Veerababu Burugadda
Author- NTV Telugu-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
జోష్ హేజిల్వుడ్ దాదాపు 13 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టెస్ట్ క్రికెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. హ్యామ్స్ట్రింగ్ గాయం, అలాగే కాలి మడమ వెనుక భాగంలో గల నరాల్లో నొప్పి వంటి సమస్యల కారణంగా ఆయన సుదీర్ఘకాలం పాటు టెస్టు మ్యాచ్లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే ఇటీవలి కాలంలో కఠినమైన ప్రాక్టీస్ సెషన్లు, బౌలింగ్ సిమ్యులేషన్స్ పూర్తి చేసుకుని, ఆగస్టు 13 నుంచి బంగ్లాదేశ్తో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్లో ఆడేందుకు హేజిల్వుడ్ సంపూర్ణ ఫిట్నెస్తో […] -
IND Vs PAK: పాకిస్థాన్పై భారత్ ఘన విజయం.. ధావన్ హాఫ్ సెంచరీతో మెరుపులు..
జాంబియా వేదికగా జరుగుతున్న ఏషియన్ లీజెండ్స్ లీగ్లో ఇండియన్ రాయల్స్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో పాకిస్థాన్ ప్యాంథర్స్ జట్టును 2 వికెట్ల తేడాతో భారత్ ఓడించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ లీజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి, భారత్ ముందు 168 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. పాకిస్థాన్ తరఫున ఇమ్రాన్ నజీర్ 29 బంతుల్లో 47 పరుగులతో రాణించగా, […] -
New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఐకూ (iQOO) భారత మార్కెట్లో తన ఉనికిని వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల ఐకూ Z11 లైట్ను విడుదల చేసిన కంపెనీ, ఇప్పుడు భారత వినియోగదారుల ముందుకు iQOO Z11 మోడల్ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని ఐకూ ఇండియా సీఈఓ నిపుణ్ మార్యా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా పరోక్షంగా సూచించారు. ఆయన చేసిన ఒక ఆసక్తికర పోస్ట్లోని లైన్ల మొదటి అక్షరాలను కలిపితే “Z11” అని వస్తుండటంతో ఈ […] -
YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ సాగిస్తున్న రాజకీయ కక్షసాధింపు చర్యలు, పోలీసుల అరాచకాలు ప్రజాస్వామ్యాన్నే హాస్యాస్పదం చేస్తున్నాయని.. అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడితే వారికి రక్షణ కల్పిస్తూ, దాడికి గురైన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనే అక్రమ కేసులు బనాయించడం ఏ రకమైన న్యాయం? ప్రజాప్రతినిధులు బాధితులకు అండగా నిలబడితే వారిపై కూడా కేసులు పెడుతూ, ప్రశ్నించిన వారి తలుపులు అర్ధరాత్రి బద్దలుకొట్టి అరెస్టులు చేయడం పోలీసు రాజ్యానికి పరాకాష్ట అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ […] -
Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
బీహార్లోని పూర్ణియా నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్పై ఢిల్లీలో దాడి యత్నం తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహిస్తుండగా ఈ దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. పార్లమెంట్ కాంప్లెక్స్లో రామ్ ఆలయ విరాళాల చోరీకి సంబంధించిన స్కిట్ చేసిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. ఎంపీ నివాసంలో ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో ఒక అపరిచిత వ్యక్తి పప్పు యాదవ్పైకి షూ విసరడంతో […] -
Food Delivery: జొమాటో, స్విగ్గీలకు ఊహించని షాక్.. ఫుడ్ డెలివరీ రేసులోకి అడుగుపెట్టిన ‘షాపింగ్’ కింగ్..
వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్కార్ట్.. స్విగ్గీ, జొమాటోలకు పోటీగా బెంగళూరులో త్వరలోనే తన ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు 15 నాటికి ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనికోసం కంపెనీ ఇప్పటికే నగరవ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్ భాగస్వాములను చేర్చుకోవడం ప్రారంభించింది. ఇతర ప్లాట్ఫారమ్లు సాధారణంగా 16 నుంచి 30 శాతం వరకు కమిషన్ వసూలు చేస్తుండగా, ఫ్లిప్కార్ట్ మాత్రం కేవలం 10 శాతం కమిషన్నే ఆఫర్ చేస్తూ రెస్టారెంట్లను ఆకట్టుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం […] -
Yuvraj Singh: యువరాజ్ ‘యువి’ పేరు వాడుతున్నారా..? ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు..
ఢిల్లీ హైకోర్టు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్కు బిగ్ రిలీఫ్ ఇస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటో, వాయిస్, వ్యక్తిత్వానికి సంబంధించిన గుర్తింపులను వ్యాపార పరంగా లేదా వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించకుండా మూడో వ్యక్తులపై నిషేధం విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో భాగంగానే ఆయన పేరుతో వస్తువులను విక్రయించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో రూపొందించే ‘డీప్ఫేక్’ కంటెంట్ను తయారు చేసి వ్యాప్తి చేయడంపై […] -
Jasprit Bumrah: బుమ్రాకు ఏమైంది..? ఎందుకు సిరీస్ నుంచి దూరమయ్యాడు..? కారణం ఇదే..
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎడమ మోకాలి గాయం కారణంగా శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్కు పూర్తిగా దూరమయ్యాడు. ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా ఆయన మోకాలికి తీవ్ర గాయమైంది. ఆ తర్వాత లార్డ్స్ వన్డేకు దూరమైన బుమ్రా, బెంగళూరులోని బీసీసీఐ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) వద్ద పునరావాసం పొందుతున్నప్పటికీ, కోలుకునే క్రమంలో ఇంకా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఫిట్నెస్ పరీక్షల్లో పూర్తిగా కోలుకోకపోవడంతో, రాబోయే బిజీ షెడ్యూల్ను […] -
Electric Vehicles: 2029 తర్వాత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకే రిజిస్ట్రేషన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
2029 తర్వాత దేశంలో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే రిజిస్ట్రేషన్ చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్లో కీటో మోటార్స్ ఈవీ బస్సును తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టే లక్ష్యంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈవీల వల్ల పర్యావరణ […] -
AP Govt: ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త.. రూ. 50 వేల వరకు వడ్డీ లేని రుణం..
ఆంధ్రప్రదేశ్లోని ఎఫ్సీవీ పొగాకు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారీ ఉపశమనం ప్రకటించాయి. ఈ ఏడాది అనుమతించిన దానికంటే ఎక్కువ ఉత్పత్తి రావడం, అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో ధరలు పడిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ న్యూఢిల్లీలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ, టొబాకో బోర్డు , ప్రజాప్రతినిధులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు […]
తాజావార్తలు
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్గా ఇలా చేయండి!
-
Petrol-Diesel Price: హార్ముజ్లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!