JP Nadda: ఆమ్ ఆద్మీ పార్టీ రేపిస్టును.. థెరపిస్టు చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JP Nadda criticizes Aam Aadmi Party: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వర్సెస్ బీజేపీగా సాగుతోంది రాజకీయం. ఇరుపార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి.ఇదిలా ఉంటే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయం వేడెక్కింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఢిల్లీలో ఆదివారం ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలోని వజీర్ పూర్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Read Also: Love Today OTT Release : లవ్ టుడే ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే
Also Read
- Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: కాక్రోచ్ ఉద్యమం ఎటు పోతోంది.? పేపర్ లీక్పై నిరసన అయితే దాడులు, విద్వేష నినాదాలు ఎందుకు.?
- Delhi Police: సీజేపీపై 10 ఎఫ్ఐఆర్లు.. తగ్గేది లేదంటున్న ఢిల్లీ పోలీసులు..
- IMD Alert: బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో వాయుగుండాలు.. దేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం
ఆప్ నాయకులు నిజాయితీపరులని చెప్పుకునే వారని.. అయితే ప్రస్తుతం ఆ పార్టీకి చెందిన మంత్రి సత్యేంద్ర జైన్ అవినీతికి పాల్పడి జైలులో ఉన్నారని.. వారు తీహార్ జైలును మసాజ్ సెంటర్ గా మార్చారని.. రేపిస్టును థెరపిస్టుగా మార్చారని వజీర్ పూర్ పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో విమర్శించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయాలని ప్రజలను కోరారు జేపీ నడ్డా. ‘సంకల్ప్ పత్ర’పేరుతో మెనిఫెస్టో విడుదల చేసింది బీజేపీ. జేపీ నడ్డా వెంట ఎంపీ హర్షవర్థన్, ఇతర పార్టీ నేతలు ఉన్నారు. ప్రచారంలో ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా సహా వివిధ పార్టీల నేతలు కూడా ఉన్నారు.
మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ ఇటీవల జైలులో మసాజ్ చేయించుకోవడం వివాదాస్పదం అయింది. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ బయటపెట్టింది. అయితే ముందుగా ఆప్ ఈ చర్యను సమర్థించుకుంది. జైన్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో మసాజ్ చేయించుకున్నాడని వెనుకేసుకొచ్చింది. ఆ తరువాత మసాజ్ చేసిన వ్యక్తి జైలులో రేపు కేసులో శిక్ష అనుభవిస్తున్నవాడిగా తేలింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ 250 వార్డుల్లోని ప్రజలకు చేరువకావాలని బీజేపీ ప్రచారం ప్రారంభించింది. కేంద్రమంత్రులు, కీలక నేతలు ప్రచారంలో పాల్గొననున్నారు. డిసెంబర్ 4న ఈ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 7న ఓట్ల లెక్కింపు ఉండనుంది.
తాజావార్తలు
-
Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
-
Balakrishna : బాలయ్యకి సర్జరీ.. NBK 111 పరిస్థితి ఏంటి?
-
Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
-
Gabbar Singh Ramesh: గబ్బర్ సింగ్’ నటుడికి బ్రెయిన్ స్ట్రోక్!
-
MS Dhoni: ఎంఎస్ ధోనీ కొత్త బిజినెస్కు బంపర్ బూస్ట్.. కోట్లలో నిధులు సమీకరణ!
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!