China: డర్టీ డ్రాగన్ ఇక మారదు… కీలక సమావేశానికి ఇండియాను పిలవని చైనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China holds first Indian Ocean Region meet with 19 countries without India: అవకాశం దొరికితే భారత్ ను ఎలా దెబ్బతీయాలా..? అనే ఆలోచనలోనే ఉంటుంది డ్రాగన్ కంట్రీ చైనా. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆసియా పరిధిలో భారత్ ప్రాముఖ్యత, ప్రాధాన్యత పెరగడాన్ని తట్టుకోలేకపోతోంది చైనా. భారత ప్రాధాన్యతను తగ్గించాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఇటీవల చైనా హిందూ మహాసముద్ర ప్రాంత సమావేశాన్ని నిర్వహించింది. హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాలు ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. అయితే భారతదేశాన్ని మాత్రం ఆహ్వానించింది. గతేడాది కూడా భారతదేశం పాల్గొనకుండా కోవిడ్-19 వ్యాక్సిన్ సహకారంపై చైనా దక్షిణాసియా దేశాలతో సమావేశాన్ని నిర్వహించింది.
చైనా ఇటీవల మొదటి హిందూమహాసముద్ర ప్రాంత సమావేశాన్ని నిర్వహించింది. మొత్తం 19 దేశాలతో చైనా ఈ వారం ఈ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి భారతదేశానికి ఆహ్వానం అందలేదు. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించిన చైనా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఏజెన్సీ (సిఐడిసిఎ) నవంబర్ 21 న అభివృద్ధి సహకారంపై చైనా-ఇండియన్ ఓషన్ రీజియన్ ఫోరమ్ యొక్క సమావేశాన్ని నిర్వహించింది, ఇందులో 19 దేశాలు పాల్గొన్నాయని పత్రికా ప్రకటన విడుదల చేసింది.
Also Read
Read Also: Chhattisgarh: వీళ్లు మనుషులు కాదు.. అక్కా చెల్లిళ్లపై తండ్రి, మేనమామ లైంగిక వేధింపులు
యునాన్ ప్రావిన్స్ లోని కున్ మింగ్ లో ‘‘ షేర్డ్ డెవలప్మెంట్: థియరీ అండ్ ఫ్రాక్టీస్ ఫ్రమ్ ద పెర్స్పెక్టివ్ ఆఫ్ ది బ్లూ ఎకానమీ’’ అనే పేరుతో హైబ్రీడ్ పద్ధతిలో ఈ సమావేశాన్ని నిర్వహంచింది. ఇండోనేషియా, పాకిస్థాన్, మయన్మార్, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవులు, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఒమన్, దక్షిణాఫ్రికా, కెన్యా, మొజాంబిక్, టాంజానియా, సీషెల్స్, మడగాస్కర్, మారిషస్, జిబౌటీ, ఆస్ట్రేలియాతో సహా 19 దేశాల ప్రతినిధులు, మూడు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. దీనికి మాజీ ఉపవిదేశాంగ మంత్రి, భారతదేశంలో రాయబారి అయిన లువో జావోహుయ్ నేతృత్వం వహించారు.
హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తోంది. శ్రీలంక, పాకిస్తాన్ దేశాల్లో పోర్టులను నిర్మిస్తోంది. జిబౌటీలో చైనా ఏకంగా ఓ నౌకాదళ స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. శ్రీలంకలో హంబన్ టోట పోర్టును 99 ఏళ్లకు లీజుకు తీసుకుంది. పాకిస్తాన్ లో గ్వాదర్ పోర్టును నిర్మిస్తోంది. మాల్దీవుల్లో కూడా పెట్టుబడులు పెడుతోంది. ఇక్కడ నుంచి భారత్ పై నిఘా పెట్టేందుకు ప్రయత్నిస్తోంది డ్రాగన్ కంట్రీ. హిందూ మహాసముద్ర దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, శాస్త్రసాంకేతిక విషయాల్లో భాగస్వామ్యం అని చైనా చెబుతున్నప్పటికీ.. అంతిమ లక్ష్యం మాత్రం భారత్ ను ఇబ్బంది పెట్టడమే.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!