MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఒక అదిరిపోయే వార్త. ప్రముఖ ఆడియో అండ్ వీడియో కంటెంట్ ప్లాట్ఫామ్ ‘కుకు ఎఫ్ఎమ్’, ‘కుకు టీవీ’ల మాతృసంస్థ అయిన బెంగళూరుకు చెందిన స్టార్టప్ ‘కుకు టెక్నాలజీస్’ పబ్లిక్ ఇష్యూ (IPO)కు వచ్చేందుకు సిద్ధమైంది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పెట్టుబడులు పెట్టిన ఈ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ, తాజాగా మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ దగ్గర రహస్యంగా ఐపీఓ పత్రాలను దాఖలు చేసింది.
భారీగా నిధుల సమీకరణే లక్ష్యం..
ఈ ఐపీఓ ద్వారా కుకు టెక్నాలజీస్ సుమారు రూ. 2,500 కోట్ల నుంచి రూ. 3,500 కోట్ల వరకు నిధులను సమీకరించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో కొత్త షేర్ల జారీతో పాటు ప్రస్తుత ఇన్వెస్టర్ల షేర్ల విక్రయం (OFS) కూడా ఉండనుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ తన మార్కెట్ విలువను ఏకంగా రూ. 15,000 కోట్లుగా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పబ్లిక్ ఇష్యూ కోసం కోటక్, జెఫరీస్, జేఎం ఫైనాన్షియల్, యాక్సిస్ క్యాపిటల్ వంటి ప్రముఖ సంస్థలను బ్యాంకర్లుగా ఎంపిక చేసుకుంది.
Also Read
- Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
- RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
- UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
లాభాల బాటలో దూసుకుపోతున్న కంపెనీ..
ప్రస్తుతం మొబైల్ వినియోగదారులలో ఒకటి లేదా రెండు నిమిషాల నిడివి గల ‘మైక్రో డ్రామాలు’ విపరీతమైన ప్రజాదరణ పొందుతున్నాయి. దీనిని కుకు సంస్థ చక్కగా ఉపయోగించుకుంది. ఆర్థిక సంవత్సరం 2025లోరూ. 240 కోట్ల ఆదాయం ఆర్జించిన ఈ కంపెనీ, ఆర్థిక సంవత్సరం 2026 నాటికి దాదాపు ఏడు రెట్లు వృద్ధి చెంది రూ. 1,400 కోట్ల ఆదాయాన్ని సాధించి సంచలనం సృష్టించింది. గతంలో ప్రకటనల ఖర్చుల వల్ల నష్టాల్లో ఉన్నప్పటికీ, ప్రస్తుతం కంపెనీ బ్రేక్-ఈవెన్ స్థాయికి చేరువైంది.
ధోనితో పాటు ప్రముఖుల మద్దతు..
లాల్ చంద్ బిసు, వికాస్ గోయల్, వినోద్ మీనన్లు 2018లో స్థాపించిన ఈ స్టార్టప్లో గ్రాండ్ ఆసియా, ఫండమెంటం, ఇండియా కోషంట్ వంటి దిగ్గజ ఇన్వెస్టర్లతో పాటు ఎంఎస్ ధోని కూడా పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం కుకు యాప్స్కు 40 కోట్లకు పైగా డౌన్లోడ్లు, 1 కోటికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో కంటెంట్ ఖర్చులను తగ్గిస్తూ, అమెరికా వంటి అంతర్జాతీయ మార్కెట్లలోకి కూడా అడుగుపెట్టేందుకు సంస్థ సిద్ధమవుతోంది. కొత్త తరం టెక్నాలజీ కంపెనీల ఐపీఓల వైపు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్న తరుణంలో వస్తున్న ఈ ఐపీఓ మార్కెట్లో హాట్ టాపిక్గా మారింది.
తాజావార్తలు
-
Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
-
Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!