Maharastra Politics: ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి “కాగడా” గుర్తు.. షిండే వర్గం కోరిన గుర్తులు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharastra Politics: శివసేనలో తగదాలతో ఆ పార్టీ గుర్తు అయిన ‘ధనస్సు-బాణం’ కేంద్ర ఎన్నికల సంఘం స్తంభింపచేసింది. మహారాష్ట్రలో శివసేన చీలిక వర్గాలు శివసేన ధనస్సు-బాణం గుర్తు కోసం న్యాయపరమైన పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే అసలైన శివసేన ఎవరికి చెందుతుందో అనే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘమే తేలుస్తుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇదిలా ఉంటే నవంబర్ లో అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికల వస్తుండటంతో ఈ రెండు గ్రూపుల మధ్య గుర్తుల కోసం పంచాయతీ మొదలైంది.
శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి ‘కాగడా’గుర్తును కేటాయించింది ఈసీ. ‘శివసేన- ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే’ పేరును కేటాయించింది. ఇదిలా ఉంటే ‘ బాలాసాహెబంచి శివసేన’పేరును షిండే వర్గానికి కేటాయించింది ఈసీ. ఏక్ నాథ్ షిండే వర్గానికి గుర్తును కేటాయించాల్సి ఉంది. కొత్త ఎన్నికల గుర్తును ఎంచుకోవాలని ఇరువర్గాలకు సూచించింది ఈసీ. ముందుగా ఇరు వర్గాలు కూడా ‘త్రిశూలం’, ‘గద’ గుర్తులను కేటాయించాలని ఈసీని కోరాయి. అయితే ఈ రెండు కూడా ఓ మతాన్ని సూచించే విధంగా ఉండటంతో ఈ గుర్తులను ఇవ్వడానికి ఈసీ నిరాకరించింది. చివరగా శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ‘ కాగడా’ గుర్తును కేటాయిస్తూ ప్రకటన విడుదల చేసింది.
Also Read
Read Also: IND Vs SA: నిర్ణయాత్మక వన్డే.. ప్రారంభంలోనే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా
ఇదిలా ఉంటే సీఎం ఏక్ నాథ్ షిండే వర్గం మంగళవారం మూడు గుర్తులను ఎన్నికల సంఘానికి సమర్పించింది. రావిచెట్టు, కత్తి, సూర్యుడు గుర్తులను సూచించింది. ఈ మూడింటిలో ఏదో గుర్తును ఈసీ కేటాయించనుంది. ఇదిలా ఉంటే నవంబర్ 3 అంధేరి ఈస్ట్ అసెంబ్లీ ఉపఎన్నికల కోసం శివసేన పార్టీకి చెందిన విల్లు-బాణం గుర్తులను కేటాయించాలని ఇటు సీఎం ఏక్ నాథ్ షిండే, అటు ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు కోరాయి. దీంతో ఈసీ ఈ గుర్తును స్తంభింపచేసింది.
తాజావార్తలు
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
-
Gurudwara Demolished: పాకిస్థాన్కి ఎంత బలుపు.. 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా కూల్చివేత! భారత్ రియాక్షన్ ఇదే..
-
Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!