Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
- అసిమ్ మునీర్కు జనాభా నియంత్రణ కమిటీలో సభ్యత్వం.
- వేగంగా పెరుగుతున్న జనాభాపై పాక్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.
- 2030 నాటికి ప్రపంచంలో నాలుగో అత్యధిక జనాభా కలిగిన దేశంగా పాకిస్థాన్.
- నిర్ణయంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అధికారంగా సైనిక బాధ్యతలు చూస్తున్నారు. ఇదే కాకుండా పాక్ ప్రభుత్వంతో ఈయన చెప్పిందే వేదం. పాకిస్తాన్ ప్రధాని కూడా ఈయన మాట వినాల్సిందే. అలాంటి అసిమ్ మునీర్కు పాకిస్తాన్ కొత్త బాధ్యతను అప్పగించింది. ఇప్పుడు పాకిస్తాన్లో అదుపు లేకుండా పెరుగుతున్న జనాభాను కట్టడి చేసే బాధ్యత తీసుకోబోతున్నారు.
పాక్ మీడియా నివేదికల ప్రకారం.. ఈ వారంలో జరిగి సెనెట్ సమావేశంలో పాకిస్తాన్ ఆరోగ్య మంత్రి సయ్యద్ ముస్తఫా కమల్ మాట్లాడుతూ.. జనాభాను నియంత్రించే ఉన్నత స్థాయి కమిటీలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం చోటు కల్పించిందని చెప్పాడు. 25.9 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే 5వ అత్యధిక జనాభా కలిగిన దేశంగా పాకిస్తాన్ ఉంది. 2030 నాటికి ఇండోనేషియాను అధిగమించి నాలుగో స్థానంలోకి వస్తుందని అంచనా. పాకిస్తాన్లో పెరుగుతున్న జనాభాను ప్రభుత్వం జాతీయ ప్రాధాన్యతా అంశంగా భావిస్తోందని ఆరోగ్య మంత్రి వెల్లడించారు. కీలక విధాన నిర్ణయాలు తీసుకునే ప్రత్యేక కమిటిని ఏర్పాటు చేయగా, అందులో అసిమ్ మునీర్ను సభ్యుడిగా నియమించింది.
Also Read
- Tarique Rahman: శాంతించిన తారిఖ్ రెహమాన్.. ఎల్లుండి భారత్లో పర్యటన!
- Asim Munir: పాక్ సైన్యంపై అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ.. దేనికోసమో..!
- Earthquakes: ఒక భూకంపం మరో భూకంపాన్ని ప్రేరేపిస్తుందా? ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనల వెనుక అసలు కారణం ఇదే..!
- Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో తిరుగుబాటుదారులు పాక్ ఆర్మీని, పోలీసుల్ని హతమారుస్తున్నారు. మరోవైపు పీఓకేలో జనం తిరగబడుతున్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ), పాక్ తాలిబాన్ల దాడులకు పాక్ ఆర్మీ కూడా భయపడుతోంది. ఇలాంటి సమయంలో సైనిక బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అసిమ్ మునీర్, జనాభా నియంత్రణ కమిటీలో చేరాడు. దీనిపై పాక్ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ‘‘జనాభా నియంత్రణకు అసిమ్ మునీర్ ఏం చేస్తారు.? కండోమ్లు పంచుతారా?’’ అని సెటైర్ వేశారు.
పాకిస్తాన్లో ప్రతీ ఏడాది సుమారు 67 లక్షల జననాలు నమోదవుతున్నాయి. గర్భనిరోధక సాధానాల వినియోగం ప్రోత్సహించడం, కండోమ్ వంటి వాటిపై పన్ను రాయితీలు ఇవ్వడం, రాష్ట్రాలకు నిధుల పంపిణీ విధానంలో మార్పులు చేయడం వంటి చర్యల్ని పాక్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుత రేటుతో జననాలు పెరిగే, పాక్ ఆర్థిక వనరులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆ దేశ ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
BJP: రాహుల్ గాంధీ డ్రామాలు వీడియోల కోసమే.. బీజేపీ నేతల విమర్శలు..
-
Tarique Rahman: శాంతించిన తారిఖ్ రెహమాన్.. ఎల్లుండి భారత్లో పర్యటన!
-
CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..
-
Asim Munir: పాక్ సైన్యంపై అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ.. దేనికోసమో..!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!