Ginning Mills: రెండో రోజు కొనసాగుతున్న.. రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్ల బంద్..
- రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్ల బంద్
- రాష్ట్రవ్యాప్తంగా 322 మిల్లులు బందులో పాల్గొన్నాయి
- రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన సుమారు మూడు లక్షల ఇరవై వేల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీసీఐ ప్రవేశపెట్టిన నూతన నిబంధనల నేపథ్యంలో కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ బందుకు పిలుపునిచ్చారు. దీంతో రెండో రోజు రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్ల బంద్ కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ తో పాటు అన్ని మార్కెట్ లో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 322 మిల్లులు బందులో పాల్గొన్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన సుమారు మూడు లక్షల ఇరవై వేల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు. అందులో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సుమారు పదివేల క్వింటాళ్ల పత్తి కొనుగోలు నిలిచిపోయింది.
Also Read:Umar: ఢిల్లీ బ్లాస్ట్కు ముందు ఏం జరిగింది.. వెలుగులోకి ఉమర్ సంచలన వీడియో
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ప్రభుత్వం తమ వినతులపై శ్రద్ధ వహించే వరకు బంద్ కొనసాగుతుందని కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మినేని రవీందర్ రెడ్డి తెలిపారు. కపాస్ కిసాన్ యాప్లో నమోదు చేసుకుని స్లాట్ బుకింగ్ మిల్లుల్లో అమ్మకాలు చేయడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారని వ్యాపారులు చెబుతున్నారు. జిన్నింగ్ మిల్లులను ఎల్1, ఎల్2, ఎల్ 3 ఇలా 12 కేటగిరీలుగా విభజించడం వల్ల ఇటు మిల్లర్లకు అటు రైతులకు నష్టం జరుగుతుందంటున్నారు వ్యాపారులు. జిన్నింగ్ మిల్ అసోసియేషన్ బందుకు రైతులు సహకరిస్తున్నారని వ్యాపారులు అంటున్నారు. ఆసియాలోనే అతిపెద్ద రెండో వ్యవసాయ మార్కెట్ అయిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ప్రతిరోజు 15000 బస్తాల పత్తి అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి.
Also Read:IT Raids: హైదరాబాద్ లో ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ రైడ్స్.. ఏకకాలంలో 15 చోట్ల..
పత్తి వ్యాపారుల బంద్ నేపథ్యంలో.. తీసిన పత్తిని అమ్ముకోలేక ఇబ్బంది పడనున్న పత్తి రైతులు.. ఇప్పటికే అకాల వర్షాలతో దిగుబడి తగ్గిపోవడం తేమ ఇతర కారణాలతో ఇబ్బంది పడుతున్న రైతులకు పత్తి కొనుగోలు నిలిచిపోవడంతో మరింత భారం పడుతుంది. పత్తి రైతుల ఇబ్బందులపై బిఆర్ ఎస్ స్పందించింది. పత్తి రైతులకు మద్దతుగా బిఆర్ ఎస్ నేతలు మార్కెట్ బాట పట్టారు. నేడు ఎనుమాముల మార్కెట్ తో పాటు మహబూబాబాద్ కేసముద్రం వ్యవసాయ మార్కెట్లను మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించనున్నారు.
తాజావార్తలు
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!