PM Narendra Modi: భారత చరిత్ర అంటే వలసవాదం కాదు.. యోధులు, వీరుల చరిత్ర
India shedding colonial mindset, says PM Modi: ఢిల్లీలో అస్సాంకు చెందిన 17వ శతాబ్ధపు అహెమ్ జనరల్ లచిత్ బర్ఫుకాన్ 400వ జన్మదిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారతదేశ చరిత్ర వక్రీకరణపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్ధాలుగా మనల్ని దోచుకుని, ఓడిపోయే వ్యక్తులమని చెప్పడానికి ప్రయత్నించారని.. భారతదేశ చరిత్ర కేవలం వలసవాదానికి సంబంధించింది కాదని.. ఇది యోధుల చరిత్ర అని ఆయన అన్నారు. భారతదేశ చరిత్ర అణిచివేతదారులపై శౌర్యాన్ని ప్రదర్శించిందని, త్యాగం, గొప్ప సంప్రదాయం కలిగినదిగా ప్రధాని అభివర్ణించారు.
Read Also: Super Earth: సూపర్ ఎర్త్ని గుర్తించిన నాసా.. భూమికి డబుల్ సైజ్..
Also Read
- Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
- The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
దురదృష్టవశాత్తూ.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా వలస రాజ్యాల కాలంలో కుట్రలో సృష్టించబడిన చరిత్రనే మనం చదువుకుంటున్నామని..మనల్ని వలసరాజ్యంగా చేసిన వారి ఎజెండాను మార్చాల్సిన అవసరం ఉందని, కానీ అది జరగలేదని ఆయన అన్నారు. దేశంలోని ప్రతీ మూలలో భారత మాత ముద్దబిడ్డలు దైర్యంగా అణచివేతదారులను ఎదుర్కొన్నారని.. తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని అన్నారు. ఈ చరిత్రను కొంతమంది ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని అన్నారు. లచిత్ బర్ఫుకాన్ పరాక్రమం ముఖ్యం కాదా..? అని ప్రశ్నించారు. మొఘల్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడిన అస్సాంలోని వేలాది మంది ప్రజల త్యాగాలు ముఖ్యం కాదా..? అని అడిగారు.
అమృత్ కాల్ సమయంలో బర్పుకాన్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని మోదీ అన్నారు. భారత వారసత్వాన్ని, వీరులను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. లచిత్ బర్ఫుకాన్ చరిత్ర ‘నేషన్ ఫస్ట్’ అని తెలియజేస్తుందని..ప్రస్తుత భారతదేశం కూడా ‘నేషన్ ఫస్ట్’ అనే సూత్రంతో ముందుకు వెళ్తోందని ఆయన చెప్పారు. ఒక దేశానికి దాని వారసత్వం గురించి తెలిస్తే అది భవిష్యత్తుకు మార్గాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రధాని అన్నారు. భారతదేశ చరిత్ర, సంస్కృతిని కాపాడేందుకు యువత సిద్ధంగా ఉండాలని సూచించారు.
అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా భారత చరిత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. చరిత్రకారులు భారత చరిత్రను తిరగరాయాలని కోరారు. అసలైన చరిత్రను అందించాలని సూచించారు. గతం నుంచి మన చరిత్రను వక్రీకరించి చెబుతున్నారంటూ మండిపడ్డారు. చరిత్రకారులకు ప్రభుత్వం నుంచి మద్దతు ఉంటుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
-
Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
-
Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
-
Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ కెప్టెన్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో