Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు.. ఉత్తర్వులు జారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా మే నెల ముగిసినా ఎండల తీవ్రత, వడగాల్పుల ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో చిన్న పిల్లలు, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులను పొడిగించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓఝ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు వేసవి సెలవులను జూన్ 13 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 14వ తేదీన ఆదివారం కావునా.. జూన్ 15 నుండి ఈ కేంద్రాలు యథావిధిగా తిరిగి పనిచేయడం ప్రారంభిస్తాయి.
నిజానికి ముందస్తు ప్రణాళిక ప్రకారం జూన్ 2వ తేదీ నుంచే అంగన్వాడీ కేంద్రాలను, పాఠశాలలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. అయితే, జూన్ మొదటి వారంలో కూడా ఉష్ణోగ్రతలు 40 నుండి 45 డిగ్రీల సెల్సియస్ దాటుతుండటం, మధ్యాహ్నం వేళల్లో తీవ్రమైన ఉష్ణగాలులు వీస్తుండటంతో తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. చిన్న పిల్లలు ఎండ దెబ్బకు గురయ్యే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది.
Also Read
- Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్వాచ్లు అందుబాటులోకి..
- Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
- Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
- UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
స్కూళ్లతో పాటే అంగన్వాడీలు కూడా..
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సైతం ఎండల తీవ్రత కారణంగా వేసవి సెలవులను పొడిగించిన సంగతి తెలిసిందే. పాఠశాలల మాదిరిగానే అంగన్వాడీ కేంద్రాలను కూడా జూన్ 14 వరకు మూసి ఉంచాలని, విద్యాసంస్థలతో పాటే జూన్ 15న ఒకేసారి తెరవాలని ప్రభుత్వం భావిస్తోంది.
చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ..
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే వారు 3 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలు కావడంతో వారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో వారు బయటకు వస్తే వడదెబ్బ తగిలి డీహైడ్రేషన్, జ్వరం బారిన పడే అవకాశం ఉంది. అందుకే వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ప్రభుత్వం ఈ పొడిగింపు నిర్ణయం తీసుకుంది. సెలవుల పొడిగింపు కేవలం చిన్న పిల్లల రాకకు మాత్రమే వర్తిస్తుంది. అయితే అంగన్వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలకు అందే పౌష్టికాహారం పంపిణీకి ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అంగన్వాడీ సిబ్బందితో పాటు, చిన్నారుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక మార్గదర్శకాలు, జీవో త్వరలోనే విడుదల కానున్నాయి.
తాజావార్తలు
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్వాచ్లు అందుబాటులోకి..
-
Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
-
Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?