Russia-Ukraine War: జపొరిజ్జాయాపై రష్యా మిస్సైల్ దాడి.. 17 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia-Ukraine War: ఏడు నెలలు గుడుస్తున్నా.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో ఏ మార్పు రావడం లేదు. ఇరు దేశాలు కూడా తమ ప్రయోజనాల కోసం పోరాడుతూనే ఉన్నాయి. రష్యా మిస్సైళ్లతో ఉక్రెయిన్ భూభాగాలపై విరుచుకుపడుతూనే ఉంది. దక్షిణ ఉక్రెయిన్ పారిశ్రామిక నగరం జపొరిజ్జియా ప్రాంతంపై రష్యా మరోసారి దాడి చేసింది. ఏడు మిస్సైళ్లను ప్రయోగించింది. ఈ ఘటనలో ఒక చిన్నారితో పాటు 17 మంది మరణించారని ఉక్రెయిన్ అధికారులు శనివారం తెలిపారు. గురువారం తెల్లవారుజామున ఈ మిస్సైల్స్ ఎటాక్ జరిగింది.
మిస్సైల్ దాడి వల్ల నగరంలోని 5 అంతస్తుల భవనం నేలమట్టం అయింది. జపొరిజ్జియా ప్రతీ రోజూ రాకెట్ దాడికి గురవుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం కోసం రష్యా- ఉక్రెయిన్ సేనల మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతోంది. ఈ ప్రాంతంలోనే యూరప్ లో పెద్దదైన జపొరోజ్జియా అణువిద్యుత్ కర్మాగారం ఉంది. ఈ ప్రాంతంపై రష్యా పదేపదే క్షిపణి దాడులు చేస్తోంది. గత వారం జొపొరిజ్జియాలో పౌరుల వాహనాలపై రష్యా దాడి చేసింది. ఈ ఘటనలో మొత్తం 30 మంది మరణించారు.
Also Read
- IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
- Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
- US Strikes on Iran: ఇరాన్పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
- SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
READ ALSO: Jammu Kashmir Issue: జర్మనీ ప్రకటనపై భారత్ ఆగ్రహం.. మీ జోక్యం అవసరం లేదని స్ట్రాంగ్ కౌంటర్
ఇదిలా ఉంటే శనివారం రష్యా ఆక్రమిత క్రిమియా ప్రాంతంలో రష్యాకు ఎదురుదెబ్బ తాకింది. క్రిమియాలో కీలకంగా ఉన్న వంతెనను ఉక్రెయిన్ బలగాలు పేల్చేశాయి. రష్యాను, క్రిమియాను కలపడంలో ఈ వంతెనే కీలకం. ఇదిలా ఉంటే రష్యా ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న ఖేర్సన్, జపొరిజ్జియా, డోనెట్స్క్, లూహాన్స్క్ ప్రాంతాలపై రష్యా పూర్తిస్థాయిలో నియంత్రణలోకి తీసుకోలేకపోతోంది. ఉక్రెయిన్, రష్యా బలగాలకు ఎదురొడ్డి పోరాడుతున్నాయి. అమెరికా, వెస్ట్రన్ దేశాలు ఇచ్చే ఆయుధాలతో రష్యన్ సైనికులపై విరుచుకుపడుతున్నాయి. దీంతో రష్యా మరింత ఆగ్రహానికి లోనై క్షిపణులతో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది.
తాజావార్తలు
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి