Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు.. ఉత్తర్వులు జారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా మే నెల ముగిసినా ఎండల తీవ్రత, వడగాల్పుల ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో చిన్న పిల్లలు, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులను పొడిగించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓఝ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు వేసవి సెలవులను జూన్ 13 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 14వ తేదీన ఆదివారం కావునా.. జూన్ 15 నుండి ఈ కేంద్రాలు యథావిధిగా తిరిగి పనిచేయడం ప్రారంభిస్తాయి.
నిజానికి ముందస్తు ప్రణాళిక ప్రకారం జూన్ 2వ తేదీ నుంచే అంగన్వాడీ కేంద్రాలను, పాఠశాలలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. అయితే, జూన్ మొదటి వారంలో కూడా ఉష్ణోగ్రతలు 40 నుండి 45 డిగ్రీల సెల్సియస్ దాటుతుండటం, మధ్యాహ్నం వేళల్లో తీవ్రమైన ఉష్ణగాలులు వీస్తుండటంతో తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. చిన్న పిల్లలు ఎండ దెబ్బకు గురయ్యే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది.
Also Read
- 43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
- N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్మెంట్పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్పై బీజేపీ చీఫ్ ఫైర్
- 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
- TPCC: సీఎం రేవంత్రెడ్డితో మల్లు రవి భేటీ.. కొండా సురేఖ ఎపిసోడ్పై మీనాక్షి నటరాజన్, పీసీసీకి నివేదిక..
స్కూళ్లతో పాటే అంగన్వాడీలు కూడా..
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సైతం ఎండల తీవ్రత కారణంగా వేసవి సెలవులను పొడిగించిన సంగతి తెలిసిందే. పాఠశాలల మాదిరిగానే అంగన్వాడీ కేంద్రాలను కూడా జూన్ 14 వరకు మూసి ఉంచాలని, విద్యాసంస్థలతో పాటే జూన్ 15న ఒకేసారి తెరవాలని ప్రభుత్వం భావిస్తోంది.
చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ..
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే వారు 3 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలు కావడంతో వారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో వారు బయటకు వస్తే వడదెబ్బ తగిలి డీహైడ్రేషన్, జ్వరం బారిన పడే అవకాశం ఉంది. అందుకే వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ప్రభుత్వం ఈ పొడిగింపు నిర్ణయం తీసుకుంది. సెలవుల పొడిగింపు కేవలం చిన్న పిల్లల రాకకు మాత్రమే వర్తిస్తుంది. అయితే అంగన్వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలకు అందే పౌష్టికాహారం పంపిణీకి ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అంగన్వాడీ సిబ్బందితో పాటు, చిన్నారుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక మార్గదర్శకాలు, జీవో త్వరలోనే విడుదల కానున్నాయి.
తాజావార్తలు
-
Anangsha Biswas: ‘నాతో ఉండు.. కారు, ఇల్లు ఇస్తా’.. 70 ఏళ్ల నిర్మాత మాటలకు షాక్.. భయంతో పారిపోయిన నటి!
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
-
N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్మెంట్పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్పై బీజేపీ చీఫ్ ఫైర్
-
IRUMUDI Collections : ఇరుముడి మూడు రోజుల కలెక్షన్స్.. ‘బ్లాక్బస్టర్’ ఈజ్ స్మాల్ వర్డ్
ట్రెండింగ్
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!