Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా మే నెల ముగిసినా ఎండల తీవ్రత, వడగాల్పుల ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో చిన్న పిల్లలు, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులను జూన్ 14 వరకు పొడిగించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు జారీ కానున్నట్లు సమాచారం. జూన్ 15 నుండి ఈ కేంద్రాలు యథావిధిగా తిరిగి పనిచేయడం ప్రారంభిస్తాయి.
నిజానికి ముందస్తు ప్రణాళిక ప్రకారం జూన్ 2వ తేదీ నుంచే అంగన్వాడీ కేంద్రాలను, పాఠశాలలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. అయితే, జూన్ మొదటి వారంలో కూడా ఉష్ణోగ్రతలు 40 నుండి 45 డిగ్రీల సెల్సియస్ దాటుతుండటం, మధ్యాహ్నం వేళల్లో తీవ్రమైన ఉష్ణగాలులు వీస్తుండటంతో తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. చిన్న పిల్లలు ఎండ దెబ్బకు గురయ్యే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం.
Also Read
- Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
- Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
- Team India Injuries: టీమిండియాకు వరుస షాక్లు.. కోహ్లీ ఔట్.. రోహిత్కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
- E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
స్కూళ్లతో పాటే అంగన్వాడీలు కూడా..
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సైతం ఎండల తీవ్రత కారణంగా వేసవి సెలవులను పొడిగించిన సంగతి తెలిసిందే. పాఠశాలల మాదిరిగానే అంగన్వాడీ కేంద్రాలను కూడా జూన్ 14 వరకు మూసి ఉంచాలని, విద్యాసంస్థలతో పాటే జూన్ 15న ఒకేసారి తెరవాలని ప్రభుత్వం భావిస్తోంది.
చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ..
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే వారు 3 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలు కావడంతో వారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో వారు బయటకు వస్తే వడదెబ్బ తగిలి డీహైడ్రేషన్, జ్వరం బారిన పడే అవకాశం ఉంది. అందుకే వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ప్రభుత్వం ఈ పొడిగింపు నిర్ణయం తీసుకుంది. సెలవుల పొడిగింపు కేవలం చిన్న పిల్లల రాకకు మాత్రమే వర్తిస్తుంది. అయితే అంగన్వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలకు అందే పౌష్టికాహారం పంపిణీకి ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అంగన్వాడీ సిబ్బందితో పాటు, చిన్నారుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక మార్గదర్శకాలు, జీవో త్వరలోనే విడుదల కానున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
-
Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
-
Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
-
Team India Injuries: టీమిండియాకు వరుస షాక్లు.. కోహ్లీ ఔట్.. రోహిత్కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!