అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు అవసరమే కానీ, డబ్బు సంపాదించేందుకు మానవ అవయవాలతో వ్యాపారం చేయడం తప్పే కదా. అమాయకులకు డబ్బు ఎరగా చూపి దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు వ్యక్తులు. అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసు సంచలనం సృష్టిస్తోంది. నిందితుల రిమాండ్ రిపొర్టు లో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. రెండు అక్రమ కిడ్నీ ఆపరేషన్లను గ్లోబల్ ఆసుపత్రి కేంద్రంగా చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. నిందితులు ఒక్కో కిడ్నీ నీ పాతిక లక్షల అమ్మకానికి పెట్టినట్లు తెలిపారు. […]
తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్ కు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం రూ.కోటి 20 లక్షల నజరానా ఇస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. హన్మకొండ స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభంలో మంత్రి వాకిటి శ్రీహరి ఈ ప్రకటన చేశారు. టోక్యోలో జరుగుతున్న డెఫ్లంపిక్స్లో హైదరాబాద్కు చెందిన షూటర్ ధనుష్ శ్రీకాంత్ గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. పురుషుల విభాగంలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పోటీలో ధనుష్ శ్రీకాంత్ ఈ ఘనత సాధించాడు. […]
కలియుగ దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది వస్తుంటారు. తమ కష్టాలను కడతేర్చమని, ఐష్టైశ్వర్యాలు ప్రసాదించమని కోరుకుంటూ శ్రీవారికి కానుకలు సమర్పించుకుంటారు. వచ్చే ఏడాది తిరుమలకు వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్తను అందించింది. ఎల్లుండి నుంచి ఆన్ లైన్ లో 2026 పిభ్రవరి నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల చేయ్యనున్నట్లు టిటిడి ప్రకటించింది. ఎల్లుండి ఉదయం లక్కిడిఫ్ లో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చెయ్యనున్నది. […]
‘ఐబొమ్మ’ అనే వెబ్ సైట్ దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి పరిచయమే.. అయితే దీని వల్ల సినిమా ఇండస్ట్రీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ‘ఐబొమ్మ’ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రవిని నాంపల్లి కోర్టుకు తరలించి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. విచారించిన […]
ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి, సన్ ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూరిజం మేనేజ్ మెంట్ మధ్య 2025 నవంబర్ 14-15 తేదీల్లో జరిగిన భాగస్వామ్య సదస్సు సందర్భంగా ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, సన్ ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూరిజం మేనేజ్ మెంట్ సంస్థ విశాఖపట్నం నగరం, జిల్లాలో రూ. 150 కోట్లకు పైగా పెట్టుబడితో ఒక మేనేజ్ మెంట్ ఇన్ స్టిట్యూట్ హోటల్ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేయాలని […]
ప్రముఖ టెలికాం కంపెనీ జియో తన కస్టమర్ల కోసం క్రేజీ ప్లాన్స్ ను తీసుకొస్తోంది. డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, ఓటీటీ సబ్ స్క్రిప్షన్ లతో కూడిన ప్లాన్స్ ను అందిస్తోంది. అయితే జియోలో 84 రోజుల వ్యాలిడిటీతో అద్భుతమైన ప్లాన్ అందుబాటులో ఉంది. జియో రూ. 448 వాయిస్ ఆన్ ప్లాన్ మీకు ఉత్తమ ఎంపిక కావచ్చు. ఇంటర్నెట్ యాక్సెస్ కంటే కాల్ చేయడానికి ఇష్టపడే వారి కోసం ఇది ప్రవేశపెట్టింది. Also Read:Hindupuram: వైసీపీ […]
ప్రధానమంత్రి కిసాన్ యోజన లాగే, ప్రధానమంత్రి కిసాన్ మంధన్ యోజన (PM-KISAN ) కూడా చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూర్చే భారత ప్రభుత్వ పథకం. ఈ పథకం వృద్ధాప్యంలో ఆర్థిక సహాయం అందిస్తుంది. దేశానికి అన్నం పెట్టడానికి కష్టపడి పనిచేసే రైతులకు పదవీ విరమణ తర్వాత నెలవారీ ఆదాయ వనరు ఉండేలా చూడటం ఈ పథకం లక్ష్యం. ఇది నెలవారీ ఆదాయం ఒత్తిడి నుండి వారిని విముక్తి చేస్తుంది. వృద్ధాప్యం కోసం తక్కువ పొదుపు లేదా […]
స్మార్ట్ ఫోన్స్ బడ్జెట్ ధరల్లోనే అందుబాటులో ఉంటున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో తక్కువ ధరకే 5G ఫోన్లు లభిస్తున్నాయి. రూ. 15 వేల బడ్జెట్ ధరలో క్రేజీ ఫీచర్లతో 5G స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ బడ్జెట్లో పవర్ ఫుల్ బ్యాటరీలతో పాటు, అద్భుతమైన ఫీచర్లు, బిగ్ డిస్ప్లే, బెస్ట్ కెమెరాను అందించే ఐదు ఉత్తమ 5G ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో Samsung, Motorola, Vivo, Realme నుంచి స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. […]
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ WTC ఛాంపియన్స్ దక్షిణాఫ్రికా అద్భుతమైన ప్రదర్శన చేసింది. తొలి టెస్ట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా భారత్ను 30 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో, దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. సైమన్ హార్మర్ అద్భుతంగా బౌలింగ్ చేసి, మొదటి టెస్ట్లో మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు. భారత్- దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్ట్ల సిరీస్లో మొదటి మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగింది. Also Read:HYD: దాంపత్యాలు […]
బీహార్లో కొత్తగా ఎన్నికైన 18వ శాసనసభ గతంలో ఎన్నడూ లేనంతగా రిచ్ అయిపోయింది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే మిలియనీర్ ఎమ్మెల్యేల సంఖ్య పెరగడమే కాకుండా, సభ్యుల సగటు సంపద కూడా దాదాపు రెట్టింపు అయింది. 243 మంది ఎమ్మెల్యేలలో 218 మంది మిలియనీర్లు, మొత్తం ఎమ్మెల్యేలలో దాదాపు 90 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మునుపటి కాలంలో, ఈ సంఖ్య 194, ఇది మొత్తంలో 81 శాతం. ఈసారి, మిలియనీర్ ఎమ్మెల్యేల సంఖ్య 9 శాతం పెరిగింది. Also […]