PM Modi: జపాన్ వేదికగా ప్రధాని మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడి భేటీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: హిరోషిమాలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ వెళ్లారు. శిఖరాగ్ర సమావేశానికి హాజరుకావడమే కాకుండా, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో సహా అనేక మంది ప్రపంచ నాయకులతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలను కూడా నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలిడిమిర్ జెలన్ స్కీతో ప్రధాని నరేంద్రమోదీ సమావేశం అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య సమావేశానికి సంబంధించి ఇరు దేశాల దౌత్యవేత్తల మాట్లాడుతున్నట్లు సమాచారం.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్ సాయం కోరుతోంది ఉక్రెయిన్. మరోవైపు ప్రపంచదేశాలు ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నా.. భారత్ మాత్రం రష్యాతో ఉన్న స్నేహం కారణంగా, రష్యాతో సత్సంబంధాలు నడుపుతోంది. రష్యా నుంచి పెద్ద ఎత్తున క్రూడ్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటోంది. ఒక వేళ ఈ సమావేశం జరిగితే ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా ఇరువురు నేతలు కలుసుకోవడం ఇదే తొలిసారి అవుతుంది. అయితే ఈ సమావేశంపై ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదు.
Also Read
- Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
- Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు...
- Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
- Sick Leave Denial Case: 'సిక్ లీవ్ కావాలి' అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
Read Also: Junmoni Rabha: మలుపులు తిరుగున్న “లేడీ సింగం” మృతి కేసు.. పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు..
పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల కూటమి జీ-7లో అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ , బ్రిటన్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ ఏడాది ఈ కూటమికి జపాన్ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంది. జపాన్ ఆహ్వానం మేరకు భారత ప్రధాని ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్తున్నారు. మరోవైపు జపాన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీని కూడా ఈ సమావేశాలకు ఆహ్వానించింది.
ఉక్రెయిన్ మొదటి ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ ఝపరోవా గత నెలలో భారతదేశాన్ని సందర్శించారు. ఉక్రెయిన్ వివాదం ప్రారంభమైనప్పటి నుండి, ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు అధ్యక్షుడు జెలెన్స్కీతో చాలాసార్లు మాట్లాడారు. గతేడాది అక్టోబర్ 4న ప్రెసిడెంట్ జెలన్ స్కీతో ప్రధాని మోడీ ఫోన్ లో మాట్లాడారు. శాంతి ప్రయత్నాలకు సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు.
తాజావార్తలు
-
Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
-
వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ‘ER-100’ ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!