Ginning Mills: రెండో రోజు కొనసాగుతున్న.. రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్ల బంద్..
- రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్ల బంద్
- రాష్ట్రవ్యాప్తంగా 322 మిల్లులు బందులో పాల్గొన్నాయి
- రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన సుమారు మూడు లక్షల ఇరవై వేల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీసీఐ ప్రవేశపెట్టిన నూతన నిబంధనల నేపథ్యంలో కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ బందుకు పిలుపునిచ్చారు. దీంతో రెండో రోజు రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్ల బంద్ కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ తో పాటు అన్ని మార్కెట్ లో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 322 మిల్లులు బందులో పాల్గొన్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన సుమారు మూడు లక్షల ఇరవై వేల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు. అందులో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సుమారు పదివేల క్వింటాళ్ల పత్తి కొనుగోలు నిలిచిపోయింది.
Also Read:Umar: ఢిల్లీ బ్లాస్ట్కు ముందు ఏం జరిగింది.. వెలుగులోకి ఉమర్ సంచలన వీడియో
Also Read
ప్రభుత్వం తమ వినతులపై శ్రద్ధ వహించే వరకు బంద్ కొనసాగుతుందని కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మినేని రవీందర్ రెడ్డి తెలిపారు. కపాస్ కిసాన్ యాప్లో నమోదు చేసుకుని స్లాట్ బుకింగ్ మిల్లుల్లో అమ్మకాలు చేయడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారని వ్యాపారులు చెబుతున్నారు. జిన్నింగ్ మిల్లులను ఎల్1, ఎల్2, ఎల్ 3 ఇలా 12 కేటగిరీలుగా విభజించడం వల్ల ఇటు మిల్లర్లకు అటు రైతులకు నష్టం జరుగుతుందంటున్నారు వ్యాపారులు. జిన్నింగ్ మిల్ అసోసియేషన్ బందుకు రైతులు సహకరిస్తున్నారని వ్యాపారులు అంటున్నారు. ఆసియాలోనే అతిపెద్ద రెండో వ్యవసాయ మార్కెట్ అయిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ప్రతిరోజు 15000 బస్తాల పత్తి అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి.
Also Read:IT Raids: హైదరాబాద్ లో ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ రైడ్స్.. ఏకకాలంలో 15 చోట్ల..
పత్తి వ్యాపారుల బంద్ నేపథ్యంలో.. తీసిన పత్తిని అమ్ముకోలేక ఇబ్బంది పడనున్న పత్తి రైతులు.. ఇప్పటికే అకాల వర్షాలతో దిగుబడి తగ్గిపోవడం తేమ ఇతర కారణాలతో ఇబ్బంది పడుతున్న రైతులకు పత్తి కొనుగోలు నిలిచిపోవడంతో మరింత భారం పడుతుంది. పత్తి రైతుల ఇబ్బందులపై బిఆర్ ఎస్ స్పందించింది. పత్తి రైతులకు మద్దతుగా బిఆర్ ఎస్ నేతలు మార్కెట్ బాట పట్టారు. నేడు ఎనుమాముల మార్కెట్ తో పాటు మహబూబాబాద్ కేసముద్రం వ్యవసాయ మార్కెట్లను మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించనున్నారు.
తాజావార్తలు
-
PM Modi: ఎల్లుండి నుంచి 5 విదేశాల్లో పర్యటించనున్న మోడీ
-
Maa Inti Bangaram: ఖుషీ అవుతున్న సమంత ఫాన్స్.. ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ అప్పుడే!
-
Trump China Visit: చైనాలో ల్యాండైన ట్రంప్.. అగ్ర దేశాల భేటీపై ప్రపంచ దృష్టి..
-
Chanakya Niti: ఓర్వలేని చుట్టాలకు చెక్ పెట్టే చాణక్య నీతి.. రాబంధువుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండిలా!
-
Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!