Shreyas Iyer: వాంఖడే స్టేడియంలో శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్.. మొదటి విజయం నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాంఖడే స్టేడియంలో గురువారం జరిగిన టి20 ముంబై లీగ్ 2026 మ్యాచ్లో సోబో ముంబై ఫాల్కన్స్ జట్టు ఉత్కంఠభరిత పోరాటంలో ఎంఎస్సి మరాఠా రాయల్స్ను మూడు వికెట్ల తేడాతో ఓడించి, ఈ సీజన్లో తమ మొదటి విజయాన్ని నమోదు చేసింది. శ్రేయస్ అయ్యర్, ఆదిత్య తారే బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడటంతో ఫాల్కన్స్ జట్టు ఆఖరి ఓవర్లో విజయాన్ని అందుకుంది.
153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఫాల్కన్స్ జట్టుకు ఓపెనర్లు అదిరిపోయే ప్రారంభాన్ని ఇచ్చారు. సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ ఆదిత్య తారే కేవలం 19 బంతుల్లోనే 42 పరుగులతో విరుచుకుపడగా, ఇషాన్ మూల్చందాని 29 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగిన భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 24 బంతుల్లో 30 పరుగులు చేశాడు. దీంతో ఫాల్కన్స్ 12 ఓవర్లలో 106/2 స్కోరుతో సులభంగా గెలిచేలా కనిపించింది.
Also Read
- RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
- Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
- Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
అయితే శ్రేయస్ అయ్యర్ అవుటైన తర్వాత మ్యాచ్ మలుపు తిరిగింది. మరాఠా రాయల్స్ బౌలర్లు విజృంభించడంతో ఫాల్కన్స్ కేవలం 21 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఆ దశలో గౌతమ్ వాఘేలా 23 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచి, జట్టును విజయం వైపు నడిపించాడు. ఐదు బంతులు మిగిలి ఉండగానే ఫాల్కన్స్ లక్ష్యాన్ని ఛేదించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన మరాఠా రాయల్స్..
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన మరాఠా రాయల్స్ జట్టులో ఓపెనర్ సాహిల్ జాదవ్ ఒంటరి పోరాటం చేశాడు. కెప్టెన్ సిద్ధేష్ లాడ్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన సాహిల్ 30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు సాధించాడు. చిన్మయ్ సుతార్ (23), అర్జున్ దానీ (35) రాణించడంతో జట్టు కోలుకుంది. ఫాల్కన్స్ బౌలర్లలో ఆకాష్ పార్కర్ 3/22, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ యష్ దిచోల్కర్ 3/25 వికెట్లతో చెలరేగడంతో రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులకే పరిమితమైంది. ఈ గెలుపుతో ఫాల్కన్స్ టోర్నమెంట్లో తమ మొదటి పాయింట్లను ఖాతాలో వేసుకుంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: వాంఖడే స్టేడియంలో శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్.. మొదటి విజయం నమోదు..
-
Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
-
Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
-
Janvi Kapoor : ‘అచ్చియమ్మ’ కూడా అచ్చి రాలేదే!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!