Asaduddin Owaisi: టిప్పు సుల్తాన్ చరిత్రను తుడిచేయలేరు.. కండోమ్లు ఎక్కువగా ఎవరు వాడుతున్నారు..?
Asaduddin Owaisi comments on Tippu Express name change: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి బీజేపీపై ఫైర్ అయ్యారు. ‘టిప్పు ఎక్స్ప్రెస్’ పేరును ‘వడయార్ ఎక్స్ప్రెస్’గా మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రైల్వే మంత్రిత్వ శాఖ బెంగళూర్ నుంచి మైసూర్ వెళ్లే ట్రైన్ టిప్పు ఎక్స్ప్రెస్ పేరును వడయార్ ఎక్స్ప్రెస్ గా మార్చింది. బీజేపీ యజమానులు అయిన బ్రిటీష్ వారికి ఎదురొడ్డి పోరాడినందుకు వారికి కోపం తెప్పించిందని అందుకు రైలు పేరు మార్చారని దుయ్యబట్టారు. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా టిప్పు సుల్తాన్ మూడు యుద్ధాలు చేశాడనే కోపం కాషాయ పార్టీలో ఉందని ఎద్దేవా చేశారు. టిప్పు సుల్తాన్ వారసత్వాన్ని బీజేపీ ఎప్పటికీ తుడిచివేయలేదని అన్నారు. టిప్పు బతికుండగా బ్రిటీష్ వారిని భయపెట్టారు. ఇప్పుడు బ్రిటిష్ బానిసలను భయపెట్టారని బీజేపీపై విమర్శలు గుప్పించారు.
Also Read
మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా ఈ ఏడాది జూలైలో టిప్పు ఎక్స్ప్రెస్ పేరును మార్చాలని రైల్వే శాఖమంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరారు. దీనికి స్పందించిన రైల్వే శాఖ రైలు పేరు మార్చింది. బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ ట్విట్ చేస్తూ.. శుక్రవారానికి శుభవార్త.. ఇప్పుడు టిప్పు ఎక్స్ప్రెస్ బదులుగా వడయార్ ఎక్స్ప్రెస్ మీకు సేవలు అందిస్తుందని.. అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి ప్రయత్నాలకు ధన్యవాదాలు తెలియజేశారు. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై కూడా స్పందించారు. కేంద్ర రైల్వే శాఖ చర్యలను ప్రశంసించారు. ఇది కర్ణాటక రాష్ట్ర సంపన్నమైన వారసత్వం, అద్భుతమైన చరిత్రకు గుర్తింపు అని అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో వడయార్ రాజవంశ చేసిన కృషిని గుర్తిస్తూ రైలు పేరును మార్చారు.
BJP govt renamed Tippu Express to Wodeyar Express. Tipu irks BJP because he waged 3 wars against its British masters. Another train could have been named after Wodeyars. BJP will never be able to erase Tipu’s legacy. He scared British while alive & scares British slaves even now pic.twitter.com/vsFJi5fR1D
— Asaduddin Owaisi (@asadowaisi) October 9, 2022
ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై కూడా అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ముస్లిం జనాభా పెరగడం లేదని.. పడిపోతుందని.. కండోమ్ ఎక్కువగా వాడుతున్నది ఎవరు..? మనమే అని వ్యాఖ్యానించారు. మోహన్ భగవత్ దీనిపై మాట్లాడరని అన్నారు. దేశంలో ఎక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నా.. ముస్లింలు బహిరంగ జైలులో బతుకుతున్నట్లు అనిపిస్తోందని.. ముస్లిం కన్నా రోడ్డు పక్కన కుక్కకే ఎక్కవ గౌరవం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Record: మెగా మైలురాయి.. తొలి ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు!
-
Malkajgiri: డేటింగ్ యాప్లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్తో సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ముంచిన యువతి
-
Nagarjuna-Lenin : ‘లెనిన్’ పై నాగార్జున సాలిడ్ రివ్యూ.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసిన కింగ్
-
Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజలను పారేస్తున్నారా?.. ఈ విషయం తెలిస్తే అస్సలు వదలరు.. ఇంట్లోనే ఖరీదైన మగజ్ సింపుల్గా..
-
Today Gold and Silver Prices: బంగారం ధరల మంటలు.. నేడు మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో