Venu Goapl Reddy
Author- NTV Telugu-
PM Modi: భారత్-పాకిస్తాన్ సంబంధాలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
PM Modi: బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని ఎత్తేయడం తర్వాత నుంచి భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. పాకిస్తాన్, భారత్ లో వాణిజ్య సంబంధాలను కూడా కట్ చేసుకుంది. అయితే దీని ఫలితాలను పాకిస్తాన్ అనుభవిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా భారత్-పాకిస్తాన్ సంబంధాల గురించి ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. -
Anand Mahindra: కారు కొన్న ఆనందంలో కుటుంబం డ్యాన్స్.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..?
Anand Mahindra: మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఎల్లప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. పలు సమకాలీక అంశాలపై స్పందిస్తుంటారు. తాజాగా ఓ కుటుంబం కారు కొన్న ఆనందంలో డ్యాన్స్ చేయడంపై ఆయన స్పందించారు. ముఖ్యంగా ఇండియాలో వాహనం కొనుగులు చేయడం చాలా ప్రత్యేకంగా భావిస్తుంటారు. దాన్ని ఓ వాహనంలా కాకుండా కుటుంబంలో సభ్యుడిగా భావిస్తుంటారు. అలాంటిది ఓ కొత్త కారు కొంటే సదరు కుటుంబం ఆనందాలకు అవధులు ఉండవు. -
PM Modi: జపాన్ వేదికగా ప్రధాని మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడి భేటీ..?
PM Modi: హిరోషిమాలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ వెళ్లారు. శిఖరాగ్ర సమావేశానికి హాజరుకావడమే కాకుండా, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో సహా అనేక మంది ప్రపంచ నాయకులతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలను కూడా నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలిడిమిర్ జెలన్ స్కీతో ప్రధాని నరేంద్రమోదీ సమావేశం అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య సమావేశానికి సంబంధించి ఇరు దేశాల దౌత్యవేత్తల మాట్లాడుతున్నట్లు సమాచారం. -
Junmoni Rabha: మలుపులు తిరుగున్న “లేడీ సింగం” మృతి కేసు.. పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు..
Junmoni Rabha: అస్సాం మహిళా పోలీస్ అధికారి, ‘‘లేడీ సింగం’’గా పేరు తెచ్చుకున్న ఎస్ఐ జున్మోని రభా కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్ లారీ ఢీ కొట్టడంతో ఆమె మరణించింది. అయితే ఆమె మరణం పట్ల కుటుంబ సభ్యులు, ఆమె అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
Domestic Violence: మాజీ ప్రధాని మనవరాలికి వరకట్న వేధింపులు.. కేసు నమోదు
Domestic Violence: మాజీ ప్రధాని మనవరాలికి కూడా గృహహింస, వరకట్న వేధింపులు తప్పడం లేదు. మాజీ ప్రధాని వీపీ సింగ్ మనవరాలైన అద్రిజా మంజరీ సింగ్ తాను గృహహింస ఎదుర్కొంటున్నట్లుగా డెహ్రాడూన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త ఆర్కేష్ నారాయణ్ సింగ్ డియోతో పాటు అతని తండ్రి, కుటుంబ సభ్యులపై డెహ్రడూన్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. -
Gyanvapi Mosque Case: జ్ఞానవాపి కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. “శివలింగం” శాస్త్రీయ సర్వే వాయిదా..
Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మసీదులో లభించిన శివలింగానికి శాస్త్రీయ సర్వే, కార్బన్ డేటింగ్ చేయడానికి మే 12న అలహాబాద్ హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిపై ఇంతేజామియా మసీద్ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ రోజు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు శాస్త్రీయ సర్వేను వాయిదా వేయాలని తీర్పు చెప్పింది. ‘‘ఈ విషయంలో మనం జాగ్రత్తగా నడవాలి’’ అని కీలక వ్యాఖ్యలు చేసింది. -
Brain Cancer: బ్రెయిన్ క్యాన్సర్ చికిత్సలో ముందడుగు.. కీలక విషయాన్ని కనుగొన్న భారతీయురాలు..
Brain Cancer: వైద్యరంగం ఇంతగా అభివృద్ధి చెందిన ప్రస్తుత కాలంలో కూడా క్యాన్సర్లకు పూర్తిగా చికిత్స లభించడం లేదు. అయితే వైద్యులు, పరిశోధకులు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త చికిత్సలను అభివృద్ధి చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే బ్రయిన్ క్యాన్సర్ల విషయంలో ముందడుగు పడింది. అమెరికా కాలిఫోర్నియా విశ్వవిధ్యాలయంలోని శాన్ ఫ్రాన్సిస్కో మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తల బృందం కీలక విషయాన్ని కనుగొంది. ఈ టీంకు భారతీయ వైద్యురాలు సరితా కృష్ణ నేతృత్వం వహించారు. -
Dog Beats Cancer: క్యాన్సర్ని జయించిన పోలీస్ జాగిలం.. తిరిగి విధుల్లోకి..
Dog Beats Cancer: క్యాన్సర్ తో బాధపడుతున్న పోలీస్ జాగిలం, ఇప్పుడు దాన్నుంచి విముక్తి పొందింది. కాన్సర్ ని జయించి తిరిగి విధుల్లోకి చేరింది. లాబ్రాడార్ జాతికి చెందిన పోలీస్ జాగిలం పంజాబ్ పోలీస్ శాఖలో విధ్వంసక తనిఖీల్లో సహాపడుతుందని పోలీసులు తెలిపారు. సిమ్మీ అనే పేరున్న ఈ జాగిలం ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. -
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో టెర్రరిస్టులు.. ఆరుగురి అరెస్ట్..
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో 30-40 మంది వరకు టెర్రరిస్టులు ఉన్నట్లు పంజాబ్ ప్రభుత్వం, పంజాబ్ పోలీసులు ఆరోపించారు. వారందరిని అప్పగించాలని ఇమ్రాన్ ఖాన్ కు డెడ్ లైన్ కూడా ఇచ్చారు. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఇటీవల మీడియా ప్రతినిధులను తన ఇంటికి రమ్మని అంతా చూపించారు. పని మనుషులు తప్పితే ఎవరూ లేరని, తనపై అబద్దపు ఆరోపణలు చేస్తున్నట్లు ఆరోపించారు. -
Chandrayaan 3: జూలై రెండో వారంలో చంద్రయాన్-3 ప్రయోగించే అవకాశం..
Chandrayaan 3: అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మరో రెండు నెలల్లో చంద్రయాన్-3 ప్రయోగాన్ని నిర్వహించేందుకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో సమాయత్తం అవుతోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్ ను ల్యాండ్ చేయడానికి అత్యంత క్లిష్టమైన పరిజ్ఞానాన్ని ప్రదర్శించే లక్ష్యంతో ఈ ప్రయోగం జరగబోతోంది. చంద్రుడి రిగోలిత్ థర్మో ఫిజికల్ లక్షణాలను పరీశీలిచేందుకు, చంద్రుడిపై భూకంపాలు, చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా వాతావరణ పరిశీలించేందుకు సైన్స్ పరికరాలను చంద్రయాన్ -3 మిషన్ ద్వారా జాబిల్లి పైకి పంపనున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!