Jharkhand: శ్రీ రామనవమి వేడుకలపై జార్ఖండ్ ప్రభుత్వం ఆంక్షలు.. హజారీబాగ్లో ఉద్రిక్తత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Restrictions on Ram Navami celerations: రామనవమి ఉత్సవాలపై జార్ఖండ్ లోని జెఎంఎం ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ముఖ్యంగా హజారీబాగ్ లో దీనిపై ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జార్ఖండ్ లోని పాలము జిల్లాలో మసీదు ముందు ప్రవేశద్వారం ఏర్పాటు చేయడం హింసకు దారి తీసింది. ఇది జరిగిన కొన్ని రోజులకే ప్రభుత్వం రామనవమిపై ఆంక్షలు విధించింది. హజారీబాగ్ లో ప్రతీ ఏటా రామనవమి వేడులకు అట్టహాసంగా జరుగుతాయి. అయితే రామ నవమి ఊరేగింపు సందర్భంగా ఎలాంటి సంగీతాన్ని పెట్టకూడదని, కర్రలు, వెదురులతో సంప్రదాయ నృత్యాలు నిర్వహించకూడదని, ఆయుధాల విన్యాసాలు చేయకూడదని నగరంలో ఆంక్షలు విధించింది.
Read Also: Bharat Gaurav Train : తొలి భారత్ గౌరవ్ రైలు సికింద్రాబాద్ నుంచి
Also Read
- Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
- LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్కే ఎసరు..?
- UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
- Nepal Floods: నేపాల్ ప్రధానికి నరేంద్రమోడీ ఫోన్.. సాయం అందిస్తామని హామీ..
ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని హజారీబాగ్ లోని బాద్కాగావ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబా ప్రసాద్ అన్నారు. హిందూ పండగల పట్ల వ్యవస్థ సున్నితంగా ఉండాలని ఆమె అన్నారు. వారు వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రంలోని సామాజిక వ్యవస్థను చెడగొడుతోందని అన్నారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే మనీష్ జైస్వాల్ మాట్లాడుతూ..హిందూ మతం, సంప్రదాయాలకు ముప్పుపొంచి ఉందని, ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి వైఖరి హిందూ సంప్రదాయాలను చంపేస్తున్నాయని, దీనికి వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు.
సుప్రీంకోర్టు, హైకోర్టు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లకు కట్టుబడి ఉండాలని ప్రజలను జిల్లా ఎస్సీ కోరారు. రాత్రి 10 గంటల తర్వాత డీజేను అనుమతించబోమని, ఉరేగింపుల్లో ఆయుధాలను అనుమతించేది లేదని, నగరంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పాటలను నిషేధిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని అన్నారు. శ్రీరామ నవమిలో భాగంగా మంగళవారం ‘మంగళ జులు’ ఉరేగింపు ప్రారంభం అయింది. దీంతో హజారీబాగ్ లో 3,000 మంది పోలీసులు మోహరించారు. పట్టణంలోని సున్నిత ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
New Cyber Fraud : ఫోన్ పోయిందా.? ఖాతా ఖాళీ చేసే కొత్త మోసం.!
-
Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
-
LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్కే ఎసరు..?
-
King 100: బాక్సాఫీస్ షేక్ అయ్యేలా నాగ్ 100వ సినిమా.. మళ్లీ టబుతో రొమాన్స్!
-
Trump: ఇరాన్పై దాడికి తులసీ గబ్బార్డ్ చెప్పింది ఇదేనా! అయినా ట్రంప్ ఎందుకు ముందుకెళ్లారు?
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..