Uttar Pradesh: ఊరేగింపులో విషాదం.. కరెంట్ షాక్తో ఏడుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seven people died due to electric shock in Uttar Pradesh: అంతవరకు ఉత్సాహంగా జరిగిన ఊరేగింపు ఒక్కసారిగా విషాదంగా మారింది. కరెంట్ షాక్ తో ఏడుగురు మరణించారు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్ బహ్రైచ్ లో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 4 గంటలకు నాన్ పరా స్థలంలో మసూపూర్ గ్రామంలో గ్రామస్తులు బరాఫవత్ ఊరేగింపు వేడుకకు ఓ వాహనంలో బయలుదేరారు. ఇలా ఉరేగింపుగా వెళ్తుండగా ప్రమాదవశాత్తు వాహనం కరెంట్ షాక్ కు గురైంది.
Read Also: Asaduddin Owaisi: సీవీ, సీపీ ఆనంద్ పై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్
Also Read
- LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
- Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
అయితే వాహనంలో ఓ ఇనుపరాడ్ ఉంది. వాహనం వెళ్లే సమయంలో హైటెన్షన్ కరెంట్ వైర్లు వాహనంలో ఉన్న ఇనుపరాడ్ కు తగిలాయి. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారు కరెంట్ షాక్ కు గురయ్యారు. నలుగురు అక్కడికక్కడే మరణించగా.. ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చనిపోయిన వారిలో ముగ్గురు పిల్లలు ఉన్నారు. కరెంట్ షాక్ వల్ల పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే పోలసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. జిల్లా రూరల్ ఎస్పీ అశోక్ కుమార్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ స్పందించారు. గాయపడిన వారికి మెరగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
తాజావార్తలు
-
Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
-
LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
-
Pakistan: పాకిస్తాన్ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!