Kiren Rijiju: కొందరు రిటైర్డ్ జడ్జిలు భారత్ కు వ్యతిరేకంగా వ్యవహిస్తున్నారు.. మూల్యం చెల్లించుకోక తప్పదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiren Rijiju: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది రిటైర్డ్ జడ్జిలు భారతదేశ వ్యతిరేక ముఠాలో చేరారని అన్నారు. వారు న్యాయవ్యవస్థను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని, దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారు మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఇండియా టుడే కాంక్లేవ్ 2023లో మాట్లాడుతూ కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ మధ్య క్లియర్ గా రాజ్యాంగంలో విభజన ఉందని గుర్తు చేశారు. ఇటీవల న్యాయమూర్తుల జవాబుదారీతనంపై ఒక సెమినార్ జరిగింది. దీని గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Congress : నిరుద్యోగులు ధైర్యంగా ఉండాలి.. టీఎస్పీఎస్సీలో అసలు దొంగలెక్కడ?: పొన్నం
Also Read
- Age Limit Increased: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
- KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
న్యాయవ్యవస్థను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలాగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. న్యాయమూర్తులకు ఏ రాజకీయాల్లో భాగం కాదని తెలిపారు. కాంగ్రెస్ వల్ల కొలీజియం వ్యవస్థ వచ్చిందని, రాజ్యాంగం ప్రకారం న్యాయమూర్తుల నియామకం ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుందని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి సుప్రీంకోర్టు, హైకోర్టుకు న్యాయమూర్తులను నియమిస్తారని గుర్తు చేశారు. అయితే కొత్త వ్యవస్థను తీసుకువచ్చే వరకు కొలీజియం వ్యవస్థను కొనసాగిస్తామని అన్నారు.
ఇటీవల ఎన్నికల కమిషనర్లను నియామకంలో ప్రధాని, ప్రతిపక్షనేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ నిర్ణయం తీసుకోవాలని తీర్పు ఇచ్చింది. అయితే దీనిపై కిరణ్ రిజిజు స్పందించారు. రాజ్యాంగంలో కార్యనిర్వహణ వ్యవస్థ, న్యాయవ్యవస్థకు మధ్య లక్షణ రేఖ ఉందని వ్యాఖ్యానించారు. కార్యనిర్వహణ వ్యవస్థలోకి న్యాయవ్యవస్థ వస్తే న్యాయపరమైన పనిని ఎవరు చేస్తారంటూ ప్రశ్నించారు. ఇది అమలులోకి వస్తే అనేక విమర్శలు వస్తాయని అన్నారు. ఒక నియామకంలో న్యాయవ్యవస్థ పాలుపంచుకుంటే, ఏదైనా సమస్య వస్తే కోర్టులు ఆశ్రయిస్తే ఆ నియామకంపై తీర్పు ఎలా ఇవ్వగలరని అన్నారు.
తాజావార్తలు
-
Sattu Chaas Recipe: మండుటెండలో కూల్గా ఉండాలా..? ప్రోటీన్ పవర్తో ‘సత్తు ఛాస్’ తాగండి!.. సింపుల్గా తయారు చేయండి..
-
Raghava Lawrence: రాజ్ మోహన్పై ట్రోల్స్.. విజయ్కు అండగా లారెన్స్
-
Ragi Side Effects: రాగులు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఎక్కువగా తింటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు..!
-
Age Limit Increased: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
-
Jasprit Bumrah-BCCI: ఆఫ్ఘనిస్థాన్తో టెస్టు.. జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ కండిషన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..