Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
- అసిమ్ మునీర్కు జనాభా నియంత్రణ కమిటీలో సభ్యత్వం.
- వేగంగా పెరుగుతున్న జనాభాపై పాక్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.
- 2030 నాటికి ప్రపంచంలో నాలుగో అత్యధిక జనాభా కలిగిన దేశంగా పాకిస్థాన్.
- నిర్ణయంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అధికారంగా సైనిక బాధ్యతలు చూస్తున్నారు. ఇదే కాకుండా పాక్ ప్రభుత్వంతో ఈయన చెప్పిందే వేదం. పాకిస్తాన్ ప్రధాని కూడా ఈయన మాట వినాల్సిందే. అలాంటి అసిమ్ మునీర్కు పాకిస్తాన్ కొత్త బాధ్యతను అప్పగించింది. ఇప్పుడు పాకిస్తాన్లో అదుపు లేకుండా పెరుగుతున్న జనాభాను కట్టడి చేసే బాధ్యత తీసుకోబోతున్నారు.
పాక్ మీడియా నివేదికల ప్రకారం.. ఈ వారంలో జరిగి సెనెట్ సమావేశంలో పాకిస్తాన్ ఆరోగ్య మంత్రి సయ్యద్ ముస్తఫా కమల్ మాట్లాడుతూ.. జనాభాను నియంత్రించే ఉన్నత స్థాయి కమిటీలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం చోటు కల్పించిందని చెప్పాడు. 25.9 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే 5వ అత్యధిక జనాభా కలిగిన దేశంగా పాకిస్తాన్ ఉంది. 2030 నాటికి ఇండోనేషియాను అధిగమించి నాలుగో స్థానంలోకి వస్తుందని అంచనా. పాకిస్తాన్లో పెరుగుతున్న జనాభాను ప్రభుత్వం జాతీయ ప్రాధాన్యతా అంశంగా భావిస్తోందని ఆరోగ్య మంత్రి వెల్లడించారు. కీలక విధాన నిర్ణయాలు తీసుకునే ప్రత్యేక కమిటిని ఏర్పాటు చేయగా, అందులో అసిమ్ మునీర్ను సభ్యుడిగా నియమించింది.
Also Read
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- China: షిప్యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
- Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
- Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో తిరుగుబాటుదారులు పాక్ ఆర్మీని, పోలీసుల్ని హతమారుస్తున్నారు. మరోవైపు పీఓకేలో జనం తిరగబడుతున్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ), పాక్ తాలిబాన్ల దాడులకు పాక్ ఆర్మీ కూడా భయపడుతోంది. ఇలాంటి సమయంలో సైనిక బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అసిమ్ మునీర్, జనాభా నియంత్రణ కమిటీలో చేరాడు. దీనిపై పాక్ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ‘‘జనాభా నియంత్రణకు అసిమ్ మునీర్ ఏం చేస్తారు.? కండోమ్లు పంచుతారా?’’ అని సెటైర్ వేశారు.
పాకిస్తాన్లో ప్రతీ ఏడాది సుమారు 67 లక్షల జననాలు నమోదవుతున్నాయి. గర్భనిరోధక సాధానాల వినియోగం ప్రోత్సహించడం, కండోమ్ వంటి వాటిపై పన్ను రాయితీలు ఇవ్వడం, రాష్ట్రాలకు నిధుల పంపిణీ విధానంలో మార్పులు చేయడం వంటి చర్యల్ని పాక్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుత రేటుతో జననాలు పెరిగే, పాక్ ఆర్థిక వనరులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆ దేశ ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?