AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీ-ఫుడ్ ఎక్స్పోర్ట్స్ వర్క్షాప్లో పాల్గొని, రాష్ట్రంలో ఆక్వా రంగం ప్రాధాన్యతను, బ్లూ ఎకానమీ ద్వారా సాధించగల ఆర్థిక వృద్ధిని వివరించారు. భవిష్యత్తు అంతా బ్లూ ఎకానమీదేనని స్పష్టం చేసిన ఆయన, ఇది కేవలం కాగితాలకే పరిమితం కాకుండా సముద్రం మీద రాతలా బలంగా సాగాలని ఆకాంక్షించారు.
పెట్టుబడిదారులకు భరోసా..
రాష్ట్రంపై నమ్మకంతో ఇన్నోవేషన్స్తో ముందుకు వచ్చే పెట్టుబడిదారులకు తాను ఎల్లప్పుడూ ఒక ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటానని సీఎం భరోసా ఇచ్చారు. అలాగే కాకినాడ పోర్ట్ మోడ్రనైజేషన్ (ఆధునీకరణ) చేస్తామని ప్రకటించిన కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్కు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర మత్స్య శాఖ ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేవలం 15 రోజుల్లోనే కేటాయిస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.
Also Read
- Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
- Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
- VVS Laxman: ఆ పదాన్ని వాడితే ఊరుకునేది లేదు... వీవీఎస్ లక్ష్మణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- Vaibhav Sooryavanshi: హెల్మెట్ పగిలేలా బంతి విసురుతా... వైభవ్ సూర్యవంశీకి షాకింగ్ ఛాలెంజ్..
దేశ ఆక్వా రంగంలో ఏపీ తిరుగులేని రారాజు..
భారతదేశ సముద్ర ఆహార రంగంలో ఆంధ్రప్రదేశ్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని సీఎం చంద్రబాబు గణాంకాలతో సహా వివరించారు. దేశంలో సీ-ఫుడ్ ఉత్పత్తిలో ఏపీ రెండో అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 197 లక్షల మెట్రిక్ టన్నుల సీ-ఫుడ్ ఉత్పత్తి జరుగుతోంది. భారతదేశం మొత్తం చేపల ఉత్పత్తిలో ఏపీ వాటా 28 శాతం కాగా, రొయ్యల ఉత్పత్తిలో ఏకంగా 66 శాతం వాటాతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. దేశ సముద్ర ఆహార ఎగుమతుల్లో 38 శాతం ఆదాయం ఒక్క ఏపీ నుంచే వస్తోంది. దీని ద్వారా రాష్ట్రం నుంచి ఏటా రూ. 28,000 కోట్లకు పైగా ఎగుమతులు జరుగుతున్నాయి.
అంతర్జాతీయ అవకాశాలు..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరిగే సీ-ఫుడ్ బిజినెస్లో భారతదేశ వాటా కేవలం 5 శాతం మాత్రమే ఉందని, అయితే ఈ రంగంలో దేశానికి ఇంకా పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. ఏపీలో ఆక్వా రంగాన్ని మరింత బలోపేతం చేసి, బ్లూ ఎకానమీని పెంచడం ద్వారా దేశ ప్రగతికి ఎంతగానో దోహదపడవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగంలో మరిన్ని ఆవిష్కరణలు (ఇన్నోవేషన్స్) చేస్తే, భారతదేశ బ్లూ ఎకానమీ నిస్సందేహంగా ప్రపంచస్థాయిలో ముందుకు సాగుతుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Ramayana Release Twist: ‘రామాయణ’ రిలీజ్పై బిగ్ ట్విస్ట్.. ఓవర్సీస్లో ముందుగా, ఇండియాలో ఆలస్యంగా!
-
Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!