MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఒక అదిరిపోయే వార్త. ప్రముఖ ఆడియో అండ్ వీడియో కంటెంట్ ప్లాట్ఫామ్ ‘కుకు ఎఫ్ఎమ్’, ‘కుకు టీవీ’ల మాతృసంస్థ అయిన బెంగళూరుకు చెందిన స్టార్టప్ ‘కుకు టెక్నాలజీస్’ పబ్లిక్ ఇష్యూ (IPO)కు వచ్చేందుకు సిద్ధమైంది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పెట్టుబడులు పెట్టిన ఈ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ, తాజాగా మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ దగ్గర రహస్యంగా ఐపీఓ పత్రాలను దాఖలు చేసింది.
భారీగా నిధుల సమీకరణే లక్ష్యం..
ఈ ఐపీఓ ద్వారా కుకు టెక్నాలజీస్ సుమారు రూ. 2,500 కోట్ల నుంచి రూ. 3,500 కోట్ల వరకు నిధులను సమీకరించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో కొత్త షేర్ల జారీతో పాటు ప్రస్తుత ఇన్వెస్టర్ల షేర్ల విక్రయం (OFS) కూడా ఉండనుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ తన మార్కెట్ విలువను ఏకంగా రూ. 15,000 కోట్లుగా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పబ్లిక్ ఇష్యూ కోసం కోటక్, జెఫరీస్, జేఎం ఫైనాన్షియల్, యాక్సిస్ క్యాపిటల్ వంటి ప్రముఖ సంస్థలను బ్యాంకర్లుగా ఎంపిక చేసుకుంది.
Also Read
- IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
- RBI Online Fraud Rule: యూపీఐ ఫ్రాడ్, బ్యాంకింగ్ స్కామ్లపై RBI బిగ్ అప్డేట్.. డబ్బు తిరిగి వచ్చే ఛాన్స్!
- Rule Change 1st July: జూలై 1 నుంచి మీ జేబుపై ప్రభావం.. మారుతున్న 7 ముఖ్యమైన నిబంధనలు ఇవే..!
- Swiggy Instamart: స్విగ్గీ ఇన్స్టామార్ట్లో రాజీనామాల బాంబ్ .. ఒకేసారి సీఓఓ, సీబీఓల రిజైన్ ! అసలేం జరుగుతుంది?
లాభాల బాటలో దూసుకుపోతున్న కంపెనీ..
ప్రస్తుతం మొబైల్ వినియోగదారులలో ఒకటి లేదా రెండు నిమిషాల నిడివి గల ‘మైక్రో డ్రామాలు’ విపరీతమైన ప్రజాదరణ పొందుతున్నాయి. దీనిని కుకు సంస్థ చక్కగా ఉపయోగించుకుంది. ఆర్థిక సంవత్సరం 2025లోరూ. 240 కోట్ల ఆదాయం ఆర్జించిన ఈ కంపెనీ, ఆర్థిక సంవత్సరం 2026 నాటికి దాదాపు ఏడు రెట్లు వృద్ధి చెంది రూ. 1,400 కోట్ల ఆదాయాన్ని సాధించి సంచలనం సృష్టించింది. గతంలో ప్రకటనల ఖర్చుల వల్ల నష్టాల్లో ఉన్నప్పటికీ, ప్రస్తుతం కంపెనీ బ్రేక్-ఈవెన్ స్థాయికి చేరువైంది.
ధోనితో పాటు ప్రముఖుల మద్దతు..
లాల్ చంద్ బిసు, వికాస్ గోయల్, వినోద్ మీనన్లు 2018లో స్థాపించిన ఈ స్టార్టప్లో గ్రాండ్ ఆసియా, ఫండమెంటం, ఇండియా కోషంట్ వంటి దిగ్గజ ఇన్వెస్టర్లతో పాటు ఎంఎస్ ధోని కూడా పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం కుకు యాప్స్కు 40 కోట్లకు పైగా డౌన్లోడ్లు, 1 కోటికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో కంటెంట్ ఖర్చులను తగ్గిస్తూ, అమెరికా వంటి అంతర్జాతీయ మార్కెట్లలోకి కూడా అడుగుపెట్టేందుకు సంస్థ సిద్ధమవుతోంది. కొత్త తరం టెక్నాలజీ కంపెనీల ఐపీఓల వైపు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్న తరుణంలో వస్తున్న ఈ ఐపీఓ మార్కెట్లో హాట్ టాపిక్గా మారింది.
తాజావార్తలు
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
-
Akash Deep Wedding: ధోనీ, కోహ్లీ, రోహిత్ వస్తే నా పెళ్లి ఆగిపోతుంది.. ఆకాశ్ దీప్ కామెంట్స్ వైరల్!
-
Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..