Venu Goapl Reddy
Author- NTV Telugu-
Smuggling: బోటులో డ్రగ్స్.. చెరువులో బంగారు బిస్కెట్లు..
Smuggling: గుజరాత్ తీరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇరాన్ నుంచి అక్రమంగా వచ్చిన ఓ బోటులో డగ్స్ కోస్ట్ గార్డ్స్ పట్టుకున్నారు. మొత్తం రూ. 425 కోట్ల విలువైన 61 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అరెస్ట్ చేశారు. గుజరాత్ ఏటీఎస్ ఇచ్చిన సమాచారం మేరకు ఇరాన్ పడవను కోస్ట్ గార్డ్స్ పట్టుకున్నారు. -
PM Narendra Modi: నేడు నాగాలాండ్, మేఘాలయ సీఎంల ప్రమాణ స్వీకారం.. హాజరుకానున్న ప్రధాని మోదీ..
PM Modi to Attend Oath Ceremonies of Nagaland, Meghalaya CMs: ఈశాన్య రాష్ట్రాలు నాగాలాండ్, మేఘాలయాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరబోతున్నాయి. మేఘాలయ సీఎంగా నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) నేత కన్రాడ్ సంగ్మా నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. సంకీర్ణంలో బీజేపీ కూడా భాగస్వామ్యం కాబోతోంది. ఇక నాగాలాండ్ లో నేషనలిస్టు డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ( ఎన్డీపీపీ) నేత నెపియూ రియో నేతృత్వంలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మంగళవారం రెండు రాష్ట్రాల సీఎంలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. -
Meta Layoffs: ఉద్యోగులకు మెటా మరో షాక్.. రెండో రౌండ్ కోతలు షురూ.. వేలాది ఉద్యోగాలు ఊస్ట్..
Meta Layoffs: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఆర్థిక లక్ష్యాలను చేరుకోవాడానికి వేలాదిగా ఉద్యోగులను తీసేస్తున్నట్లు ప్లాన్ చేస్తోంది. గతేడాది నవంబర్ నెలలో 13 శాతం అంటే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 11,000 మంది ఉద్యోగులు కొలువుల నుంచి తీసేసింది. తాజాగా రెండో రౌండ్ కోతలను షురూ చేసింది మెటా. పెద్దమొత్తంలో ప్యాకేజీలు అందుకుంటున్న మేనేజర్లు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. -
Tamilnadu: తమిళనాడులో ఘోరం.. కరెంట్ ఫెన్సింగ్ కారణంగా ఏనుగులు మృతి
Elephants die due to current fencing: తమిళనాడులో ఘోరం జరిగింది. కరెంట్ ఫెన్సింగ్ తగిలి ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన తమిళనాడులోని ధర్మపురి జిల్లా మారండహళ్లి సమీపంలోని కలికౌండన్కోట్టై గ్రామంలో జరిగింది. తన పంటను రక్షించుకునేందుకు గ్రామానికి చెందిన రైతు మురుగేషన్ రెండేళకరాల వ్యవసాయ భూమి చుట్టూ విద్యుత్ తీగలను అమర్చాడు. -
Sukesh Chandrashekhar: బేబీ గర్ల్ నీ కోసం ఎందాకైనా వెళ్తా.. జాక్వలిన్ ఫెర్నాండెజ్కు లవ్ లెటర్..
Sukesh Chandrashekhar: రూ.200 కోట్ల దోపిడి కేసులో సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు. ఈ కేసులో బాలీవుడ్ స్టార్స్ జాక్వలిన్ ఫెర్నాండెస్, నోరా ఫతేహ్ వంటి వారి పేర్లు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే జాక్వలిన్ ఫెర్నాండెస్ కు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ.. సుకేష్ లవ్ లెటర్ రాశాడు. ఈ లెటర్ లో మీడియాను ఆయన మద్దతుదారులను, వ్యతిరేకులను ఉద్దేశిస్తూ హోలీ విషెస్ తెలిపారు. -
Aligarh Mosque: హోలీ సందర్భంగా అలీగఢ్ మసీదుకు ముసుగు..
Aligarh Mosque: దేశవ్యాప్తంగా హోలీ పండగ సంబరాలు మొదలయ్యాయి. అయితే కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచారు. కొన్ని చోట్ల మసీదులను టార్పిలిన్లలో కప్పారు. ముఖ్యంగా చాలా సున్నిత ప్రాంతం అయిన అలీగఢ్ లోని మసీదును టార్పలిన్లతో కప్పారు. హోలీ సమయంలో రంగులు పడకుండా మసీదును కప్పినట్లు నిర్వాహకులు తెలిపారు. -
Rahul Gandhi: బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉంటుందని కలలు కంటోంది.
Rahul Gandhi: బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉంటుందని కలలు కంటోందని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. సోమవారం లండన్ లో జరిగి చాథమ్ హౌస్ థింక్ ట్యాంక్లో ఆయన ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నదని గుర్తు చేశారు. -
Pakistan: హోలీ జరుపుకున్నందుకు హిందూ విద్యార్థులను చితకబాదిన తోటి విద్యార్థులు
Pakistan: పాకిస్తాన్ లో మైనారిటీ హక్కులు ఎలా ఉంటోయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడి మైనారిటీలు అయిన హిందూ, సిక్కు, క్రైస్తవులను ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూస్తుంటారు. మైనారిటీ బాలికను బలవంతంగా కిడ్నాప్ చేసి మతం మార్చి పెళ్లిళ్లు చేసుకోవడం అక్కడ సర్వసాధారణం అయిపోయింది. మైనారిటీలు తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నా.. పాక్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉంటే భారత్ లో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయంటూ మొసలి కన్నీరు కారుస్తుంటుంది. -
Pakistan: ప్రజలు వద్దు, చైనీయులు ముద్దు.. వారి రక్షణ కోసం భారీగా పోలీస్ భద్రత
Pakistan: పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే అక్కడి ప్రజలు ఏమైనా పర్వాలేదు కానీ చైనీయులకు మాత్రం ఎలాంటి హానీ కలగకూడదని భావిస్తోంది. అప్పుల్లో కూరుకుపోవడానికి ఓ రకంగా కారణం అయిన చైనాను ఇంకా పాకిస్తాన్ నమ్ముతూనే ఉంది. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొంతలో కొంత చైనా, పాక్ కు మళ్లీ రుణాలు ఇస్తోంది. -
Oil Imports: భారత ఆయిల్ దిగుమతుల్లో సరికొత్త రికార్డ్.. 35 శాతం రష్యా నుంచే..
India's Russian Oil Imports Hit Record High: ఇండియా ఆయిల్ దిగుమతుల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ అయింది. సంప్రదాయ ముడిచమురు సరఫరాదారులు అయిన ఇరాక్, సౌదీ అరేబియాల కన్నా అధికంగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంది భారత్. ఫిబ్రవరిలో ఈ దిగుమతులు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఫిబ్రవరి నెలలో రికార్డ్ స్థాయిలో రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్లకు పెరిగింది. ప్రస్తుతం 35 శాతం చమురు దిగుమతుల వాటాను రష్యా దక్కించుకుంది.
తాజావార్తలు
-
Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
-
Tollywood : మే 1 నుంచి థియేటర్ల బంద్?
-
The India Story: జూలై 24న కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరి’
-
AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
-
Tamil Cinema : కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ కుదుపు.. హీరోలకు రెమ్యునరేషన్ ఇచ్చేది లేదని నిర్ణయం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!