Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Seven People Died Due To Electric Shock In Uttar Pradesh

Uttar Pradesh: ఊరేగింపులో విషాదం.. కరెంట్ షాక్‌తో ఏడుగురు మృతి

Published Date :October 9, 2022 , 1:05 pm
By Venu Goapl Reddy
Uttar Pradesh: ఊరేగింపులో విషాదం.. కరెంట్ షాక్‌తో ఏడుగురు మృతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Seven people died due to electric shock in Uttar Pradesh: అంతవరకు ఉత్సాహంగా జరిగిన ఊరేగింపు ఒక్కసారిగా విషాదంగా మారింది. కరెంట్ షాక్ తో ఏడుగురు మరణించారు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్ బహ్రైచ్ లో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 4 గంటలకు నాన్ పరా స్థలంలో మసూపూర్ గ్రామంలో గ్రామస్తులు బరాఫవత్​ ఊరేగింపు వేడుకకు ఓ వాహనంలో బయలుదేరారు. ఇలా ఉరేగింపుగా వెళ్తుండగా ప్రమాదవశాత్తు వాహనం కరెంట్ షాక్ కు గురైంది.

Read Also: Asaduddin Owaisi: సీవీ, సీపీ ఆనంద్ పై అసదుద్దీన్‌ ఒవైసీ ఫైర్‌

అయితే వాహనంలో ఓ ఇనుపరాడ్ ఉంది. వాహనం వెళ్లే సమయంలో హైటెన్షన్ కరెంట్ వైర్లు వాహనంలో ఉన్న ఇనుపరాడ్ కు తగిలాయి. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారు కరెంట్ షాక్ కు గురయ్యారు. నలుగురు అక్కడికక్కడే మరణించగా.. ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చనిపోయిన వారిలో ముగ్గురు పిల్లలు ఉన్నారు. కరెంట్ షాక్ వల్ల పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే పోలసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. జిల్లా రూరల్ ఎస్పీ అశోక్ కుమార్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ స్పందించారు. గాయపడిన వారికి మెరగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bahraich
  • cm yogi aditya nath
  • electric shock incident
  • Uttar Pradesh
  • uttar pradesh incident

తాజావార్తలు

  • EV Scooters: టీవీఎస్ iQube, ఏథర్, బజాజ్ చేతక్.. ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్? ధర, రేంజ్ పూర్తి వివరాలు

  • Ambati Rambabu: అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు.. 2029కి ఏడు బిల్డింగ్‌లైనా పూర్తి చేస్తారా..?

  • Lockdown: లాక్ డౌన్ వచ్చేసింది.. ఉదయం 9 నుంచి 4 గంటల వరకే ఆఫీస్‌లు..

  • Ragi Milk Recipe: వేసవి దాహాన్ని తీర్చే నేచురల్ ఎనర్జీ డ్రింక్.. ఇంట్లోనే టేస్టీ ‘రాగి పాలు’ చేసుకోండిలా!

  • War Effect: యుద్ధం ఎఫెక్ట్.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్..

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions