పెద్దలు కుదిర్చిన పెళ్లిల్లే కాదు.. ఇటీవల ప్రేమ పెళ్లిళ్లు కూడా ఘోరాలకు దారి తీస్తున్నాయి. ఒకరిని ఒకరు ఇష్టపడి ప్రేమించుకుని.. జీవితాంతం కలిసి ఉండాలని ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్లు అనతి కాలంలోనే వారి మధ్య ప్రేమలు అంతమవుతున్నాయి. ప్రేమ పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే అదనపు కట్నం కోసం వేధింపులు, అనుమానాలు పెట్టుకుని దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో దారుణం చోటుచేసుకుంది. మన్సురాబాద్ వాంబె కాలనీ లో ప్రేమ పెళ్లి చేసుకున్న […]
సీసీఐ ప్రవేశపెట్టిన నూతన నిబంధనల నేపథ్యంలో కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ బందుకు పిలుపునిచ్చారు. దీంతో రెండో రోజు రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్ల బంద్ కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ తో పాటు అన్ని మార్కెట్ లో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 322 మిల్లులు బందులో పాల్గొన్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన సుమారు మూడు లక్షల ఇరవై వేల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు. అందులో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సుమారు పదివేల క్వింటాళ్ల […]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్నది. మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదంటూ, ప్రభాకర్ రావు అరెస్టుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గత విచారణలో ఫోరెన్సిక్ నిపుణుల ముందు ఐ క్లౌడ్ పాస్ వర్డ్ రీసెట్ చెయ్యాలని ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ […]
హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలో ఏకకాలంలో 15 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నారు ఐటీ అధికారులు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న హోటల్స్ బిజినెస్ పై ఐటి సోదాలు జరుపుతున్నారు. పాతబస్తీ కేంద్రంగా నడుస్తున్న పిస్తా హౌస్, షా గౌస్ హోటల్స్ పై ఐటి సోదాలు నిర్వహిస్తున్నారు. రెండు హోటల్స్ ప్రతి ఏడాది వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. Also Read:Fitness […]
ఆ దంపతులు పెళ్లై ఏడేళ్లైన పిల్లలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చింది ఆ మహిళ. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలువలేదు. విధి ఆడిన వింతనాటకంలో కడుపులోని పిల్లలతో సహా భార్యాభర్తలు కూడా మృతిచెందారు. ఈ విషాద ఘటన శంషాబాద్ లో చోటుచేసుకుంది. భార్య కడుపులో ఇద్దరు కవలలు మృతి చెందారని డాక్టర్లు చెప్పడంతో మనస్థాపానికి గురైన ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ […]
కార్తీక మాసం సందర్భంగా భక్తులు శివాలయాల్లో విశిష్ట పూజలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వేములవాడలో కొలువైన శ్రీ రాజ రాజేశ్వర స్వామి పుణ్య క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. కాగా రాజన్న ఆలయంలో కళ్యాణం అర్జిత సేవ టికెట్ల కోసం భక్తులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. స్వామి వారి నిత్య కళ్యాణం కోసం భక్తులు అర్ధరాత్రి నుండే టికెట్ కౌంటర్ వద్ద ఎముకలు కొరికే చచలిలో పడిగాపులు కాస్తున్నారు. మూడు రోజులుగా […]
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కేసులో అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) సంచలన తీర్పు ఇచ్చింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న కేసులో షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. దీంతో ఈ కేసు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. బంగ్లాదేశ్లో గత సంవత్సరం జరిగిన విద్యార్థుల నిరసనలపై జరిగిన హింసాత్మక అణచివేత, సంబంధిత మానవ హక్కుల ఉల్లంఘనలపై తాజా తీర్పుపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం (OHCHR) మరోసారి షేక్ హసీనా […]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా శాంతి ప్రణాళికకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నుంచి కీలకమైన ఆమోదం లభించింది. అమెరికా రూపొందించిన ముసాయిదా తీర్మానానికి ఓటింగ్లో మెజారిటీ మద్దతు లభించిన తర్వాత 20 పాయింట్ల రోడ్మ్యాప్ ఇప్పుడు అంతర్జాతీయంగా ఆమోదం పొందిన శాంతి చట్రంగా మారింది. ఈ ప్రతిపాదనలో అంతర్జాతీయ దళాలను మోహరించడం కూడా ఉంది. వాషింగ్టన్ 20-పాయింట్ల చట్రం గాజాలో కాల్పుల విరమణ, పునర్నిర్మాణం, పాలన కోసం మొదటి సమగ్ర అంతర్జాతీయ రోడ్మ్యాప్ను వివరిస్తుంది. Also […]
ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐ స్కిల్స్ ను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయ్యింది. భారత ప్రభుత్వం SWAYAM పోర్టల్లో ఐదు కొత్త ఉచిత కృత్రిమ మేధస్సు కోర్సులను ప్రారంభించింది. ఈ కోర్సులు విద్యార్థులు, ఉపాధ్యాయులు, నిపుణులకు ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. ఈ కోర్సులు పూర్తిగా ఉచితం. విజయవంతంగా పూర్తి చేయడం వలన ప్రభుత్వ సర్టిఫికేట్ లభిస్తుంది. Also Read:Bullet Baba Temple: ఈ […]
వానాకాలం ముగిసి శీతాకాలం ఎంటర్ అయినప్పటికి వరుణుడు మాత్రం వదలనంటున్నాడు. గత కొన్ని రోజుల క్రితం మొంథా తుఫాన్ ఏపీ, తెలంగాణలో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కుండపోత వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లాయి. భారీ వరదలతో లోతట్టు ప్రాంత్రాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు ధ్వంసం అయ్యాయి. ఆ తుఫాన్ ప్రభావం వీడి రోజులు గడవకముందే నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బయపెడుతోంది. Also Read:Andhra Pradesh:విశాఖలో మేనేజ్ […]