AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీ-ఫుడ్ ఎక్స్పోర్ట్స్ వర్క్షాప్లో పాల్గొని, రాష్ట్రంలో ఆక్వా రంగం ప్రాధాన్యతను, బ్లూ ఎకానమీ ద్వారా సాధించగల ఆర్థిక వృద్ధిని వివరించారు. భవిష్యత్తు అంతా బ్లూ ఎకానమీదేనని స్పష్టం చేసిన ఆయన, ఇది కేవలం కాగితాలకే పరిమితం కాకుండా సముద్రం మీద రాతలా బలంగా సాగాలని ఆకాంక్షించారు.
పెట్టుబడిదారులకు భరోసా..
రాష్ట్రంపై నమ్మకంతో ఇన్నోవేషన్స్తో ముందుకు వచ్చే పెట్టుబడిదారులకు తాను ఎల్లప్పుడూ ఒక ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటానని సీఎం భరోసా ఇచ్చారు. అలాగే కాకినాడ పోర్ట్ మోడ్రనైజేషన్ (ఆధునీకరణ) చేస్తామని ప్రకటించిన కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్కు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర మత్స్య శాఖ ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేవలం 15 రోజుల్లోనే కేటాయిస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.
Also Read
- Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
దేశ ఆక్వా రంగంలో ఏపీ తిరుగులేని రారాజు..
భారతదేశ సముద్ర ఆహార రంగంలో ఆంధ్రప్రదేశ్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని సీఎం చంద్రబాబు గణాంకాలతో సహా వివరించారు. దేశంలో సీ-ఫుడ్ ఉత్పత్తిలో ఏపీ రెండో అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 197 లక్షల మెట్రిక్ టన్నుల సీ-ఫుడ్ ఉత్పత్తి జరుగుతోంది. భారతదేశం మొత్తం చేపల ఉత్పత్తిలో ఏపీ వాటా 28 శాతం కాగా, రొయ్యల ఉత్పత్తిలో ఏకంగా 66 శాతం వాటాతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. దేశ సముద్ర ఆహార ఎగుమతుల్లో 38 శాతం ఆదాయం ఒక్క ఏపీ నుంచే వస్తోంది. దీని ద్వారా రాష్ట్రం నుంచి ఏటా రూ. 28,000 కోట్లకు పైగా ఎగుమతులు జరుగుతున్నాయి.
అంతర్జాతీయ అవకాశాలు..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరిగే సీ-ఫుడ్ బిజినెస్లో భారతదేశ వాటా కేవలం 5 శాతం మాత్రమే ఉందని, అయితే ఈ రంగంలో దేశానికి ఇంకా పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. ఏపీలో ఆక్వా రంగాన్ని మరింత బలోపేతం చేసి, బ్లూ ఎకానమీని పెంచడం ద్వారా దేశ ప్రగతికి ఎంతగానో దోహదపడవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగంలో మరిన్ని ఆవిష్కరణలు (ఇన్నోవేషన్స్) చేస్తే, భారతదేశ బ్లూ ఎకానమీ నిస్సందేహంగా ప్రపంచస్థాయిలో ముందుకు సాగుతుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Lorcan Tucker: టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచామా?.. నేను ఇంకా నమ్మలేకపోతున్నా!
-
God Of War : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న Jr. NTR – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’
-
Peddi OTT Release: రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పుడు ఇంట్లోనే.. కానీ ఈ ఒక్క భాషకు వెయిటింగ్ తప్పదు!
-
Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
-
Vastu Tips: ఇంట్లో పాత క్యాలెండర్లు ఇంకా ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం ఇది మంచిదేనా?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!