంతకంటే ఎక్కువ కాలం ఈ సమస్య… -
Asaduddin Owaisi: ముస్లింలకు అనుమతి ఇవ్వడానికి ఆయన ఎవరు..? మోహన్ భగవత్ వ్యాఖ్యలపై అసద్
Asaduddin Owaisi angry over Mohan Bhagwat's comments: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రికలు ఆర్గనైజర్, పాంచజన్యకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ముస్లింలకు ఎలాంటి ముప్పు లేదని.. ముస్లింలు తమ ఆధిపత్య ధోరణిని విడనాడాలని అన్నారు. హిందువులు గత 1000 ఏళ్లుగా విదేశీ దురాక్రమణదారుల నుంచి యుద్ధం చేస్తూనే ఉన్నారని.. వీటన్నింటితో హిందూ సమాజం మేల్కొందని.. యుద్ధం చేసేవారు దూకుడు చూపడం సహజం… -
RRR: భారతీయులు గర్వించేలా చేశారు.. ట్రిపుల్ ఆర్కి ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు
PM Narendra Modi congratulated RRR film team: గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో రికార్డు సృష్టించింది ట్రిపుల్ ఆర్. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తాజాగా బుధవారం ప్రకటించిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ‘‘నాటు నాటు’’ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ గెలుచుకుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న తొలి ఇండియన్ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ట్రిపుల్ ఆర్ పై ప్రశంసలు… -
MG Motor: ఎంజీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు.. త్వరలోనే భారత్లో విడుదల.. ప్రత్యేకతలు ఇవే..
MG showcases new electric and hybrid models at Auto Expo 2023: ప్రముఖ కార్ మేకర్ మోరిస్ గారేజ్(ఎంజీ) మోటార్స్ త్వరలో ఇండియాలో మూడు ఎలక్ట్రిక్ కార్ మోడళ్లను తీసుకురాబోతోంది. ఇప్పటికే ఎంజీ జెడ్ ఎస్ ఈవీ ఎలక్ట్రిక్ కారు ఇండియా వ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది. రాబోయే ఐదేళ్లలో ప్రతీ ఏడాది కొత్త ఎలక్ట్రిక్ కార్ ను భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఎంజీ మోటార్ ఆటో ఎక్స్ పో 2023లో కొత్తగా మూడు ఎలక్ట్రిక్ కార్లను ప్రదర్శించింది. ఎంజీ4 ఎలక్ట్రిక్…
తాజావార్తలు
-
Scientists disappear: సైంటిస్టులు మాయం.. అమెరికా, చైనాలో టెన్షన్..
-
SSC Stenographer: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 731 స్టెనోగ్రాఫర్ పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
-
PM Modi : మే 9న తెలంగాణకు ప్రధాని మోడీ.. పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ.!
-
Hyderabad Metro : మెట్రోపై ప్రభుత్వ హక్కు.. L&Tకి గుడ్బై!
-
Diamond Chips Recipe: టీ టైమ్ స్నాక్ అంటే ఇదే.. పర్ఫెక్ట్ ‘డైమండ్ చిప్స్’ ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!