Venu Goapl Reddy
Author- NTV Telugu-
President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తప్పని కరెంట్ కోతల తిప్పలు..
Power cut in the President's program: కరెంట్ కోతలు సామాన్యుడికే కాదు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా తప్పడం లేదు. ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతుండగా కరెంట్ పోయింది. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. ఒడిశాలోని బరిపాడలోని మహారాజా శ్రీ రామచంద్ర భంజదేయో విశ్వవిద్యాలయం 12వ స్నాతకోత్సవానికి శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఆమె ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ పోయింది. దీంతో లైట్లు ఆఫ్ కావడంతో వేదికపై చీకటి అలుముకుంది. -
FM Radio On Mobiles: అన్ని మొబైల్ ఫోన్లలో ఎఫ్ఎం రేడియో ఉండాల్సిందే.. కేంద్రం హెచ్చరిక..
FM Radio Mobiles: స్మార్ట్ఫోన్లలో ఎఫ్ఎం రేడియోను సులభంగా యాక్సెస్ చేయడానికి భారత ప్రభుత్వం మొబైల్ ఫోన్ తయారీదారులకు ఒక సలహాను జారీ చేసింది. అన్ని ఫోన్లలో ఎఫ్ఎం రేడియో ఉండాల్సిందే అని తెలిపింది. దీన వల్ల అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో ప్రజలకు రేడియో సేవల ద్వారా సమాచారాన్ని అందించడం పాటు వినోదాన్ని అందించేలా సహాయపడుతుందని తెలిపింది. ప్రస్తుతం ఉన్న కాలంలో సపరేట్ గా రేడియో సెట్లను కొనుగోలు చేయలేని గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజలకు రేడియో సేవలను అందుబాటులోకి తీసుకురడానికి భారత… -
Tim Cook: ఆపిల్ లేఆఫ్స్పై సీఈఓ టిమ్ కుక్ కీలక వ్యాఖ్యలు..
Tim Cook: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు టెక్ సంస్థల్ని, దాని ఉద్యోగులను కలవరపెడుతున్నాయి. ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక మందగమనం పలు కంపెనీల ఆదాయాలు తగ్గేందుకు కారణం అయ్యాయి. దీంతో ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు పెద్ద ఎత్తు ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. ఇప్పటికే దిగ్గజ ఐటీ కంపెనీలు మాస్ లేఆఫ్స్ ను ప్రకటించాయి. గూగుల్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ తో పాటు అనేక ఐటీ కంపెనీలు నిర్ధాక్షిణ్యంగా ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. -
Mobile Phones: ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడుతున్నారా..? అయితే మీరు హైబీపీ బారిన పడొచ్చు..
Mobile Phones: ప్రస్తుత జీవిత కాలంలో సెల్ ఫోన్లు మన జీవితంలో భాగం అయ్యాయి. ఇక ఇంటర్నెట్ చౌకగా అందుబాటులోకి వచ్చేసరికి చాలా మంది సెల్ ఫోన్లలోనే గుడుపుతున్నారు. ఇదిలా ఉంటే చాలా సేపు మొబైల్ ఫోన్లు వాడటం దీర్ఘకాలంలో పలు ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అదే పనిలో సెల్ ఫోన్లలో గంటల తరబడి మాట్లాడే వారికి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వారానికి 30 నిమిషాల కన్నా ఎక్కువ సేపు మొబైల్ ఫోన్లలో… -
Texas Shooting: అమెరికాలో కాల్పుల మోత.. 9 మంది…
Texas Shooting: అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. టెక్సాస్ లోని ఓ షాపింగ్ మాల్ లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. టెక్సాస్ లోని డల్లాస్ శివారు అలెన్ లోని అవుట్లెట్ మాల్లో శనివారం ఒక సాయుధుడు అక్కడ ఉన్న ప్రజలపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్యలను అధికారులు ఇంకా ధృవీకరించలేదు. ఈ కాల్పులకు పాల్పడ్డ నిందితుడిని పోలీసులు హతమార్చారు. -
PM Modi: “జై భజరంగబలి” నినాదాల మధ్య ప్రధాని మెగా రోడ్ షో..
PM Modi: కర్ణాటక ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకోబోతోంది. ఎన్నికలకు మరో నాలుగు రోజులే మిగిలి ఉన్నాయి. ప్రచారానికి మరో రెండు రోజుల మాత్రమే మిగిలి ఉంది. ఈ రోజు బెంగళూర్ నగరంలో ప్రధాని నరేంద్రమోడీ మెగా రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. -
The Kerala Story: “ది కేరళ స్టోరీ” సినిమాకు టాక్స్ రద్దు చేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం
The Kerala Story: వివాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తోంది ‘ది కేరళ స్టోరీ’ సినిమా. ఇప్పటికే ఈ సినిమాపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ సినిమా విడుదల చేయకుండా స్టే ఇవ్వాలని పలువురు సుప్రీంకోర్టు, కేరళ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ..కోర్టులు అందుకు నిరాకరించాయి. దీంతో శుక్రవారం దేశవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద భద్రతను కల్పించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు టాక్స్ ఫ్రీ ప్రకటించింది. -
Manipur Violence: మణిపూర్ హింసలో 54 మంది మృతి..
Manipur Violence: గిరిజన, గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణ చోటు చేసుకోవడంతో మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. గత నాలుగు రోజులుగా అక్కడ హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. స్కూళ్లు, వాహనాలు, చర్చిలకు ఆందోళనకారులు నిప్పుపెడుతున్నారు. సైన్యం, పారామిలిటీ బలగాలను రాష్ట్రంలో మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని సైన్యం ప్రకటించింది. పలు ప్రాంతాల్లో భద్రతను పెంచారు. సైన్యం, అస్సాం రైఫిల్స్ నుంచి 10,000 మంది సైనికులు మోహరించారు. -
Air India: ప్రయాణికురాలికి తేలు కాటు.. ఎయిరిండియా ఫ్లైట్లో ఘటన
Air India: వరసగా పలు వార్తల్లో చర్చనీయాంశంగా మారుతోంది ఎయిర్ ఇండియా. ఈ ఏడాది మొదట్లో ఓ ప్రయాణికుడు మూత్రవిసర్జన చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. తాజాగా మరో ఎయిర్ ఇండియా మరోసారి వార్తల్లో నిలిచింది. విమానంలో ప్రయాణిస్తున్న మహిళను తేలు కుట్టింది. -
Bombay High Court: 80 ఏళ్ల న్యాయ పోరాటం.. 93 ఏళ్ల వయసులో మహిళ విజయం..
Bombay High Court: ఇండియాలో న్యాయపరమైన కేసులు కోర్టుల్లో దశాబ్దాలు కొనసాగుతుంటాయి. చివరకు విజయం మాత్రం దక్కుతుంది. బాధితులు న్యాయం కోసం చాలా ఏళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి కొన్ని సార్లు ఉంటుంది. అటువంటి కోవలోకే చెందుతుంది ఓ మహిళ పోరాటం. పది కాదు 20 కాదు ఏకంగా తన ఆస్తిని దక్కించుకోవడానికి 80 ఏళ్లు న్యాయపోరాటం చేసింది. చివరకు 93 ఏళ్ల వయసులో ఆమెకు న్యాయం దక్కింది.
తాజావార్తలు
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!