Bangladesh crisis: 1971 తర్వాత భారత్కు అతిపెద్ద సవాల్.. “బంగ్లాదేశ్”పై పార్లమెంటరీ ప్యానెల్ రిపోర్ట్..
- 1971 తర్వాత భారత్కు అతిపెద్ద సవాల్గా బంగ్లాదేశ్..
- శశిథరూర్ నేతృత్వంలోని హౌజ్ ప్యానెల్ సంచలన రిపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh crisis: 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం తర్వాత, ఇప్పుడు భారతదేశానికి వ్యూహాత్మక సవాల్గా మారుతోందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ హెచ్చరించింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని ప్యానెల్ బంగ్లాదేశ్లో రాజకీయ మార్పులు, చైనా, పాకిస్తాన్ నుంచి పెరుగుతున్న ప్రభావం, షేక్ హసీనా పదవిని కోల్పోవడం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఈ సమయంలో భారత్ తన వ్యూహాన్ని పున: సమీక్షించుకోకపోతే, యుద్ధం వల్ల కాదు కానీ , ప్రాధాన్యత కోల్పోవడం వల్లే, ఢాకాలో భారత్ వ్యూహాత్మక ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పార్లమెంటరీ ప్యానెల్ హెచ్చరించింది.
Read Also: Omar Abdullah: ఒక ముస్లిం హిందూ మహిళ ముసుగు తీస్తే పరిస్థితి ఏంటి.?
Also Read
- Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
- Congress: సంచలన నిర్ణయాలు దిశగా కాంగ్రెస్.. భారీ నాయకత్వ మార్పుల వైపు అడుగులు?
- Lalit Modi: 'ఆమె డబ్బు కోసం ఆశపడేది కాదు', సుష్మితా సేన్తో తన బ్రేకప్పై మౌనం వీడిన లలిత్ మోడీ..
- Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
‘‘1971లో సవాలు మనుగడకు సంబంధించింది, మానవతావాదానికి సంబంధించింది, ఒక కొత్త దేశం ఆవిర్భావానికి సంబంధించింది కాగా, ఇప్పుడు సవాల్ మరింత తీవ్రమైంది. ఇది తరాల మధ్య అంతరాయం, రాజకీయ వ్యవస్థలో మార్పు, భారతదేశం నుంచి దూరంగా ఒక సంభావ్య వ్యూహాత్మక పున:సమీకరణకు సంబంధించింది’’ అని కమిటీ పేర్కొంది. పాకిస్తాన్తో బంగ్లాదేశ్ సంబంధాలు, బంగ్లాలో చైనా పెట్టుబడుల విషయంలో కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మోంగ్లా పోర్ట్, లాల్మోనిర్హాట్ ఎయిర్ బేస్, పెకువాలో జలాంతర్గామి స్థావరం వంటి ప్రాజెక్టులను ఉదహరించింది.
ఇదే కాకుండా, బంగ్లాలోని జమాతే ఇస్లామితో సహా అన్ని వర్గాలను చైనా కలుపుకుపోతోందని చెప్పింది. బంగ్లాలో విదేశీ శక్తులు సైనిక స్థావరాలు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం కఠినంగా పర్యవేక్షించాలని, అభివృద్ధి, కనెక్టివిటీ, ఓడరేవుల యాక్సెస్లో బంగ్లాదేశ్కు ప్రయోజనాలను అందించాలని ప్యానెల్ సిఫారసు చేసింది. బంగ్లాలో పెరుగుతున్న రాడికల్ ఇస్లామిక్ శక్తులు బలపడటాన్ని ప్యానెల్ ఎత్తిచూపింది. షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీపై నిషేధం బంగ్లాదేశ్ భవిష్యత్తులో జరిగే ఏవైనా ఎన్నికలలో అందరినీ కలుపుకునే సామర్థ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తుందని చెప్పింది.
తాజావార్తలు
-
Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
Psychology Facts: ప్రతి పనికీ 10నిమిషాలు ముందుగా వచ్చే వ్యక్తులు గురించి షాకింగ్ ఫ్యాక్ట్.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
-
Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
-
Samsung: సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8, ఫోల్డ్ 8 అల్ట్రా డిజైన్ లీక్.. 200MP కెమెరాతో రానున్నాయా?
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!