Veerababu Burugadda
Author- NTV Telugu-
PCB: కీలక నిర్ణయం తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్..
పాకిస్తాన్ క్రికెట్ జట్టు వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న వేళ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాటర్ల పేలవ ప్రదర్శనను అరికట్టేందుకు దక్షిణాఫ్రికా మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ మైక్ స్మిత్ను జాతీయ జట్టు కొత్త బ్యాటింగ్ కోచ్గా నియమించింది. లెవెల్-4 కోచ్ అయిన స్మిత్కు టీ20 ఫ్రాంచైజ్ లీగ్లలో, ముఖ్యంగా పీఎస్ఎల్ జట్లతో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. విండీస్ పర్యటనలో తాత్కాలిక కోచ్గా వ్యవహరిస్తున్న జాతీయ సెలక్టర్ అసద్ షఫీక్ స్థానంలో […] -
Semi Final: సెమీఫైనల్కు తిలక్ వర్మ, రజత్ పాటిదార్.. అందరి కళ్లు వైభవ్ బ్యాటింగ్పైనే..
భారత దేశవాళీ క్రికెట్ సీజన్ ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్కు దలీప్ ట్రోఫీ రెడ్ బాల్ టోర్నమెంట్తో అరంగేట్రం లభిస్తోంది. ఆగస్టు 23 నుండి సెప్టెంబర్ 10 వరకు సాగే ఈ టోర్నీలో మొత్తం 6 జోనల్ జట్లు పోటీపడుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ రజత్ పటిదార్ నేతృత్వంలోని సెంట్రల్ జోన్, రన్నరప్ తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్ జోన్ జట్లు నేరుగా సెమీఫైనల్స్కు అర్హత సాధించాయి. మిగిలిన ఈస్ట్ జోన్, నార్త్ ఈస్ట్ […] -
Indian Origin Cricketer: ఆ క్రికెటర్కు బిగ్షాక్ ఇచ్చిన ఐసీసీ.. 8 ఏళ్లు నిషేధం..
అమెరికాకు చెందిన 26 ఏళ్ల భారత సంతతి క్రికెటర్ బొడుగుమ్ అఖిలేష్ రెడ్డిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కఠిన చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు రుజువు కావడంతో అతడిపై ఎనిమిదేళ్లపాటు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. 2025 అబుదాబి T10 టోర్నమెంట్లో ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అతడిని దోషిగా నిర్ధారించారు. ఈ నిషేధం నవంబర్ 21, 2025 నుండి అమల్లోకి వచ్చినట్లు పరిగణించబడుతుంది. అప్పుడే అతడిపై తాత్కాలిక నిలిపివేత వేటు […] -
Madhya Pradesh: ప్రచారంలో నరోత్తమ్ మిశ్రా కన్నీళ్లు.. దతియాలో కాంగ్రెస్ విజయానికి కారణం ఏంటి..?
మధ్యప్రదేశ్లోని దతియా అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతిపై అనర్హత వేటు పడటం వల్ల ఉపఎన్నిక అనివార్యమైంది. 2015 నాటి బ్యాంక్ మోసం కేసులో ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష , రూ.1 లక్ష జరిమానా విధించింది. ఈ తీర్పు ఆధారంగా ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ సెక్రటేరియట్ ఏప్రిల్ 2026లో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసి, దతియా స్థానాన్ని ఖాళీగా ప్రకటించింది. ఈ క్రమంలో ఖాళీ అయిన స్థానానికి […] -
Bypoll Elections: అభ్యర్థుల మార్పే ముంచేసిందా..? బీజేపీ వ్యూహం ఎక్కడ తిరగబడింది..?
బిహార్లోని బాంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా అసెంబ్లీ నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న ఉపఎన్నికల ఓటములు భారతీయ జనతా పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలతను తెచ్చిపెట్టాయి. వరుసగా రెండు వారాల వ్యవధిలోనే పేపర్ లీకేజీ నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం, ఇప్పుడు సొంత పాలనలో ఉన్న రెండు కీలక రాష్ట్రాల ఉపఎన్నికల్లో ఓడిపోవడం పార్టీ నాయకత్వాన్ని ఆత్మపరిశీలనలో పడేసింది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలకే ఉపఎన్నికల్లో సానుకూల ఫలితాలు వస్తుంటాయి. గుజరాత్లోని మంజల్పూర్లో భాజపా భారీ మెజారిటీతో […] -
Team India: టీమిండియాను వదిలి వెళ్లాలంటే బాధగా ఉంది.. ‘కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నా’..
భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్గా సుదీర్ఘకాలం సేవలందించిన టి. దిలీప్ దాదాపు ఐదేళ్ల తన పదవీకాలాన్ని విజయవంతంగా ముగించుకుని టీమిండియా నుంచి వైదొలిగారు. 2021 నవంబర్లో భారత జట్టు సెటప్లోకి అడుగుపెట్టిన ఆయన స్థానంలో బీసీసీఐ శుభదీప్ ఘోష్ను కొత్త ఫీల్డింగ్ కోచ్గా నియమించింది. ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే శ్రీలంక టెస్టు సిరీస్ శుభదీప్కు మొదటి అసైన్మెంట్ కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియాతో ఐదేళ్ల అనుబంధం ముగియడంపై టి. దిలీప్ సోషల్ మీడియా వేదికగా […] -
2011 World Cup Final: 2011 వరల్డ్ కప్ ఫైనల్ సిక్స్.. ధోనీ సీక్రెట్ బయటపెట్టిన శ్రీలంక బౌలర్..
2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ సాధించిన చారిత్రాత్మక విజయం, ఆ జ్ఞాపకాలపై శ్రీలంక మాజీ పేసర్ నువాన్ కులశేఖర పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఆ ఫైనల్ మ్యాచ్లో కులశేఖర వేసిన బంతిని ధోనీ లాంగాన్ మీదుగా సిక్సర్గా మలచి భారత్కు 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ను అందించిన సంగతి తెలిసిందే. ఆ సిక్స్ తనను ఎంతో బాధించినప్పటికీ, ధోనీని ఒక గొప్ప వ్యక్తిగా కులశేఖర అభివర్ణించారు. ప్రపంచకప్ ముగిసిన […] -
Amazon Sale: అమేజాన్ ‘గ్రేట్ ఫ్రీడమ్ సేల్’లో అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్లపై ఏకంగా రూ.10 వేలు తగ్గింపు..
అమేజాన్ ‘గ్రేట్ ఫ్రీడమ్ సేల్’ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సేల్లో ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ‘వన్ ప్లస్’కి చెందిన పలు మోడళ్లపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. ముఖ్యంగా వన్ ప్లస్ ఫ్లాగ్షిప్ ఫోన్లతో పాటు నార్డ్ సిరీస్ మోడళ్లపై ఏకంగా రూ.10,000 వరకు తగ్గింపు లభిస్తుండటం గమనార్హం. ఈ సేల్లో లభించే ప్రధాన ఆఫర్లు , స్మార్ట్ఫోన్ల వివరాలు ఇలా ఉన్నాయి. వన్ ప్లస్ 13Sపై భారీ తగ్గింపు: ఈ సేల్లోనే అతిపెద్ద డిస్కౌంట్ వన్ […] -
IPL 2027: ఈ సారి ట్రోఫీ లక్ష్యంగా బరిలోకి లక్నో సూపర్ జెయింట్స్.. ఎవరూ ఊహించని కెప్టెన్..
ఐపీఎల్ 2027 సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) జట్టు నూతన నాయకుడి అన్వేషణలో ఉన్నట్లు సమాచారం. 2025, 2026 సీజన్లలో ఎల్ఎస్జీకి నాయకత్వం వహించిన వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్, జట్టు వరుస వైఫల్యాల కారణంగా విడిపోయి తిరిగి తన పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) వైపు మొగ్గు చూపాడు. దీంతో ఎల్ఎస్జీ తదుపరి కెప్టెన్ రేసులో దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ పేరు బలంగా వినిపిస్తోంది. […] -
New Railway Line: రైల్వే ప్రయాణికులకు అదిరే న్యూస్.. 17 కి.మీ మేర కొత్త రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్..
భారత్-చైనా-భూటాన్ సరిహద్దు (ట్రై-జంక్షన్) వద్ద తన రవాణా సౌకర్యాలను, వ్యూహాత్మక భద్రతను బలోపేతం చేసుకునే దిశగా భారతదేశం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఉత్తర బెంగాల్లోని ఖునియా మోర్ నుంచి జల్ధాకా వరకు 17 కిలోమీటర్ల మేర నూతన వ్యూహాత్మక రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సుమారు రూ.272 కోట్లను మంజూరు చేసింది. ఈ రైలు మార్గం చాల్సా సమీపంలోని ఖునియా మోర్ వద్ద ప్రారంభమై, జల్పైగురి, కాలింపాంగ్ అటవీ […]
తాజావార్తలు
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్గా ఇలా చేయండి!
-
Petrol-Diesel Price: హార్ముజ్లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!