OTR: టీడీపీలో జూనియర్స్ vs సీనియర్స్.. నేతలు పక్కచూపులు చూస్తున్నారా?
- పార్వతీపురం జిల్లా టీడీపీలో జూనియర్స్ వర్సెస్ సీనియర్స్
- జూనియర్సే పెత్తనం చెలాయిస్తున్నారన్న ఫీలింగ్
- కక్కలేక, మింగలేక అన్నట్టుగా సీనియర్ లీడర్స్
- బయటపడితే పార్టీ డ్యామేజ్ అవుతుందన్న బాధ
- మాట్లాడకుంటే కనుమరుగైపోతామన్న భయం
- ఎమ్మెల్యేలు కనీస గౌరవం ఇవ్వడం లేదంటున్న సీనియర్స్
- పార్వతీపురం మున్సిపాలిటీలో నేతలు పక్కచూపులు చూస్తున్నారా?
- అంతర్గత పోరు పార్టీని ఘోరంగా దెబ్బ తీయబోతోందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ జిల్లాలో టీడీపీ సీనియర్స్ అయోమయంలో ఉన్నారా? మింగలేక, కక్కలేక సతమతం అవుతున్నారా? ఫ్రస్ట్రేషన్లో కొంతమంది పక్క చూపులు కూడా చూస్తున్నారన్నది నిజమేనా? అసలేంటి వాళ్ళకొచ్చిన సమస్య? అధికార పార్టీలో ఉండి కూడా మారిపోవాలనే ఆలోచన వచ్చేంత తీవ్రమైన పరిస్థితులు ఏమున్నాయి? అసలు ఏ జిల్లాలో ఉందా వాతావరణం?.
పార్వతీపురం మన్యం జిల్లాలో పసుపు యుద్ధం పీక్స్కు చేరుతోంది. కొత్తగా ఏర్పడ్డ ఈ జిల్లా టీడీపీలో వర్గ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయని పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. ఇక్కడ సీనియర్ నేతలుగా గుర్తింపు ఉన్న ద్వారపురెడ్డి జగదీష్, బొబ్బిలి చిరంజీవులు, భంజ్దేవ్ను పక్కనపెట్టి జూనియర్ లీడర్స్ పెత్తనం చెలాయిస్తున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది పార్టీ వర్గాల్లో. దాంతో పెద్దోళ్ళ పరిస్థితి కక్కలేక, మింగలేక అన్నట్టుగా మారిందట. బోనెల విజయచందర్, తోయక జగదీశ్వరి, సంధ్యారాణి వంటి నేతలు జిల్లాలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని, పార్టీ కార్యక్రమాలు, పదవుల కేటాయింపుల్లో సీనియర్స్కు ప్రాధాన్యత లేకుండా పోతోందన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ కార్యక్రమం ఏది జరిగినా సీనియర్ నేతలను పిలవడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి.
Also Read
దీంతో చేసేదేమీ లేక ఇంటిపట్టునే కాలం వెళ్లదీస్తున్నారన్నట్టు చెప్పుకుంటున్నారు. తమను పక్కపెట్టినట్టు స్పష్టంగా అర్ధం అవుతున్నా… ఆవిషయాన్ని బయటికి చెప్పుకోలేక, బహిరంగంగా మాట్లాడితే పార్టీకి ఎక్కడ డ్యామేజ్ అవుతుందోనన్న ఉద్దేశ్యంతో పెద్దలంతా సంయమనం పాటిస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. సీనియర్ నేతలు అయి ఉండి బహిరంగంగా వ్యతిరేకిస్తే…..పార్టీని, అధిష్టానాన్ని ఇరుకున పెట్టిన వాళ్లం అవుతామన్న అభిప్రాయం ఒకవైపు, ఇప్పటికీ నోరు తెరవకుంటే మొత్తానికే కనుమరుగు అయిపోతాం, రాబోయే రోజుల్లో దక్కాల్సిన పదవులకు దూరమవుతాయన్న భయం మరోవైపు ఉండి.. రెండింటి మధ్య నలిగిపోతున్నారన్న చర్చ జరుగుతోంది టీడీపీ వర్గాల్లో.
అధినేత పిలుపుతో గత ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అహర్నిశలు పని చేశామని, తీరా అధికారం వచ్చాక గుర్తింపు లేకుండా పోయిందన్నది వాళ్ళ బాధ. ఎమ్మెల్యేలు కూడా కనీస గౌరవం ఇవ్వడం లేదన్నది పెద్ద నాయకుల బాధ. పార్టీలో కష్టపడిన వారికి గౌరవం, గుర్తింపు ఒకప్పుడు ఉండేదని, ఇప్పుడు మాత్రం అవకాశవాద రాజకీయాలే పైచేయి సాధిస్తున్నాయంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారట మన్యం జిల్లా టిడిపి సీనియర్స్. ఈ వర్గపోరుతో పార్టీలో కొనసాగలేమని, జెండా ఎత్తేస్తే ఎలా ఉంటుందని కొందరు ఆలోచిస్తున్నట్టు సమాచారం. పార్వతీపురం మున్సిపాలిటీలోని పలువురు నేతలు పక్క చూపులు చూస్తున్నట్టు తెలుస్తోంది. పాలకొండ, పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో ఈ అంతర్గత విభేదాలు పార్టీని ఘోరంగా దెబ్బతీస్తున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది. మొత్తం మీద పార్వతీపురం మన్యం జిల్లా తెలుగుదేశం పార్టీలో సీనియర్లు, జూనియర్ల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వర్గ రాజకీయాలు జిల్లాలో పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో, అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్లో భారీ హైప్
-
Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
-
Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
ట్రెండింగ్
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!